Category
State
State 

ఏపీలో ఉగ్రవాదులు.. హోటల్లో కుక్ గా పని చేస్తూ

ఏపీలో ఉగ్రవాదులు.. హోటల్లో కుక్ గా పని చేస్తూ !ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో టెర్రరిస్టులున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన NIA అధికారులు నూర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఓ హోటల్లో కుక్గా పని చేస్తున్న నూర్కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని, 20 సిమ్ కార్డులతో పాటు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.
Read More...
State 

గణపతి నవరాత్రి ఉత్సవాల కు సింగిల్ విండో పద్దతి లో అనుమతి ఇవ్వాలి 

గణపతి నవరాత్రి ఉత్సవాల కు సింగిల్ విండో పద్దతి లో అనుమతి ఇవ్వాలి  అమరావతి: ఈనెల 27 నుండి జరగనున్న శ్రీగణపతి నవరాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేయాలని,సింగిల్ విండో పద్ధతిలో అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పి రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి కోరింది.  జిల్లా గణేష్ ఉత్సవ సమితితో జిల్లా అధికారులు కలిసి సమన్వయంతో గణపతి నవరాత్రి ఉత్సవాలు విజయవంతం చేసుకోవడానికి ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి పెద్దలు  ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్రంలో గణేష్ నవరాత్రులు చక్కగా జరగడానికి వివిధ విభాగాల వారితో మాట్లాడి సానుకూలంగా ఉత్సవాలు చేద్దామని తెలిపారు.సమితి గౌరవాధ్యక్షులు గోకరాజు గంగరాజు, అధ్యక్షులు చలసాని ఆంజనేయులు, ఉపాధ్యక్షులు బీవీ రమణ కుమార్ , ప్రధాన కార్యదర్శి పాకాల త్రినాధ్, కార్యదర్శి దుర్గాప్రసాద్ రాజు, ప్రభుత్వ సంబంధాల సమన్వయ కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ తదితరులు ముఖ్యమంత్రి ని కలిసిన వారిలో ఉన్నారు.
Read More...
State 

రూ.35.5 కోట్ల బిల్లులకు రూ.5 కోట్ల లంచం

రూ.35.5 కోట్ల బిల్లులకు రూ.5 కోట్ల లంచం విజయవాడ: రిటైర్మెంట్కు సిద్ధమైన గిరిజన సంక్షేమశాఖ ENC సబ్బవరపు శ్రీనివాస్ రూ.5కోట్ల లంచం డిమాండ్ చేస్తూ విజయవాడలో ఏసీబీకి పట్టుబడ్డారు.రూ.25లక్షలు అడ్వాన్స్ తీసుకునే వేళ అరెస్ట్ చేశారు. 2014లో అవినీతి కేసుల్లో ఇరుక్కున్న ఆయనపై ఇది మూడోసారి ఏసీబీ చర్య.రూ.35.5 కోట్ల బిల్లుల మంజూరుకు లంచం కోరినట్లు ఆరోపణ....
Read More...
State 

India Big Shock To Trump : ట్రంప్ కు ఈ రేంజ్ లో భారత్ షాక్ ఇస్తుందని ఊహించగలరా?

India Big Shock To Trump : ట్రంప్ కు ఈ రేంజ్ లో భారత్ షాక్ ఇస్తుందని ఊహించగలరా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) భారతదేశంపై 50 శాతం సుంకాలు విధిస్తానని బెదిరించిన నేపథ్యంలో భారత్ (India) ఒక కీలక నిర్ణయం తీసుకుని ట్రంప్‌కు గట్టి షాక్ ఇచ్చింది. రష్యా నుండి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకు గాను భారత్‌పై ట్రంప్ ఈ బెదిరింపులకు దిగారు. అయితే ఇదే సమయంలో అమెరికా, యూరోపియన్ దేశాలు కూడా రష్యా నుండి చమురు, గ్యాస్, ఎరువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుండటాన్ని భారత్ చాలాసార్లు ఎత్తి చూపింది. ఈ ద్వంద్వ వైఖరికి లొంగకుండా భారత్, అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీతో చేసుకున్న 31,500 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ చర్య ట్రంప్ బెదిరింపులకు భారత్ ఇచ్చిన బలమైన జవాబుగా భావించవచ్చు. భారత నౌకాదళం కోసం ఆరు P-8I పోసిడాన్ నిఘా విమానాలను కొనుగోలు చేయడానికి బోయింగ్ కంపెనీతో ఈ ఒప్పందం జరిగింది. ఈ విమానాలు హిందూ మహాసముద్రంలో చైనా కార్యకలాపాలను పర్యవేక్షించడంలో చాలా కీలకమైనవి. మొదట ఈ డీల్ విలువ 21,000 కోట్లుగా అంచనా వేసినప్పటికీ, జులై 2025 నాటికి అది 31,500 కోట్లకు పెరిగింది. అధిక వ్యయం ఉన్నప్పటికీ, నౌకాదళం ఈ డీల్‌ను ముందుకు తీసుకెళ్లాలని భావించింది. కానీ ట్రంప్ సుంకాల ప్రకటన ఈ డీల్‌ను రద్దు చేయడానికి దారితీసింది. ఈ నిర్ణయం బోయింగ్ కంపెనీకి ఆర్థికంగా భారీ నష్టాన్ని కలిగించనుంది, అంతేకాకుండా భారత్‌లో ఆ సంస్థ వ్యాపారంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. బోయింగ్ భారత్‌లో సుమారు 5 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నందున ఈ నిర్ణయం గణనీయమైన పరిణామాలకు దారితీయవచ్చు. ఈ డీల్ రద్దు వల్ల భారత నౌకాదళ సామర్థ్యంపై కొంత ప్రభావం పడవచ్చు. అయితే భారత్ దేశీయంగా నిఘా విమానాలను అభివృద్ధి చేయడానికి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో), హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) వంటి సంస్థలతో కలిసి పని చేస్తోంది. అందువల్ల, ప్రభుత్వం ఇప్పుడు స్వదేశీ విమానాలకే ప్రాధాన్యత ఇవ్వవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చర్య ద్వారా భారత్ తన జాతీయ ప్రయోజనాల కోసం దృఢమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడదని అమెరికాకు స్పష్టమైన సంకేతాలు పంపింది. ఈ సంఘటన భవిష్యత్తులో అమెరికా-భారత్ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, మరియు భారత్ తన రక్షణ అవసరాలను ఎలా తీర్చుకుంటుందో వేచి చూడాలి.
Read More...
State 

ఏసీబీ వలకు భారీ తిమింగలం

ఏసీబీ వలకు భారీ తిమింగలం విజయవాడ: ఏపీలో ఏసీబీకి భారీ తిమింగలం చిక్కింది. విజయవాడలో లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమశాఖ ఈఎన్సీ అబ్బవరపు శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు చిక్కారు. కాంట్రాక్టర్ కృష్ణంరాజు నుంచి రూ.25లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏకలవ్య మోడల్ స్కూళ్ల బిల్లులు చెల్లించేందుకు శ్రీనివాస్ భారీగా లంచం డిమాండ్ చేశారు. గుత్తేదారు ఆయనకు ఇప్పటికే రూ.25లక్షలు చెల్లించారు. మరో రూ.25లక్షలు అడగడంతో ఏసీబీని ఆశ్రయించాడు.
Read More...
State 

Breaking news: శ్రీశైలం వద్ద రెండు బైక్ లు ఢీ.. ఒకరు మృతి

Breaking news: శ్రీశైలం వద్ద రెండు బైక్ లు ఢీ.. ఒకరు మృతి బ్రేకింగ్ న్యూస్ నంద్యాల జిల్లా : శ్రీశైలం రామయ్య టర్నింగ్ వద్ద ఢీ కొన్న రెండు బైకులు  స్పాట్లో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు మృతుడు హరి 23, టూరిస్ట్ బస్ స్టాండ్ వద్ద చిన్న బడ్డీ కొట్టు నడుపుతూ జీవనం సాగిస్తున్న హరి. భార్య భర్తలు శ్రీశైలం నుంచి సుండి పెంట కు వెళుతున్న క్రమంలో జరిగిన ప్రమాదం సంఘటన స్థలానికి చేరుకున్న శ్రీశైలం పోలీసులు క్షతగాత్రులను 108 ద్వారా సుండి పెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
Read More...
Local  State 

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పర్యటనను జయప్రదం చేయండి - డా.ఏలూరి

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పర్యటనను జయప్రదం చేయండి - డా.ఏలూరి ఒంగోలు: బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గురువారం ఒంగోలు పట్టణంలో పర్యటించనున్నారు. ఉదయం చాయ్ పే చర్చ అలాగే కార్యకర్తల సమావేశము, మీడియా సమావేశం తో పాటు, సాయంత్రం ఐదు గంటలకు మేధావులతో ముఖాముఖి కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పాల్గొంటారని బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ప్రకాశం జిల్లా బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు.
Read More...
State 

పేదల పెన్నిధి మంచికి మారు పేరు  అందరివాడు మన ఎమ్మెల్యే నసీర్

పేదల పెన్నిధి మంచికి మారు పేరు  అందరివాడు మన ఎమ్మెల్యే నసీర్ గుంటూరు:  తూర్పు నియోజకవర్గం ప్రజలు దాదాపు ఇరవై ఏళ్ళు నుండి కష్టాలు పడుతు బాధలు పడుతు ఉన్న క్రమంలో నా ప్రజలకు నేనున్నానని నా ప్రజనీకం కష్టాలు పడుతున్నరని దైర్యంగా నారా చంద్రబాబు దగ్గర మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకొని గత ఎన్నికలలో సైకో పాలన కు స్వస్థి పలికి ప్రజల మన్ననలు పొంది సుమారు ముప్పై వేల మెజారిటీ తో గెలుపొంది తూర్పు నియోజకవర్గన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్న యువ నేత జన నేత మన నసీర్ అని, అలాంటి ప్రజా నాయకుడి పై లేని పోని అబండాలు వేస్తూ పిచ్చి కుక్కల మాదిరిగా మా నసీర్ అన్న పై పేటియం చిల్లరగాళ్ళు నోరు పారెసుకుంటున్నారన్నారు. ఆయన చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక సైకో బ్యాచ్ సోషల్ మీడియాలో విషప్రచారాలు చేయడం సరికాదన్నారు.ఈ పెటియం బ్యాచ్ ఎన్ని పిచ్చి వేషాలు వేసిన ఎన్ని నిందలు వేసిన ఎన్ని కల్పితాలు సృష్టించిన ఎన్ని నేరాలు మోపిన తూర్పు నియోజకవర్గం ప్రజానీకం నమ్మదన్నారు. ఇప్పటికైనా బ్లు మీడియా పెటియం బ్యాచ్ అర్ధం చేసుకోండి. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు వేసిన మా నసీర్ అన్నకు అభివృద్దే ముఖ్యంమని యం. శ్రీను నాయక్ అన్నారు.మా నసీర్ అన్నకు ప్రజల అండదండలు మెండుగా ఉన్నాయిని తూర్పు నియోజకవర్గ ప్రజనీకం శ్రీరామరక్షని పూర్తి నమ్మకం ఉందని అన్నారు.ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే నికృష్ఠులను ఎవ్వరినీ వొదలబొమని హేచ్చిరికలు జారీచేసారు.పద్ధతులు మారకపోతే మార్చి చూపిస్తామన్నారు.ఎవరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండలన్నారు.మీ పిచ్చి పారాకాష్టలకు ఎవరు బయపడమన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ యస్సి సెల్ సీనియర్ నాయకులు రత్నం  తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More...
State 

హెల్త్ యూనివర్సిటీ వీసీ తో సమావేశమైన మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు 

హెల్త్ యూనివర్సిటీ వీసీ తో సమావేశమైన మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు  కర్నూలు: కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఛాంబర్ లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, వైస్ ఛాన్సలర్  డాక్టర్ చంద్రశేఖర్ తో కర్నూలు మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా  విసి డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కర్నూలు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు, ప్రస్తుత వైద్యులు,  విద్యార్థులు కలిసి కట్టుగా, సమన్వయంతో,  ఐకమత్యంతో,  కళాశాల అభివృద్ధికి ముందుకు వస్తే,  విసిగా తన వంతు  సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు నిర్మించ తలపెట్టిన నాలెడ్జ్ సెంటర్, మల్టీ యుటిలిటీ బిల్డింగ్ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా విసి డాక్టర్ చంద్రశేఖర్ తెలియజేశారు. ఇంత పెద్ద మనసుతో సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చిన గౌరవ విసి డాక్టర్ చంద్రశేఖర్ కి,  కర్నూలు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల తరఫున అప్నా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎవి సుబ్బారెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో కర్నూలు మెడికల్ కాలేజ్ ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ హరి చరణ్, కర్నూలు జనరల్ హాస్పటల్ సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు,వైస్ ప్రిన్సిపల్ లు డాక్టర్ సాయి సుధీర్,  డాక్టర్ రేణుక దేవి,  డాక్టర్ సింధియా శుభప్రద, ఏపీఎంఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవులు, కర్నూల్ అల్యూమిని వైద్యులు డాక్టర్ కుమార్ స్వామి రెడ్డి,  డాక్టర్ గోవింద రెడ్డి,  డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ విజయ శంకర్, డాక్టర్ బ్రహ్మాజి తదితరులు పాల్గొన్నారు.
Read More...
State 

ప్రొద్దుటూరు లో ఐఎంఎ సమావేశం 

ప్రొద్దుటూరు లో ఐఎంఎ సమావేశం  ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలో శనివారం ఐఎంఎ సమావేశం నిర్వహించారు‌. ఈ సమావేశంలో మదనపల్లె కు చెందిన ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారెడ్డి పాల్గొన్నారు.ఈ సమావేశంలో జిల్లా ఐఎంఏ పూర్వ అధ్యక్షులు డాక్టర్ త్యాగరాజ రెడ్డి,  డాక్టర్ సాయి ప్రసాద్, డాక్టర్ కిషోర్, ఐఎంఏ ప్రస్తుత అధ్యక్షులు డాక్టర్ నందకిషోర్, హానరరీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ బోస్, డాక్టర్ సేవా కుమార్, ఐఎంఏ ప్రొద్దుటూరు ట్రెజరర్ మరియు హెల్త్ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు డాక్టర్ వరుణ్, ఐఎంఏ ప్రొద్దుటూరు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు చర్చించారు.
Read More...
State 

ప్రాణాలు తీసిన ప్రేమ.. మహిళా కానిస్టేబుల్ మృతి*

ప్రాణాలు తీసిన ప్రేమ.. మహిళా కానిస్టేబుల్ మృతి* *ఆంధ్రప్రదేశ్ : వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ప్రశాంతి (25) ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.  చిత్తూరు జిల్లా మార్వాడకు చెందిన వాసుతో కొన్నాళ్ల కిందట ఆమెకు పరిచయం ఏర్పడగా..  అది కాస్త ప్రేమగా మారింది. అంతకుముందే వాసుకు వివాహం జరిగిన విషయాన్ని దాచాడు.  ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని ప్రశాంతి అడగగా.. వాసు ముఖం చాటేశాడు.  దాంతో ఆమె వాసు ఇంటికి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.
Read More...
State 

ACB కి చిక్కిన కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్

ACB కి చిక్కిన కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ అనంతపురం: కళ్యాణదుర్గం రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగేంద్ర నుంచి ఐదులక్షలు లంచం తీసుకుంటూ ACB అధికారులకు చిక్కిన సబ్ రిజిస్టర్ నారాయణ స్వామి.జిల్లా లోనే అత్యంత అవినీతి సబ్ రిజిస్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న నారాయణ స్వామి. సామాన్య ప్రజల నుంచి వ్యాపారస్తుల వరకు  అందరిని లంచాల కోసం పీడించిన డబ్బు పిశాచి నారాయణ స్వామి.ఇటువంటి లంచగొండి ACB అధికారులకు పట్టుపడటం తో హర్షం వ్యక్తం చేస్తున్న  కళ్యాణదుర్గం ప్రజలు.అసలే రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయి  వ్యాపారస్తులు స్థలాలు అమ్ముడు పోక చాలా ఇబ్బందులు పడుతున్నారు.
Read More...