Category
State
State 

హైవే మీద యాక్సిడెంట్‌.. ప్రమాదం జరిగిన వ్యాన్‌లో కనిపించిన రు‌. 8 కోట్ల బంగారు నగలు

హైవే మీద యాక్సిడెంట్‌.. ప్రమాదం జరిగిన వ్యాన్‌లో కనిపించిన రు‌. 8 కోట్ల బంగారు నగలు AP: విజయవాడ నుంచి నెల్లూరు వైపుగా వెళ్తున్న ఓ బొలెరో ట్రాన్స్‌పోర్ట్‌ వాహనం.. ఒంగోలు సమీపంలో హైవేపైకి రాగానే ఎదురుగా వెళుతున్న ఓ లారీనీ ఓవర్‌ టేక్‌ చేయబోయి మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో ట్రాన్స్‌పోర్ట్‌ వాహనం ముందుభాగం మొత్తం ధ్వంసం అయింది. బొలెరో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఘటననై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ఇంతకు ఆ బొలెరో వాహనంలో ఏం తరలిస్తున్నారని ఓపెన్‌ చేసి చూశారు.. అంతే ఒక్కసారిగా పోలీసుల కళ్ళు బైర్లు కమ్మాయి.. వాహనంలో బాక్సుల నిండా, విలువైన బంగారు నగలు మిళ మిళ మెరుస్తూ కనిపించాయి. దీంతో బిత్తరపోయిన పోలీసులు ప్రకాశంజిల్లా ఎస్‌పి దామోదర్‌కు సమాచారం అందించారు. దీంతో వాహన వివరాలను తెలసుకోవాలని ఎస్‌పి పోలీస్ అధికారులకు ఆదేశించారు. ఎస్‌పి దామోదర్‌ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన అధికారులు.. ఆ బొలేరో వాహనం ఇతర ప్రాంతాల్లోని వివిధ బంగారు నగల దుకాణాల్లో నుంచి ఆర్డర్స్‌ తీసుకొని ఆయా షాపులకు బంగారు నగలను సరఫరా చేసే సీక్వెల్‌ గ్లోబల్‌ ప్రెసీయస్‌ లాజిస్టిక్‌ కంపెనీకి చెందినది గుర్తించారు. దీంతో వాహన పత్రాలతో పాటు బంగారు నగలకు సంబంధించిన జిఎస్‌టి, ఇతర పన్నులను పత్రాలను పరిశీలన కోసం పంపించారు. ఒంగోలు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన వాహనంలో రూ.10 కోట్ల విలువైన బంగారం బయటపడిందని తెలియగానే ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ బంగారం ఎవరిది, ఎలా తరలిస్తున్నారన్న దానిపై ఆశక్తి నెలకొంది. అయితే ఈ బంగారం అంతా లీగల్‌గానే తరలిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. అయినా బంగారం విలువ కోట్లలో ఉన్నందున జిఎస్‌టి పత్రాలు, ఇతర అనుమతి పత్రాలు సరిగా ఉన్నాయా… లేదా అని చెక్‌ చేశారు. అన్నీ సక్రమంగా ఉన్నాయని తేలితే బంగారు నగలను సంబంధిత వ్యక్తులకు అందిస్తామని ప్రకాశంజిల్లా ఎస్‌పి దామోదర్‌ తెలిపారు.
Read More...
State 

నవ వధువు పై అత్యాచార యత్నం

నవ వధువు పై అత్యాచార యత్నం పల్నాడు జిల్లా అమరావతి మండలం లో దారుణం జరిగింది. అత్తలూరు లో ఇరవై రోజుల క్రితం వివాహమైన నవ వధువు పై అత్యాచార యత్నం జరిగింది. భర్త ఇంట్లో లేని సమయంలో ముగ్గురు వ్యక్తులు వివాహితను వేధిస్తున్న కేసు నమోదైంది. అత్యాచారయత్నం చేస్తున్న సమయంలో వీడియో రికార్డింగ్ చేస్తుండగా, స్థానిక యువకుడు గుర్తించి అడ్డుకున్నాడు. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోగా ఈ ఘటనతో తీవ్ర మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రస్తుతం జిజిహెచ్ లో చికిత్స పొందుతోంది. భర్త, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అమరావతి పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పరారీలో వున్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
Read More...
State 

శ్రీశైలం ఘాట్ లో టూరిస్ట్ బస్సు బోల్తా..పలువురికి గాయాలు.

శ్రీశైలం ఘాట్ లో టూరిస్ట్ బస్సు బోల్తా..పలువురికి గాయాలు. శ్రీశైలం - హైదరాబాద్ ఘాట్ రోడ్ లోని దోమలపెంట వద్ద టూరిస్ట్ బస్ బోల్తా పడింది.ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.వీరిలో పలువురికి గాయాలయ్యాయి.
Read More...
State 

రోడ్డు ప్రమాదంలో ఆలమూరు ఎస్సై మృతి

రోడ్డు ప్రమాదంలో ఆలమూరు ఎస్సై మృతి AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్సై ఎం. అశోక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గంజాయి కేసుకు సంబంధించి నిందితుల కోసం కానిస్టేబుల్స్ తో కలిసి కారులో హైదరాబాద్ వెళ్తుండగా కోదాడ వద్ద  గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఎస్ఐ అశోక్ తో పాటు కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
Read More...
State 

భార్యని చంపిన భర్త

భార్యని చంపిన భర్త గుంటూరు: నగరం పాలెం పోలీస్ స్టేషన్ సమీపంలోని గోరెల దొడ్డి కాలనీలో భార్యాభర్తల మధ్ గొడవ...భార్యను చంపిన భర్త ఆపై బలవన్మరణానికి యత్నించాడు.భర్త రాజు మెడకు తీవ్రగాయాలు రుద్ర ట్రస్ట్ సహాయంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు...సంఘటన ప్రాంతం చేరుకున్న వెస్ట్ డిఎస్పి అరవింద్ మరియు వారి సిబ్బంది...మృతురాలు దారుబోయిన లక్ష్మి 40గా గుర్తింపు...భార్య మీద అనుమానం తోనే భర్త చంపి ఉంటాడా అనే కోణంలో దర్యాప్తు. మృతదేహాన్ని Covid figters trust సహాయంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
Read More...
State 

ఎమ్మెల్యే ల పనితీరు పై ప్రజల నుంచి ఫిర్యాదులు

ఎమ్మెల్యే ల పనితీరు పై ప్రజల నుంచి ఫిర్యాదులు న్యూఢిల్లీ: మా పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల పనితీరు, వ్యవహార శైలి  అసలు బాలేదు.రాష్ట్రము లో నియోజకవర్గాల ప్రజల నుంచి మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలా ఫిర్యాదు వచ్చిన ప్రతి ఎమ్మెల్యే పనితీరుపై సమీక్షిస్తున్నాం. వారి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం' అని మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వచ్చిన లోకేశ్‌. మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌ చేశారు.... నాతో సహా మా పార్టీలోని ప్రతి ఒక్క ఎమ్మెల్యే పనితీరుపై రివ్యూ జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేల పనితీరు, మాట తీరు, వ్యవహారశైలిపై మా వాళ్ల నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి.  ఆ ఎమ్మెల్యేలను పిలిచి పనితీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం. ఇందుకు మూడు నెలల సమయం ఇస్తున్నాం.'' అని లోకేశ్‌ అన్నారు.
Read More...
State 

అంగన్వాడీల్లో ఫేషియల్ రికగ్నిషన్

అంగన్వాడీల్లో ఫేషియల్ రికగ్నిషన్ అంగన్వాడీల్లో ఆహార పంపిణీ సమయంలో ముఖ గుర్తింపు సాధనాలతో లబ్దిదారులను ధ్రువీకరించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల లను కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ ఆదేశించింది.  జూలై 1 నుంచి ఈ పద్ధతి అమల్లోకి రానుంది. అదే తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో 3-6 ఏళ్ల బాలల్లో ఎంతమంది ఆహారం తీసుకుంటున్నారో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంది. పోషణ్ ట్రాకర్ ద్వారా ముఖ గుర్తింపు సాధనం అందుబాటులోకి వస్తుంది. ఈ-కేవైసీ, సొంత ఫొటో ద్వారా లబ్దిదారులు తమకు తాముగా నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 1 నుంచి కొత్త లబ్దిదారుల రిజిస్ట్రేషన్ కు ముఖ గుర్తింపు తప్పని సరి కానుంది.
Read More...
State 

వైసీపీ సైకోల ఫ్యాక్ట‌రీ: లోకేష్

వైసీపీ సైకోల ఫ్యాక్ట‌రీ: లోకేష్ New Delhi: ఏపీలో ప్ర‌జ‌లు వైసీపీకి గ‌త ఎన్నిక‌ల్లో 11 స్థానాలే ఇచ్చి.. ప‌క్క‌న కూర్చోబెట్టినా ఇంకా బుద్ధి రాలేద‌ని.. ఆ పార్టీ తీరు మార‌లేద‌ని టీడీపీయువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. వైసీపీ సైకోల‌ను త‌యా రు చేసే పెద్ద ఫ్యాక్ట‌రీగా మారింద‌ని ఎద్దేవా చేశారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న లోకేష్ సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా గుంటూరులో ప‌ర్య‌టించారు. ఇక్క‌డి రెంట‌పాళ్ల గ్రామంలో వైసీపీ నాయ‌కుడు.. గ‌త ఏడాది మృతి చెందిన నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు కుటుంబాన్ని ఓదార్చారు. అయితే.. 72 కిలో మీట‌ర్ల దూరం చేరుకునేందుకు ఏకంగా 8 గంట‌ల సేపు తీసుకోవ‌డం.. దారి పొడ‌వునా.. ప్ర‌జ‌ల‌కు అభివాదం చేసుకుంటూ.. ఇదో ఎన్నిక‌ల యాత్ర‌గా.. బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌గా మార్చుకోవ‌డం పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీనికి తోడు.. ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన వైసీపీ నాయ‌కులు.. తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేశారు. ఇవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. వీటిపైనా ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.  *రప్పా రప్పా నరుకుత్తం.. నా కొడ‌క‌ల్లారా.. అన్న వస్తాడు.. అంతు చూస్తాడు. గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా.. రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని* అని పేర్కొంటూ… వైసీపీ కార్య‌క‌ర్త‌లు స‌త్తెన‌పల్లి సెంట‌ర్ స‌హా.. రెంట‌పాళ్ల‌లోనూ ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేశారు. ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా దుమారం రేగింది. నారా లోకేష్ స్పందిస్తూ.. ‘యథా అధినేత.. తథా నాయకులు, కార్యకర్తలు. వైసిపి.. సైకోలను తయారు చేసే ఫ్యాక్టరీగా మారింది.“ అని వ్యాఖ్యానించారు. గ‌త ఎన్నిక‌ల్లో 11 స్థానాల‌కు ప‌రిమితం చేసి పక్క‌న కూర్చోబెట్టినా.. వైసీపీకి ఇంకా బుద్ధి రాలేద‌ని నారా లోకేష్ తెలిపారు. ప్ర‌జ‌ల‌ను భ‌య భ్రాంతుల‌కు గురి చేసే ఇలాంటి చ‌ర్య‌ల‌ను ప్ర‌జా ప్ర‌భుత్వం ఎట్టి ప‌రిస్థితిలోనూ ఉపేక్షించేది లేద‌న్నారు. దీనిపై త్వ‌ర‌లోనే చ‌ర్య‌లు ఉంటాయ‌ని వైసీపీ సైకోబ్యాచ్‌కు హెచ్చ‌రిస్తున్న‌ట్టు పేర్కొన్నారు.
Read More...
State 

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం: జ‌గ‌న్‌

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం: జ‌గ‌న్‌ Guntur: రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌ను గాలికి వ‌దిలేసి.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమ‌లు చేస్తున్నార‌ని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ విమ‌ర్శించారు. గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నాయ‌కుడు నాగ మ‌ల్లే శ్వ‌ర‌రావు కుటుంబాన్ని ఆయ‌న ప‌రామ‌ర్శించారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న మ‌ల్లేశ్వ‌ర‌రావు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన అనంత‌రం.. జ‌గ‌న్ మీడియాతో మాట్లాడారు. మ‌ల్లేశ్వ‌ర‌రావును ఎన్నిక‌ల ఫ‌లితాలు రావ‌డానికి ముందే పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా హిం సించార‌ని తెలిపారు. తీవ్రంగా కొట్టార‌ని.. దుర్భాష‌లాడార‌ని తెలిపారు. టీడీపీ విజ‌యం సాధించింద‌ని తెలిసిన త‌ర్వాత మ‌రింత‌గా వేధింపులు ఎదుర‌య్యాయ‌న్నారు. దీంతో అవ‌మానాన్ని భ‌రించ‌లేక‌.. మ‌రుస టి రోజు గుంటూరులో ఉన్న అత‌ని సోద‌రుడి ఇంటికి వెళ్లి ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డార‌ని తెలిపారు. దీనికి ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తార‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరావు ఘ‌ట‌న‌కు చంద్ర‌బాబే బాధ్య‌త వ‌హించా లని జ‌గ‌న్ చెప్పారు. ఎన్నిక‌ల‌కు ముందు త‌మ కు అనుకూల‌మైన పోలీసుల‌ను నియ‌మించుకున్నార‌ని, వారి ద్వారా వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌ను అణిచివేశార‌ని అన్నారు. కూటమిని గెలిపించుకునేందుకు అన్యాయాలు చేశారని.. మల్లేశ్వరరావు ఇంటిని కూడా ధ్వంసం చేశార‌ని, ఆయ‌న కుటుంబాన్ని కూడా బెదిరించార‌ని.. చెప్పారు. సీఐ బెదిరింపుల‌తో ఈ కుటుంబం త‌ల‌దాచుకునేందుకు వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వ‌చ్చింద‌న్నారు.ఈ ఘ‌ట‌న‌పై మ‌ల్లేశ్వ‌రరావు తండ్రి అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని జ‌గ‌న్ అన్నారు.మీ కార‌ణంగా చ‌నిపోయిన‌ నాగమల్లేశ్వరరావుకు భార్యా, కూతురు ఉన్నారు. చంద్రబాబు ఏం సమాధా నం చెబుతారు?. ఏడాది గడిచినా ఆ కుటుంబం ఇంకా శోకంలోనే ఉంది. వారి క‌న్నీళ్లు మీకు ప‌ట్ట‌డం లేదా ? చంద్ర‌బాబూ? అని వ్యాఖ్యానించారు. కాగా..జ‌గ‌న్ వెంట భారీ సంఖ్య‌లో కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.
Read More...
Local  State 

అక్రమ అరెస్టులు కాదు....సంక్షేమ పథకాలు అమలు చేయండి

అక్రమ అరెస్టులు కాదు....సంక్షేమ పథకాలు అమలు చేయండి Markapur: మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్ట్ ను తివ్రంగా ఖండిస్తున్నట్లు వైసీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు ఏపీఐఐసీ మాజీ చైర్మన్ మార్కాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జంకె వెంకట్ రెడ్డి తెలిపారు. వైసీపీ నేతల అక్రమ అరెస్ట్ లకు కూటమి సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సివుంటందని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఓటేసింది సూపర్ సిక్స్ పథకాలు ఆశించి అని వాటిని విస్మరించి కూటమి సర్కార్ వైసీపీ నేతల అక్రమ అరెస్ట్ లకు తెరలేపిందని ఆయన విమర్శించారు. సూపర్ సిక్స్ అమలు చేయకపోతే ప్రజలు నిలదీస్తారన్న ఆందోళనతో వైసీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తూ వీటిపైనే చర్చ జరిగేలా చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కూటమి సర్కార్ చేస్తోందని ఆయన విమర్శించారు. కానీ ప్రజలకు అన్నీ తెలుసని కూటమి సర్కార్ కూయుక్తులను ఇప్పటికే గ్రహించారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు ఎపుడొచ్చిన కూటమి సర్కార్ ను చిత్తుచిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్దంగా ఉండారని ఆయన హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పర్యటనకు వచ్చినప్పుడు జన సముద్రమైన పొదిలి పట్టణమును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక అమాయక కార్యకర్తలపై కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. వైసీపీ నేతల అక్రమ అరెస్ట్ లను ఆపి ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అపుడైనా కూటమిి సర్కార్ కు కాస్త గౌరవమైన ఓటమి అయినా దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. అలా కాకుండా సంక్షేమాన్ని గాలికొదిలేసి వైసీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొంటే మాత్రం వచ్చే ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు నామరూపాల్లేకుండా పోతాయని ఆయన హెచ్చరించారు.
Read More...
State 

2027 ఫిబ్రవరి నెలలో జమిలి ఎన్నికలు : ప్రహ్లాద్ జోషి

2027 ఫిబ్రవరి నెలలో జమిలి ఎన్నికలు : ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీ: భారతదేశం మొత్తం ఒకేసారి 2027 ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోఎన్నికలు (జమిలీ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది. జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్  ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Read More...
State 

3000 రూపాయలు చెల్లిస్తే దేశ వ్యాప్తంగా ఎక్కడికైనా 200 ట్రిప్పులు

3000 రూపాయలు చెల్లిస్తే దేశ వ్యాప్తంగా ఎక్కడికైనా 200 ట్రిప్పులు   *ఆగష్టు 15 నుంచి దేశ వ్యాప్తంగా కొత్త నిబంధన అమలు* *కమర్షియల్ వాహనాలకు వర్తించని కొత్త నిబంధన* న్యూ ఢిల్లీ : వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఫాస్టాగ్ కోసం రూ.3,000 చెల్లిస్తే ఏడాదికి 200 ట్రిప్పులు హైవేల పై ప్రయాణం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.3,000 చెల్లించి ఫాస్టాగ్ బేస్డ్ పాస్ తీసుకుంటే ఏడాదిలో దేశవ్యాప్తంగా ఏ జాతీయ రహదారి పైనైనా 200 ట్రిప్పులు ప్రయాణించవచ్చని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. ఇది కార్లు, జీపులు లాంటి నాన్ కమర్షియల్ ప్రైవేట్ వాహనాలకే వర్తిస్తుందని చెప్పారు. ఈ నిర్ణయం ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. Rajmarg Yatra App నుంచి పాస్ తీసుకోవచ్చన్నారు.
Read More...