వ్యూహం మార్చిన యువనేత
గిద్దలూరు నియోజకవర్గం లో మారుతున్న సమీకరణలు
(అగ్ని ప్రతినిధి, మార్కాపురం)
గిద్దలూరు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు గెలుపు దిశగా అడుగులు వేస్తున్న వైనం కనిపిస్తుంది. ఇప్పటివరకు వైసీపీ నుండి టిడిపిలోకి బారులు తీరిన నాయకులు, తిరిగి సొంతగూటికి చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కే పి నాగార్జున రెడ్డి సోదరుడు, కేపీ కృష్ణమోహన్ రెడ్డి వ్యూహం మార్చారు. నియోజకవర్గంలో ఇక వైసిపి కష్టం అనుకునే వాళ్ళకి చెక్ పెడుతూ వైసిపి తిరిగి పుంజుకుంటుంది అనిపించేలా పావులు కదిపాడు.పార్టీ వీడిన వారిని ఒప్పించి, తిరిగి సొంతగూటికి వచ్చేలా ఆయన చేసిన కృషి సక్సెస్ అయింది. దీంతో గత కొన్ని రోజులుగా వైసీపీలోకి తిరుగు ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. 2019లో ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా అన్నా రాంబాబు అఖండ విజయం సాధించారు. అప్పట్లో కూడా ఎన్నికలకు ముందు ప్రతిరోజు పదుల సంఖ్యలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరే వారి సంఖ్య ప్రముఖంగా కనిపించేది. ఆ వార్తలు చూసినవారు, ఇక ఇక్కడ వైసిపి గెలవడం కష్టం, టిడిపిదే విజయం అని అనుకునేవారు. చివరికి 82 వేల ఓట్ల మెజార్టీతో వైసిపి అభ్యర్థి అన్నా రాంబాబు విజయం సాధించారు. మరి ఆ చేరికలు, వలసలు అన్ని ఏమయ్యాయో టిడిపి నాయకులకే ఎరుక.
ఇక 2024 ఎన్నికలకు ముందు అలాంటి చిత్రమే కనిపిస్తుంది. ప్రతిరోజు వైసీపీని వీడీ టిడిపి లో చేరే వారి సంఖ్య పెద్దగా ఉండేది. అయితే వైకాపా యువనేత కృష్ణమోహన్ రెడ్డి పక్కా ప్లాన్ తో, భారీ స్కెచ్ తో, టీడీపీ లో చేరిన వారిని తిరిగి సొంత గూటికి తేవడంలో విజయం సాధించాడని చెప్పవచ్చు. దీంతో టిడిపి ఆశలు గల్లంతువుతున్నట్లుగా అర్థమవుతుంది. తిరిగి ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవడం తథ్యం అని అర్థమవుతుంది. మెజార్టీ గతంలో అంత ఉండకపోవచ్చు గాని, గెలవడం మాత్రం పక్కా అంటూ వైసిపి నాయకులు స్పష్టం చేస్తున్నారు. రాజకీయ పరిశీలకులు కూడా వైసిపికి బాగా గ్రౌండ్ ఉన్న నియోజకవర్గమని, కచ్చితంగా గెలవడానికి అవకాశాలు బాగా ఉన్న నియోజకవర్గమని పేర్కొంటున్నారు. నిజానికి కెపి నాగార్జున్రెడ్డి నాన్ లోకల్ అంటూ టిడిపి వాళ్ళు చేసిన ప్రచారం కాస్తా వర్క్ అవుట్ అవుతుందో ఏమో అని అనుమానం వచ్చే విధంగా వాతావరణం మారిపోయింది. అయితే లోకేష్ ఎక్కడాయన, మంగళగిరి నుంచి పోటీ చేయడం లేదా అంటూ వైసీపీ వర్గాలు అటాకింగ్ గేమ్ తో టిడిపి నాయకుల్ని విలవిల్లాడేలా చేశాయి. దీంతో కామన్ మ్యాన్ కాస్తా కళ్ళు తెరిచాడు. లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయగాలేనిది,కేపీ నాగార్జున రెడ్డి మార్కాపురం నుంచి పోటీ చేయడం లో తప్పేంటి అంటూ ఓటరు తనను తాను సముదాయించుకుని, వైసిపికి ఓటు వేసేందుకు సిద్ధమయ్యాడని విశ్లేషకులు అంచనాలు కడుతున్నారు.దీంతో కథ అడ్డం తిరిగింది. ఇక టిడిపి నాయకులు చేసేది ఏమి లేక, వలసలు వస్తున్నారని వారి ఫోటోలతోటి తమ పత్రికల్లో కథనాలు రాయించుకుంటూ కాస్తా ఊరటనిద్దాం అని భావించారు. యువరాజు కృష్ణమోహన్ రెడ్డి దాన్ని కూడా అడ్డంగా తొలగించేశాడు. దీంతో టీడీపీ శ్రేణులు ఇక గెలవడం ఎట్లా? గెలిచేందుకు మార్గాలు ఏంటి ? అని ఆలోచించే పరిస్థితి వచ్చింది. వైఎస్ఆర్ సిపి నాయకులు మాత్రం జగన్ సీఎం కావాలనే ఏకైక లక్ష్యంతో లోకల్ ,నాన్ లోకల్ అని పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతుంది.మొత్తం మీద గిద్దలూరు నియోజకవర్గంలో రూట్ మారింది, వైసీపీ వీడిన వారు తిరుగు ముఖం పడుతున్నారు.ఇక ఓట్ల పండుగ రావడమే ఆలస్యం పక్కాగా ఫ్యాన్ కు ఓట్లేస్తామంటూ చెప్పే ఊర్లు చాలానే కనిపిస్తున్నాయి. మే 13 జరిగే ఎన్నికల సమరంలో వైసీపీకి అవకాశములు ఉంటాయని స్థానికంగా రాజకీయ విశ్లేషణలు చేసే ఒకరిద్దరు చెప్తున్న మాట. మరి ఓటర్ అన్న ఎలాంటి తీర్పిస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సిందే.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.