జగన్ నడుపుతున్నది ప్రభుత్వమా...ప్రైవేటు సైన్యమా?

రాష్ట్ర టిడిపి మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు మిర్జా మాజేద్ రజా

On
జగన్ నడుపుతున్నది ప్రభుత్వమా...ప్రైవేటు సైన్యమా?

పామరు: తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిరవధిక సమ్మెకు దిగిన అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లకు టీడీపీ నాయకులు రజా  సంఘీభావం తెలిపారు.. ఈ సందర్భంగా అంగన్ వాడీ వర్కర్స్, హెల్పర్ల ప్రతినిధులతో రజా  మాట్లాడారు. ప్రభుత్వం తమ పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరిస్తోందని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన చెందారు. డిమాండ్ల పరిష్కారంకోసం తాము సమ్మె చేస్తుంటే, వాలంటీర్లతో అంగన్ వాడీ సెంటర్ల తలుపులు బద్దలగొట్టి స్వాధీనం చేసుకున్నరన్నారు. తమపై తప్పుడు కేసులు నమోదు చేశారని చెప్పారు. అంగన్వాడీలను రెగ్యులర్ చేయాలని, అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలనే డిమాండ్ లతో అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి..మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా ప్రమోషన్ ఇవ్వాలి. ఐసీడీఎస్ కు బడ్జెట్ పెంచాలి..ప్రీస్కూల్ ను బలోపేతం చేయాలి. హెల్పర్ ప్రమోషన్లలో నిబంధనలు రూపొందించాలి. సర్వీస్ లో ఉండి చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, బీమా ఇవ్వాలి. లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి. ఎఫ్ఆర్ఎస్ యాప్ ను రద్దు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేవరకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. 2017 నుండి పెండింగ్ లో ఉన్న టీఏ, ఇతర బకాయిలు విడుదల చేయాలి. అయితే జగన్ సర్కార్ ఇవేమి చేయకుండా, ఆందోళన చేస్తున్న కార్యకర్తల పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తుంది అని రజా ఆరోపించారు.

 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నడుపుతున్నారో, ప్రైవేటు సైన్యాన్ని నడుపుతున్నారో అర్థం కావడం లేదు అని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను పనికట్టుకుని వేధించడం దారుణం అని ,అంగన్ వాడీ సెంటర్ల తాళాలు బద్ధలు గొట్టే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారు? అంటూ ప్రశ్నించారు. టిడిపి-జనసేన నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలపై వైసీపీ ప్రభుత్వం నిరంకుశంగా పెట్టిన అక్రమ కేసులను ఎత్తేస్తామని, అంగన్వాడీ యూనియన్లతో చర్చించి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.చంద్రబాబు నేతృత్వంలో రాబోయే ప్రజా ప్రభుత్వంలో అంగన్వాడీలు రోడ్డెక్కే పరిస్థితులు రాకుండా చూస్తామని బరోసా ఇచ్చారు.అంగన్వాడీలు చేస్తున్న న్యాయబద్దమైన పోరాటానికి తెలుగుదేశంపార్టీ సంపూర్ణ మద్దతునిస్తుందని వారికి సంఘీభావమును ప్రకటించారు.

IMG_20231115_105626

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

నేటి పంచాంగం:  *సోమవారం, మే 19, 2025* నేటి పంచాంగం:  *సోమవారం, మే 19, 2025*
*ఓం శ్రీ గురుభ్యోనమః*  *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*      *ఉత్తరాయనం - వసంత ఋతువు*     *వైశాఖ మాసం - బహుళ పక్షం*   తిథి      : *సప్తమి* రా1.28...
బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్ ఇచ్చిన భారత్
ప్రధాని మోదీతో లోకేష్ భేటీ
నేటి పంచాంగం: *ఆదివారం, మే 18, 2025*
టీటీడీ వేద పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
నీటి ఎద్దడి పై గళం విప్పిన సర్పంచ్ లు
నెమలి గుండంలో భారీ వర్షం - నేలకొరిగిన వృక్షాలు