ముస్లింల పాలనలో హైదరాబాద్ చరిత్ర వక్రీకరణకు గురైందా?

10 వేల సంవత్సరాల నాటి శాసనాలు ఏం చెబుతున్నాయి?

On
ముస్లింల పాలనలో హైదరాబాద్ చరిత్ర వక్రీకరణకు గురైందా?

హైదరాబాద్: హైదరాబాద్‌గా పిలిచే మన భాగ్యనగరానికి 400 ఏళ్ల చరిత్ర ఉన్న చారిత్రక నగరంగా పేరుంది. నవాబులు నిర్మించిన నగరంగా హైదరాబాద్ చరిత్ర వక్రీకరణలకు గురైంది.  కుతుబ్ షాహీ వంశానికి చెందిన కులీ కుతుబ్ షా 400 ఏళ్ళ క్రితం హైదరాబాద్‌ను నిర్మించారనే ప్రచారం వాడుకలో ఉంది. మరి అంతకుముందు.. హైదరాబాద్ లేదా..? ఈ పేరుతో లేకపోయినా.. ఇక్కడ చారిత్రక ఆనవాళ్లు లేవా..? అంటే.. ఉన్నాయి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 వేల సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. అరుదైన, విశిష్టమైన హిందూ నాగరికత ఈ ప్రాంతంలో వెల్లి విరిసింది. కానీ, ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నట్టుగా.. వింటున్నట్టుగా, చదువుకుంటున్న చరిత్రను.. మనపై రుద్దిందే కానీ.. అదే వాస్తవం కాదు. దాచేస్తే దాగుతుందా నిజం...? మనల్ని ఏలుతున్న ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా.. లేక తప్పుడు ప్రచారం చేసినా.. యధార్థం బయటకు రాక తప్పదు. అలా హైదరాబాద్ చరిత్ర.. కుతుబ్ షాహీల కంటే ముందు నుంచీ ఉంది. ఇంకా చెప్పాలంటే క్రీస్తు పూర్వం.. ఇంకా.. దాదాపు 10 వేల ఏళ్ల క్రితం నాటిది. హైదరాబాద్ చరిత్రపై అధ్యయనం చేస్తున్న పురాతత్వ శాస్త్రవేత్తలు, చరిత్రకారులు  చారిత్రక శాసనాలతో కూడిన పక్కా ఆధారాలతో,  ముక్త కంఠంతో చెబుతున్న మాట ఇది.. 

 ఇప్పటికి 400 ఏళ్ళ క్రితం.. 1591 లో ప్లేగు వ్యాది ప్రబలడంతో.. అప్పుడు గోల్కొండగా పిలిచే గొల్లకొండను కేంద్రంగా చేసుకుని పాలిస్తున్న కుతుబ్ షాహీలు.. ప్రస్తుతం చార్మినార్ ఉన్న ప్రాంతానికి వచ్చి ఆ కట్టడాన్ని నిర్మించారు. దానికి భాగ్ నగరం అని పేరు పెట్టారు. ఎక్కువగా మొక్కలు, చెట్లు, తోటలతో ఉండటంతో.. ఆ పేరుతో పిలిచేవారు. అయితే అంతకుముందు హైదరాబాద్ లేదా..? అంటే ఉంది కానీ.. ఆ పేరుతో కాదని చరిత్రకారులు చెబుతారు. కుతుబ్ షాహీలు కేంద్రంగా చేసుకున్న గోల్కొండ కోట.. అంతకుముందు ఏలిన కాకతీయులు నిర్మించిందే. దాన్ని గొల్లకొండగా పిలిచేవారు. అంతకంటే ముందు.. అంటే 12 వ శతాబ్దంలో కల్యాణీ చాళుక్యుల కాలంలో.. ఆనాటి శాసనాలు గతంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బయటపడ్డాయి. ప్రస్తుతం ఓల్డ్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర.. ఇప్పటికీ కల్యాణీ చాళుక్యుల నాటి శాసనం ఒకటి కనిపిస్తుంది. అలాగే సరూర్ నగర్ ఇన్నర్ రింగ్ రోడ్డులోని కర్మాన్ ఘాట్ ఆంజనేయస్వామి ఆలయంలో కూడా కల్యాణీ చాళుక్యుల నాటి రెండో శాసనం కనిపిస్తుంది. 

 ఇక వేములవాడ చాళుక్యుల కాలం నాటి ఆనవాళ్లు కూడా ప్రస్తుత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తాయి. నేటి చిల్కూరు బాలాజీ శివాలయంలో.. 9 వ శతాబ్ధం నాటి శాసనం బయటపడింది. అంటే కులీకుతుబ్ షాలు ఈ ప్రాంతానికి రావటానికి కొన్ని వందల సంవత్సరాల క్రితమే అద్భుతమైన నాగరికతకు ఈ ప్రాంతం కేంద్రంగా ఉందని చరిత్రకారులు చెబుతున్నమాట. అంతకుముందు అంటే దాదాపు క్రీ.శ. 612 వ సంవత్సరం నాటి రెండవ పులకేసి శాసనం.. హైదరాబాద్ లో దొరికింది. అంటే అప్పటికి ఇప్పుడు మనం చదువుకుంటున్న మొఘలులు, ముస్లీం పాలకులు ఎవరూ మనదేశంలో అడుగుపెట్టలేదు. అప్పటికీ మన హైదరాబాద్ లో జనసంచారం ఉంది. హైందవ నాగరికత వెల్లివిరిసింది. అంతేకాదు.. అంతకుముందు.. విష్ణుకుండినులు కీసరగుట్టను కేంద్రంగా చేసుకుని ఏలిన సమయంలో.. హైదరాబాద్ లో ఆనాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. 

 పురావస్తు శాస్త్రవేత్తల పరిశోధనల్లో.. పాత రాతి యుగం ఆ తరువాత ఆధునిక  యుగం నాటి ఆనవాళ్లు కూడా హైదరబాద్ పరిసర ప్రాంతాల్లో చాలాచోట్ల  బయటపడ్డాయి. నాగార్జున కొండలోని శ్రీపర్వతాన్ని కేంద్రంగా చేసుకుని ఏలిన ఇక్ష్వాకుల కాలంలో.. ఆనాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. ప్రస్తుత హైదరాబాద్ ఛైతన్యపురి పరిసర ప్రాంతాల్లో ఇక్ష్వాకుల కాలం నాటి కుండపెంకులు, ఇటుక రాళ్లు వెలుగుచూశాయి. చాలాచోట్ల పునాదుల కోసం తవ్విన సమయంలో.. ఇవి బయటపడ్డాయి. సంగారెడ్డి జిల్లా కందిలో అయితే ఏకంగా ఇక్ష్వాకుల ఆలయమే బయటపడింది. బండరామేశ్వరపల్లి, పటాన్ చెరువు వంటి ప్రాంతాల్లో శాతవాహనుల కాలం నాటి ఆనవాళ్లు చాలా బయటపడ్డాయని.. చరిత్రకారులు చెబుతున్నారు. రాజేంద్రనగర్ లోని పులిమావి అనే పేరుతో శాతవాహన స్థావరం కూడా ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాల్లో ఇనుప యుగపు నాటి సమాధులున్నాయి. కొత్తగూడలోని కేతేపల్లి మూసీనది ఒడ్డున కొత్తరాతి యుగపు ఆనవాళ్లు బయటపడ్డాయి. జూబ్లీహిల్స్ పక్కనే ఉన్న బీఎన్ఆర్ హిల్స్ ఏరియాలో తాబేలు గుండుకింద కొత్త రాతియుగపు ఆనవాళ్లైన రాతి గొడ్డళ్లు కూడా బయటపడ్డాయి. 

 ఆనాడు హైదరాబాద్ అనే పేరు లేకపోయినా.. ఇక్కడ మధ్యరాతి యుగం నుంచి జనసంచారం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని.. చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. అంటే దాదాపు 10 వేల ఏళ్ల క్రితం నుంచి కూడా ఇది ఆవాసయోగ్యమైన ప్రాంతంగా ఉన్నట్లు గుర్తించారు. కానీ కాలక్రమేణా.. ఇప్పుడున్న కొన్ని నిర్మాణాలు కుతుబ్ షాహీల కాలంలో నిర్మించడంతో.. అదే పూర్తి హైదరాబాద్ నిర్మాణంగా ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ నగరానికి ముస్లింలు వచ్చాకే నాగరికత వచ్చిందనేలా ఆ ప్రచారాలు కొనసాగుతున్నాయి. కానీ హైదరాబాద్ అంటే కేవలం 400 ఏళ్ల చరిత్ర మాత్రమే కాదని తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మన పాఠ్యాంశంలో చేర్చాలి. అప్పుడే ప్రస్తుత పుస్తకాల్లో, ప్రచారంలో ఉన్న చరిత్ర మాత్రమే నిజమైనది కాదనే వాస్తవం వెలుగులోకొస్తుంది. 10వేల సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ అద్భుతమైన హైందవ నాగరికత మనుగడ సాగించిందనే సత్యం ఈనాటి తరానికి తెలుస్తుంది.

IMG-20231018-WA0034

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News