Category
State
State 

యువతి అనుమానాస్పద మృతి 

యువతి అనుమానాస్పద మృతి  వైఎస్ఆర్ జిల్లా: కలసపాడు  మండలం చింతలపల్లి గ్రామ సమీపంలో యువతి అనుమానాస్పద మృతి చెందారు.మృతురాలు ఎలిజిబెత్ 22 సం,.పొరుమామిల్ల మండలం కవలకుంట్ల గ్రామంగా గుర్తింపు.కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన  పోలిసులు.
Read More...
State 

సూట్‌ కేసులో గుర్తు తెలియని మహిళ మృతదేహం?

సూట్‌ కేసులో గుర్తు తెలియని మహిళ మృతదేహం? తెలంగాణ: బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం సాయంత్రం సూట్‌ కేసులో గుర్తుతెలియని మహిళా మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యమైంది. సీఐ ఉపేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం..  బాచుపల్లిలోని విజయదుర్గ ఓనర్స్‌ అసోసియేషన్‌ కాలనీ , డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ గోడను ఆనుకొని ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో ఓ బ్యాగ్‌ లో నుంచి దుర్వా సన వస్తున్నట్లు స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. సూట్‌ కేసులో సుమారు 25 నుంచి 35 ఏండ్ల మధ్య వయసున్న మహిళ మృతదేహం కుళ్లిన స్థితిలో బయటపడింది. ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read More...
State 

రీల్స్ చేస్తుండగా విషాదం..ఆరుగురు అమ్మాయిలు మృతి

రీల్స్ చేస్తుండగా విషాదం..ఆరుగురు అమ్మాయిలు మృతి ఒకప్పుడు టిక్‌టాక్ రీల్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉండేది. టిక్‌టాక్‌లో ఫేమస్ కావాలన్న ఉద్దేశ్యంతో చాలా మంది పిచ్చి పిచ్చి పనులు చేసేవారు. ఈ నేపథ్యంలోనే ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ప్రతీ నిత్యం ఏదో ఒక న్యూస్ టిక్‌టాక్ విషాదాల గురించి వచ్చేది. టిక్‌టాక్ దేశంలో బ్యాన్ అయిన తర్వాత.. ఆ స్థానాన్ని ఇన్‌స్టాగ్రామ్ తీసుకుంది. ఇన్‌స్టాలో ఫేమస్ అవ్వాలని చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలి వాళ్ల దగ్గరి వరకు ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, ఓ ఆరుగురు అమ్మాయిలు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వీడియో చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. నదిలో మునిగి చనిపోయారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, ఆగ్రా సమీపంలోని నగ్లా స్వామి గ్రామానికి చెందిన ఆరుగురు అమ్మాయిలు రీల్స్ వీడియో తీయడానికి యమునా నది దగ్గరకు వెళ్లారు. నది వారి ఇళ్లకు 800 మీటర్ల దూరంలోనే ఉంది. ఆ ఆరుగురు అమ్మాయిలు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నదిలోకి దిగారు. వీడియో తీసుకుంటూ ఉన్నారు. అనుకోని విధంగా ఓ అమ్మాయి లోతుగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లింది. నీటిలో మునిగిపోతూ ఉంది. ఇది గమనించిన మిగిలిన వాళ్లు ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు. వారు కూడా నీటిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న ఓ ఇద్దరు అబ్బాయిలు వారిని రక్షిద్దామని అనుకున్నారు. వారి వల్ల కాలేదు. దీంతో ఆరుగురు అమ్మాయిలు నీటిలో కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు, పోలీసులు నది దగ్గరకు చేరుకున్నారు. నీటిలో కొట్టుకుపోయిన వారి కోసం గాలించారు. సంఘటన జరిగిన ప్రదేశం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఆరుగురు దొరికారు. వారిలో నలుగురు అప్పటికే చనిపోయి ఉన్నారు. మిగిలిన ఇద్దర్నీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు సీపీఆర్ చేయటంతో బతికారు. అయితే, కొన్ని గంటల తర్వాత వారు కూడా చనిపోయారు. చనిపోయిన వారిలో ముస్కాన్ అనే అమ్మాయికి కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థం అయింది. నవంబర్ నెలలో పెళ్లి ఉంది. ఇంతలోనే ఇలా జరిగింది. ఈ ఆరుగురు అమ్మాయిలు ఒకే కుటుంబానికి చెందిన వారు. అక్కాచెల్లెళ్లు అవుతారు. వీరి మృతితో కుటుంబంతో పాటు గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి..
Read More...
State 

జాతీయ రహదారిపై బోల్తా పడిన టెంపో

జాతీయ రహదారిపై బోల్తా పడిన టెంపో తిరుపతి:  - ఓజిలి రాచపాళెం జాతీయ రహదారిపై బోల్తా పడిన టెంపో  - 14 మంది టెంపులో ఉండగా.. ముగ్గురు మహిళలకి తీవ్ర గాయాలు.. - క్షతగాత్రులంతా హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర ప్రాంతానికి చెందిన వారిగా చెబుతున్న పోలీసులు.. - గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలింపు
Read More...
State 

అదుపుతప్పి బైక్ పైకి దూసుకెళ్లిన టిప్పర్..తీవ్రంగా గాయపడ్డ వాహనదారులు

అదుపుతప్పి బైక్ పైకి దూసుకెళ్లిన టిప్పర్..తీవ్రంగా గాయపడ్డ వాహనదారులు నంద్యాల జిల్లా:  నందికొట్కూరు హైవేపైన రోడ్డుకు మరోవైపు వెళ్తున్న బైక్ ను అదుపుతప్పి ఢీకొట్టిన టిప్పర్, తీవ్రంగా గాయపడ్డ వాహనదారులు ఎల్లా గౌడ్, రెహమాన్ .టిప్పర్ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించిన పోలీసులు.
Read More...
State 

బంగాళాఖాతంలో వాయుగుండం

బంగాళాఖాతంలో వాయుగుండం వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పారాదీప్నకు తూర్పు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో ఇది ఏర్పడింది. 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణం శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తీరం వెంట కోస్తా జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది....
Read More...
State 

శ్రీశైలం జలాశయంకు పెరుగుతున్న వరద

శ్రీశైలం జలాశయంకు పెరుగుతున్న వరద శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరదఇన్ ఫ్లో 86,379 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో నిల్‌పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుప్రస్తుత నీటిమట్టం 817.70 అడుగులు
Read More...
State 

ఈసారి కడప క్లీన్ స్వీప్ ... టీడీపీ అధినేత చంద్రబాబు

ఈసారి కడప క్లీన్ స్వీప్ ... టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడు సూపర్ హిట్  - మీ రుణం తీర్చుకుంట - సీఎం చంద్రబాబు  
Read More...
State 

మహానాడు లో మన మార్కాపురం నాయకులు 

మహానాడు లో మన మార్కాపురం నాయకులు  కడప: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు లో మార్కాపురం నుంచి పెద్ద ఎత్తున టిడిపి నాయకులు పాల్గొన్నారు. బుధవారం మహానాడు సభ వేదిక వద్ద టిడిపి వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జునరావు, పార్టీ నాయకులు మాలపాటి వెంకట రెడ్డి, పఠాన్ హుస్సేన్ ఖాన్, పఠాన్ ఇబ్రహీం, సయ్యద్ గఫార్ లు.
Read More...
State 

రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ 

రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్  తెలంగాణ: ఖమ్మం జిల్లా ఏదులాపురం పురపాలిక పరిధిలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ అరుణ, డాక్యుమెంట్ రైటర్ వెంకటేష్  ఖమ్మం మండలం తల్లంపాడుకు చెందిన ఒక వ్యక్తి తన రెండెకరాల భూమిని కొడుకు పేరున గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్‌ను కలవగా, రూ.50 వేలు డిమాండ్ చేసిన అరుణ రూ.30 వేలు ఇస్తామని ఒప్పందం చేసుకొని, ఏసీబీకి సమాచారం ఇచ్చిన బాధితుడు డాక్యుమెంట్ రైటర్ వెంకటేష్ కారులో రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
Read More...
State 

భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఒకరు మృతి ఇద్దరి పరిస్థితి విషమం

భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఒకరు మృతి ఇద్దరి పరిస్థితి విషమం భూపాలపల్లి జిల్లా: రెండు కార్లు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన భూపాలపల్లి జిల్లా కాటారం మండలం శివారులోని నస్తూరి పల్లి గ్రామం వద్ద ఆదివారం సాయంత్రంచోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న దుర్గోజి కుటుంబ సభ్యులు 9 మందితో కలిసి కారులో కాలేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్లి తిరిగి వస్తుండగా...  సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన రేషన్ డీలర్ లక్ష్మీనరసింహా రావు కుటుంబం ఐదుగురు కుటుంబ సభ్యులతో కలిసి కారులో కాలేశ్వరం వెళుతు న్నారు. ఈ క్రమంలో కాటారం- నస్తూరుపల్లి  మార్గమధ్యంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి, దీంతో తవేరా వాహనంలో ప్రయాణిస్తున్న రేషన్ డీలర్ లక్ష్మీనారాయణ రావు కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు, కాటారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అంబు లెన్స్ లో భూపాలపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ వాహనంలో చిక్కు కోగా జేసీబీ సహాయంతో అతన్ని బయటకు తీశారు.  అనంతరం పోలీస్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ క్రమంలో వీరిని వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు.  ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా కాటారం పోలీసులు జేసీబీ సహాయంతో రెండు కార్ లను రోడ్డుపై నుండి ప్రక్కకు జరిపించారు. కియా కార్లో ప్రయాణిస్తున్న భక్తులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు.  కారు లోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో త్రుటిలో ప్రమాదం నుండి తప్పించు కున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు న్నట్లు కాటారం పోలీసులు తెలిపారు
Read More...
Stories  State 

కవిత కొత్త పార్టీ ?

కవిత కొత్త పార్టీ ? * తండ్రి కేసీఆర్‌తో తేల్చుకోవాలనుకుంటున్న ఎమ్మెల్సీ కవిత * ఆయన పిలుపు కోసం ఎదురుచూపు.. లేఖ లీకేజీపై ఆగ్రహంగా కేసీఆర్‌ తనయ * లీకువీరులెవరో తేలే వరకు పార్టీకి దూరం.. పార్టీ పెడితే తెలంగాణ జాగృతే? * రోజంతా ఇంటికే పరిమితం.. భర్త తరఫు కుటుంబం, సన్నిహితులతో మంతనాలు
Read More...