గెలుపుపై ఎవరి ధీమా వారిదే ..!
వచ్చే నెల నాలుగు దాకా తప్పని టెన్షన్
మార్కాపురం: మార్కాపురం నియోజకవర్గంలో ఎన్నికల వేడి పతాక స్థాయికి వెళ్లి ఫలితాలు ఎలా ఉంటుందో అని జుట్టు పీక్కుంటున్నారు.ఎవరు గెలవబోతున్నారు ? ఏ వర్గం ఎలా ఓట్లు వేసింది?ఏ గ్రామంలో ఎవరు ఎడ్జ్ లో ఉంటారు ?ఇదే ఇప్పుడు ఎక్కడ చూసినా ఏడతెరిపి లేని చర్చ.
మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం పట్టణంతో పాటు మార్కాపురం మండలం, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి మండలాలు ఉన్నాయి. దాదాపు రెండు లక్షల 20వేల ఓట్లు ఉన్నాయి. నియోజకవర్గంలో 84% ఓట్లు పోలయ్యాయి. ఇంత భారీ స్థాయిలో ఓట్లు పోల్ కావడం ఇదే ప్రథమం. మహిళలు, వృద్ధులు క్యూ కట్టి ఓట్లు వేశారని ఇది తమకు సానుకూలమైన ధోరణితో ఉందని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు లెక్కలు కడుతున్నాయి. అయితే టిడిపి నాయకులు మాత్రం అధికార పార్టీ ఆగడాల మీద కోపం తో, జగన్ సర్కార్ను ఓడించాలనే కక్షతో మహిళలు ఓట్లు వేశారంటూ లెక్కలు కడుతున్నారు.ఇలా ఎవరి లెక్కలు వారు కట్టుకుంటూ గెలుపు గుర్రాలు మావి అంటూ ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. ఇలా వచ్చే నెల నాలుగు వరకు ఈ ఆశల పల్లకి కొనసాగాల్సిందే. మార్కాపురం పట్టణంలో హోరాహోరీ పోరు సాగడంతో పాటు నాలుగైదు ప్రాంతాల్లో గొడవలు చేసుకోవడం గమనించాల్సిన విషయం. ఇక పట్టణంలో సాంప్రదాయ బద్ధంగా టిడిపికి మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నది, అయితే ఈ ఎన్నికల్లో అలా జరిగిందా లేదా అనే మీమాంస విశ్లేషకులను, నాయకులను తాలుస్తున్న అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నా రాంబాబు, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ సామాజిక వర్గ ఓట్లు కాస్త వైసీపీకి అనుకూలంగా ఉంటాయి అనేది ఒక వాదన. అదే జరిగితే టిడిపికి పట్టణంలో మెజార్టీ వచ్చే అవకాశాలు దాదాపు ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు. దీంతో వందైనా, వేయ్యి ఐన అది 5000 అయినా రాంబాబుకి పట్టణ ఓటర్లు మెజార్టీ ఇస్తారనేది పలు రాజకీయ నాయకుల లెక్క. ఇక మార్కాపురం మండలం గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు నిచ్చింది. ఈసారి కూడా తమకు 2000 నుండి 3000 దాకా మెజార్టీ వస్తుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి, కాగా ఈ మండలం నుండి ఈసారి టిడిపికి 2000 ఓట్లు మెజార్టీ వస్తుందని టిడిపి నాయకులు లెక్కలు కడుతున్నారు. ఇందుకు కారణంగా పలు గ్రామాల్లో వారికి వచ్చే ఓటింగ్ సరళి అంచనాలు చేస్తున్నారు. ఇక తర్లుపాడు మండలంలో ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర నుండి అటు ఇటుగా నువ్వా నేనా అన్నట్లు సాగుతుందని టిడిపికి ఎడ్జి ఉంటుందని భావిస్తూ వచ్చారు. బుడ్డపల్లి, సూరేపల్లి, కేతగుడిపి వండి గ్రామాల్లో టిడిపికి అత్యధిక ఓట్లు పోలయ్యాయి అని దాంతో 2000 మెజార్టీ మండలంలో టిడిపి మూటకట్టుకుంటుందని కొందరి అభిప్రాయం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం పదిహేను వందల ఓట్ల మెజార్టీ కచ్చితంగా వైఎస్ఆర్ సీపీకే వస్తుందని భావిస్తున్నారు.ఇక కొనకనమిట్ల మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఓటింగ్ ఉంటుందని అందరూ భావించారు, కాగా ఇక్కడ ఒక సామాజిక వర్గం వైసీపీకి కాస్త దూరంగా ఉన్నది అనే పుకార్లు లేచాయి, అయితే ఆ పుకార్లాన్ని వట్టిదేనని వైసీపీకి కచ్చితంగా 3,000 ఓటింగ్ మెజార్టీ ఉంటుందని స్థానిక నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ మాకే రెండు వేల మెజారిటీ వస్తుంది అని లెక్కలు కడుతున్నారు. చివరగా పొదిలి మండలంలో వైసీపీకి సానుకూలమైన వాతావరణం, పొదిలి పట్టణంలో టిడిపికి సానుకూలమైన వాతావరణం ఉంటుందని, మొత్తం మీద 1000 నుంచి 2000 వైసీపీకి మెజార్టీ ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వైసిపి నాయకులు మాత్రం మూడు వేలకు పైచిలుకు ఓట్లు మెజార్టీ తమకు ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తుండగా, టిడిపి నాయకులు పొదిలి పట్టణంలో భారీగా టిడిపికి మెజార్టీ వస్తుందని, మండల ఓట్లను దాటి 2000 వరకు టిడిపికే ఓట్లు మెజార్టీగా ఉంటాయని లెక్కలు కడుతున్నారు.ఎటొచ్చి గెలుపు పక్కా మాదే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.టీడీపీ మాత్రం వంద ఓట్ల మెజార్టీతో అయిన మేమే గెలుస్తున్నాం అని ధీమాగా ఉంది.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.