ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాలన్నదే జగనన్న ఆరోగ్య సురక్షా లక్ష్యం

ఎమ్మెల్యే అన్నా రాంబాబు

On
ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాలన్నదే జగనన్న ఆరోగ్య సురక్షా లక్ష్యం

గిద్దలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల అందరి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికే జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టడం జరిగిందని ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. శుక్రవారం గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని జడ్పీ బాలికల హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్షా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యమే లక్ష్యం గా జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమాన్ని ప్రారంబించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉచిత వైద్య పరీక్షలు, సినియర్ వైద్యుల నుండి ఉచిత సంప్రదింపులు, ఉచిత మందులు, పౌరులు ఇంటి వద్దనే ఉండి అన్ని వైద్య సేవలను అందించి ప్రతి ఇంటికి 100 శాతం నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. వైద్య పరీక్షల్లో గుర్తించిన ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు సీనియర్ వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందితో ప్రతి గ్రామ,వార్డు సచివాలయంలో ముందుగా షెడ్యూల్ చేయబడిన వేదికలలో ఒక రోజు వైద్య క్యాంపులు నిర్వహించబడతాయన్నారు. ఈ క్యాంపుల్లో ప్రజలకు అవసరమైన మందులను ఉచితంగా అందించడంతో పాటు అవసరమైతే తదుపరి నిరంతర చికిత్స కోసం విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు తదితరుల ప్రాంతాల పరిధిలోని సీనియర్ వైద్యులకు సిఫార్సులు కూడా చేయడం జరుగుతుందన్నారు.14 రోజుల ముందు, ప్రత్యేకంగా శిక్షణ పొందిన సహాయక నర్సు, ఎఎన్ఎం ,కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఇంటింటికీ వెళ్లి డయాగ్న్పొస్టిక్ హెల్త్ స్క్రీనింగ్ నిర్వహిస్తారన్నారు.అంతే కాకుండా కొన్ని పరీక్షలను ర్యాపిడ్ టెస్ట్ లు అక్కడికక్కడ నిర్వహిస్తారన్నారు. బీపీ, షుగర్, హేమోగ్లోబిన్, మూత్ర, మలేరియా, డెంగు, చార్కోల్ టెస్ట్ పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. వైద్య సిబ్బందితో సహా నలుగురు వైద్యులు ప్రతి గ్రామ,వార్డు సచివాలయంలో ముందుగా షెడ్యూల్ చేయబడిన వేదిక వద్ద ఒక రోజు శిబిరాన్ని నిర్వహిస్తారన్నారు. ఈ శిబిరంలో ఇసిజి మెషిన్లు, అదనపు పరిక్షలు, ఇతర చికిత్సలతో సహా వైద్య సదుపాయాలు ఉంటాయన్నారు. రోగులకు సూచించిన మందులను అక్కడికక్కడే ఉచితంగా అందజేస్తారన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని 65 వేల మంది వైద్యులు, మరియు వైద్య సిబ్బంది ని నియమించడం జరిగిందన్నారు. నియోజకవర్గ పరిధిలోని 20 వైద్యశాలల్లో కూడా పూర్తిగా వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే అన్నా వైద్య పరీక్షలు చేయించున్నారు. సకల వసతులతో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నా కోరారు. పలువురు వైద్య సిబ్బంది, పలు శాఖల అధికారులు, వాలంటీర్ లు, గృహ సారదులు, సచివాలయ కన్వీనర్ లు, అందరి భాగస్వామ్యం తోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముందుగా పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది ఎమ్మెల్యే అన్నాను ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య,వైస్ చైర్మన్లు ఆర్డీ రామకృష్ణ, దీపికా,నగర పంచాయతీ కౌన్సిలర్లు, కో -ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు, వైద్య సిబ్బంది, సచివాలయ కన్వీనర్లు, గృహ సారదులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News