ఒక్క అవకాశం ఇవ్వండి...ప్రజల రుణం తీర్చుకుంటా

టీడీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి కందుల నారాయణరెడ్డి

On
ఒక్క అవకాశం ఇవ్వండి...ప్రజల రుణం తీర్చుకుంటా

మార్కాపురం: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తనకు ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తే‌, మీ రుణం తీర్చుకుంటానని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి కందుల నారాయణరెడ్డి అన్నారు. గురువారం ఆయన పట్టణంలోని 31 వ వార్డులో బాబుకు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోయిందని, వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ దుష్ట పాలన పోవాలంటే, రాష్ట్రానికి మంచి జరగాలంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కందుల పేర్కొన్నారు. ప్రజలు విజ్ఞతతో వచ్చే ఎన్నికల్లో మార్కాపురం ఎమ్మెల్యేగా తనను, ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడుని గెలిపించాలని ఆకాంక్షించారు.ఈ వార్డు తన సొంత వార్డ్ అని, గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశానని తనకు ఆ భగవంతుడు పునర్జన్మ ప్రసాదించాడని  తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి చూపిస్తానని మార్కాపురం ప్రత్యేక జిల్లా చేయిస్తానని, సత్వరమే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరాకు త్రాగు సాగునీరు అందిస్తారని  మాట ఇచ్చారు. వార్డు ఇన్చార్జి కొమ్మిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి సత్యనారాయణ,33వ వార్డు కౌన్సిలర్ నాలి కొండయ్య యాదవ్, కనిగిరి బాల వెంకటరమణ ,పఠాన్ ఇబ్రహీం, ఆలంపల్లి శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.

IMG-20231109-WA0029

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News