ఎరిక్షన్ బాబు మాకు వద్దు!

- ఆయన ఉంటే గెలుపు కష్టమంటున్న మరో వర్గం

On
ఎరిక్షన్ బాబు మాకు వద్దు!

అగ్ని న్యూస్,ఎర్రగొండపాలెం:  తెలుగుదేశం పార్టీలో గ్రూపుల మధ్య మాటల యుద్ధాలు పరాకాష్టకు చేరాయి. గతంలో ఒక వర్గం నియోజకవర్గ తెలుగుదేశం పెద్దగా ఉన్న  రవీంద్రను తీవ్రంగా దుర్భాషలాడటంతో ప్రస్తుతం నియోజకవర్గంలో గ్రూపులు ఉన్నాయని తేటతలమైంది.గురువారం పట్టణంలోని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి ఆంజనేయులు నివాస గృహంలో జరిగిన సమావేశంలో హాజరైన ప్రతి ఒక్కరు ఎరిక్షన్ బాబు మాకు వద్దు ఆయన వల్ల పూర్తిగా పార్టీ బ్రష్టు పట్టిందంటూ ఆరోపించారు. నియోజకవర్గంలో తెదేపా గెలుపు అందని ద్రాక్ష గా మారిన కూడా ప్రస్తుతం పార్టీ సమృద్ధిగా ఉందనే తరుణం లో ఎరిక్షన్ బాబు పనితీరు వలన తిరిగి ఓటమి చెందే అవకాశం ఉందని వారు తెలిపారు. తెలుగుదేశం పార్టీ బరిలో నిలిచిన ప్రతిసారి ఓటమి చెందుతుందనే లెక్కలు ఉన్నా,ఎంతో నమ్మకంతో ఎరిక్షన్ బాబును నాడు అందరం ప్రతిపాదించామని ఆయన పనితీరు సాధారణ ఎంపీపీ స్థాయిలోని ఉండిపోయింది అన్నారు. నియోజకవర్గంలో ప్రతి పంచాయతీలో గ్రూపులను ఏర్పాటు చేసి ఓకే పార్టీ చెందిన తామే ఒకరిపై ఒకరు పరిస్థితి  కేసులు పెట్టుకొనవలసిన పరిస్థితి నెలకొందన్నారు. 96 పంచాయతీలలో ఇదే పద్ధతి నెలకొందని వర్గాలుగా పార్టీ విడిబడిందన్నారు. ఒకవై పది స్థానం అందర్నీ కలుపుకొని పోవాలని సూచించిన కూడా ఎరిక్షన్ బాబు మాత్రం గ్రూపులను ఏర్పాటు చేయటం  అసభ్య పదజాలంతో దూషిస్తుంటే నవ్వు కొనడం రివాజుగా. మారిందన్నారు. నియోజకవర్గంలో ఏనాడు తెలుగుదేశం పార్టీలో  ఏనాడుగ్రూపులు లేవని కానీ  ఆయన రాకతో నియోజకవర్గ రెండు వర్గాలుగా విడిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తూ ఓటు బ్యాంకు కలిగిన నాయకులను విస్మరించి  పరోక్షంగా పార్టీ ఓటమికి కంకణం కట్టుకున్నట్లుగా తమకు కనబడుతుంది అన్నారు. తమకు ఎవరితో పనిలేదని ఎవరిని కలవవలసిన అవసరం అంతకన్నా లేదని గెలిస్తే శాసనసభ్యులు అవుతాను లేని పక్షంలో ఇన్చార్జినవుతానంటూ చెప్పటం ఆయనకు పార్టీ మీద ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుందన్నారు. గెలిచిన ఓడిన నేనే ఇంచార్జ్ అంటూ పార్టీలోని పెద్దలను సైతం విమర్శిస్తూ  విభజించు పాలు అన్న రీతుల ప్రవర్తిస్తున్నారు అన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పై ఉన్న అసమ్మతి మనకు మన పార్టీకి ఎరిక్షన్ బాబు  పనితీరు వలన నియోజకవర్గంలో నిజమైన తెదేపా నాయకులు కార్యకర్తలు రానున్న రోజులలో తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం నెలకొందన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ఎస్సీలు అధికంగా ఉన్నారని  వారిని సైతం పక్కనపెట్టిన ఏకైక నాయకుడు  ఎరి క్షన్ బాబు అన్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం అందించాలని ఎరి క్షన్ బాబు బరిలో నిలిస్తే ఓటమి మాత్రం తధ్యమని గ్రూపులను ప్రోత్సహిస్తూ ఓకే పార్టీకి చెందిన తమలో తామే కేసులు నమోదు చేసుకుంటూ సీనియర్ నాయకుల ను దూరం పెడుతూ పార్టీలని ఒక వర్గం వారితో తమను దుర్భాషలాడిస్తూ పబ్బం గడుపుకుంటుంటే భవిష్యత్తులో తాము పార్టీలో ఇమిడే పరిస్థితి లేదని వారు తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా అధిష్టానం పునరాలోచించి గ్రూపుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగించాలని, ఆయన పనితీరు మార్చుకునేలా హెచ్చరించాలని ఇరువర్గాల మధ్య ఉన్న అంతరాలను తొలగించాలని వారు కోరుతున్నారు. పార్టీ అభ్యర్థి ఎవరైనా తమకు సమతమే అని  కానీ  పార్టీ లో గ్రూపులను ఏర్పాటు చేస్తుంటే  పార్టీ ఓటమికి కారణమవుతున్న వారిని అధిష్టానం పునర్ ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేకూరి ఆంజనేయులు,షేక్ జిలాని వడ్లమూడి లింగయ్య అనిల్  వెంకటరెడ్డి సీతయ్య రమణారెడ్డి వెంకటేశ్వర్లు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Screenshot_2024-02-14-16-51-16-09_99c04817c0de5652397fc8b56c3b3817

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

ఘోర రోడ్డు ప్రమాదం ఘోర రోడ్డు ప్రమాదం
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోగా ఈ సంఘటన లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద లారీ, కారు ఢీకొన్నాయి....
తండ్రి చేతిలో కొడుకు హతం...
నేటి పంచాంగం:  *శుక్రవారం, మే 23, 2025*
డియల్డివో గా బాధ్యతలు స్వీకరించిన బాలూ నాయక్ 
Video: ఆర్కే బీచ్ రోడ్  ఆన్ మూల్ విల్లాలో  శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం నమూనా  ప్రారంభం
ఏసీబీ వలలో మిషన్ భగీరథ ఏఈ
ఆర్టీసీ బస్సు బీభత్సం