Category
Stories
Stories 

కాంగ్రెస్,,, కమ్యూనిస్టు ల బంధం ఎలాంటిదంటే?.. స్వర్గీయ జార్జి ఫెర్నాండెజ్

కాంగ్రెస్,,, కమ్యూనిస్టు ల బంధం ఎలాంటిదంటే?.. స్వర్గీయ జార్జి ఫెర్నాండెజ్ అది 1998వ సంవత్సరం బీజేపీ ప్రధాని వాజ్ పేయిని గద్దెదించాలని కాంగ్రెస్, CPMలు చేతులు కలిపి, లోక్ సభలో ఉంచిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది.కాంగ్రెస్, CPI (M) పార్టీల నాయకులు కలిసి కూర్చుని, బీజేపీ కూటమిపై దాడి చేస్తున్నారు. ఒకరు మాట్లాడినప్పుడు మరొకరు బల్లలు చరుస్తూ, పరస్పరం అభినందించుకుంటు ఉన్నారు. అదే బీజేపీ నాయకుడు కాంగ్రెస్ అవినీతిపై మాట్లాడితే మాత్రం CPM నాయకులు తీవ్రంగా ప్రతిదాడి చేస్తున్నారు.  సరిగ్గా అప్పుడే రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ బీజేపీ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ ఇలా అన్నాడు... "స్పీకర్ సార్, కాంగ్రెస్ పార్టీపై ఒక గొప్పసంస్థ తమ పుస్తకంలో ఏమి చెప్పిందో మీకు చదివి వినిపిస్తాను" అంటూ ఒక పుస్తకాన్ని  తీసి ఇలా చదవడం మొదలుపెట్టాడు...."కాంగ్రెస్ పార్టీ అవినీతికి ఫౌంటైన్ హెడ్ లాంటిది. (కాంగ్రెస్+ సిపీఎం బెంచీల నుండి పెద్దగా అరవడం మొదలైంది). బ్రిటీష్ వాళ్ళు వదిలిన కాంగ్రెస్ పార్టీ అవినీతిలో గత 50 ఏళ్ళుగా, కొత్త రికార్డులు నెలకొల్పింది. ముంద్రా స్కామ్, చౌరత్ లాటరీ స్కామ్, బోఫోర్స్ స్కామ్, సుఖ్రం స్కామ్, హర్షద్ మెహతా స్కామ్, JMM ముడుపుల స్కామ్, హవాలా స్కామ్ వంటి స్కామ్స్ లో కాంగ్రెస్ మంత్రులు చిక్కుకున్నారు. భారత ప్రజాస్వామ్యంలోని ప్రతి సంస్థను అవినీతి కాంగ్రెస్ దుర్వినియోగం చేసింది"ఆ స్పీచ్ ని తట్టుకోలేని కాంగ్రెస్, సిపిఎం పార్టీలు సభలో ఒక్కసారిగా లేచి "స్పీకర్ సర్, ఊరు పేరు లేని పుస్తకాలలోని అసత్యాలని ఫెర్నాండేజ్ గారు చదవడానికి మేం ఒప్పుకోము" అంటూ గోల చేశారు. జార్జి ఫెర్నాండెజ్ మాట్లాడుతూ "దయచేసి నన్ను చదవనీయండి. పుస్తకం పేరును చివర్లో నేనే చెప్తాను" అంటూ, మళ్ళీ చదవ సాగాడు."సెక్యులరిజం ముసుగులో కాంగ్రెస్ పార్టీ వివిధ సమయాల్లో దేశంలో అల్లర్లు సృష్టించింది. తమ గూండాలతో ఢిల్లీలో 3000 సిక్కుల్ని ఊచకోత కోయించింది. ఇలాంటి హానికరమైన కాంగ్రెసుని భూమి నుండి తుడిచిపెట్టడం ముఖ్యం". ఇక  తట్టుకోలేని కాంగ్రెస్, సిపిఎంలు ఫెర్నాండేజ్ పై అరుస్తూ, ఆ పుస్తకం పేరు చెప్పకుండా, చదవనీయమని పట్టుబట్టారు. అప్పుడు పెర్నాండెజ్ గారు  "సరే, స్పీకర్ సర్! గౌరవ CPM సభ్యులు ఇంతగా పట్టుబట్టారు కాబట్టి, చెబుతున్నాను...ఈ పుస్తకం మరేదో కాదు, లోక్‌సభ ఎలక్షన్స్ ముందు ఇదే  CPM వాళ్ళు జారీచేసిన CPI(M) మేనిఫెస్టో". అంతే సభలో ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్. కమ్యూనిస్టులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఫెర్నాండేజ్ గారు అందుకుంటూ, "ఏం జరిగింది, ఎందుకీ నిశ్శబ్దం...??  మీరేగా పుస్తకం పేరు చెప్పమన్నారు, పేరు వినగానే, మీ గొంతులు మూగ పోయాయెందుకు....?? సిగ్గు పోయిందా మీకు....?? మీ సొంత మానిఫెస్టోని మీరే చదవలేదా...?? చదివినా, మీ భావజాలం మీకే నచ్చలేదా...?? ఇలాంటి భావజాలం గల మీరు, మళ్ళీ అదే కాంగ్రెసుతో సెక్యూలరిజం పేరుతో, చేతులు కలిపినందుకు మీరంతా సిగ్గుతో చచ్చిపోవాలి. ఆ పార్టీ అవినీతిలో ఉన్న అన్ని రికార్డులు చేరిపేసింది. ఇకనైనా మీరు ఆలోచించి, మీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలని నేను కోరుతున్నాను. ఒకవేళ మీరు మీ మార్గాన్ని చక్కదిద్దుకోకపోతే, మీ పార్టీ ఓ గత చరిత్రగా మిగిలిపోతుంది" ...... అంటూ ముగించారు.
Read More...
Stories  State 

కవిత కొత్త పార్టీ ?

కవిత కొత్త పార్టీ ? * తండ్రి కేసీఆర్‌తో తేల్చుకోవాలనుకుంటున్న ఎమ్మెల్సీ కవిత * ఆయన పిలుపు కోసం ఎదురుచూపు.. లేఖ లీకేజీపై ఆగ్రహంగా కేసీఆర్‌ తనయ * లీకువీరులెవరో తేలే వరకు పార్టీకి దూరం.. పార్టీ పెడితే తెలంగాణ జాగృతే? * రోజంతా ఇంటికే పరిమితం.. భర్త తరఫు కుటుంబం, సన్నిహితులతో మంతనాలు
Read More...
Stories  Local 

మండల వైకాపా లో వేడెక్కుతున్న రాజకీయాలు 

మండల వైకాపా లో వేడెక్కుతున్న రాజకీయాలు  * వైస్ ఎంపీపీ - 2 సీటు కోసం పెరుగుతున్న ఆశావహులు * ఈ నెల 19 న ఎన్నికలు * నోటీసులు తీసుకోకుండా తప్పించుకు తిరుగుతున్న ఎంపీటీసీలు * వైకాపా లో అంతర్గత విభేదాలు 
Read More...
Stories  Cultural 

పశువుల సంరక్షణకు యుద్ధం చేసిన ధీశాలి కాటమరాజు 

పశువుల సంరక్షణకు యుద్ధం చేసిన ధీశాలి కాటమరాజు  - ఉగాది ఉత్సవాలకు ముస్తాబైన కాటమరాజు దేవాలయం - నల్లమల అడవుల్లో కొలువై ఉన్న యాదవుల కుల దైవం 
Read More...
Stories  Cultural 

నిద్రలేమికి సులభ పరిష్కారాలు...!

నిద్రలేమికి సులభ పరిష్కారాలు...!  ప్రస్తుతపరిస్థితుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధానకారణం మనయొక్క జీవితములో ఎదుర్కొనే ఒత్తిళ్లు కావచ్చు మిగిలిన సమస్యలు ఏవైనా కారణం కావచ్చు. నిద్ర మనిషి జీవితంలో అత్యంత ప్రధానం అయినది. నిద్ర తక్కువ అవ్వడం రోగాలు రావడానికి ప్రధాన కారణం . నిద్ర తక్కువైన మనిషికి త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చును.         కావున వీలయినంత వరకు శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మంచిది . అలాంటి విశ్రాంతి కేవలం మంచి నిద్రతోనే లభిస్తుంది. మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారి కోసం ఇప్పుడు నేను చెప్పబోయే యోగాలు చాలా మంచిఫలితాన్ని ఇస్తాయి .  *  నిద్రపట్టనప్పుడు ఒక స్పూన్ గసగసాలు వేడిచేసి ఒక గుడ్డలో వేసి మూటకట్టి వాసన చూస్తున్న త్వరలో మంచినిద్ర వచ్చును.  మంచి గసగసాలనే వాడండి. మార్కెట్లో తొటకూర విత్తనాలను గసగసాలుగా అమ్ముతున్నారు.  *  వెలక్కాయ చిప్పను బియ్యపు కడుగు నీటితో అరగదీసి ఆ గంధాన్ని కణతలకు , నుదురుకు వ్రాసి పడుకున్న నిద్రపట్టును .  *  ఉదయం , సాయంత్రం సర్పగంధి వేళ్ళ చూర్ణం పావుస్పూన్ అరకప్పు నీళ్ళలో వేసి తాగుచున్నచో మంచిఫలితం కనిపించును. రక్తపోటు ఉన్నవారికి చాలా అద్భుతంగా పనిచేయును .  *  రాత్రి సమయంలో మజ్జిగ లో రెండు నీరుల్లిపాయ ముక్కలను కలుపుకుని లోపలికి తీసుకొండి. మంచి నిద్ర వచ్చును.  *  నిద్రపోవడానికి ముందు కప్పు వేడిపాలల్లో అరచెంచా మిరియాల కషాయం కలుపుకుని తాగుచున్న సుఖనిద్ర కలుగును.  *  అశ్వగంధ చూర్ణము కూడా బాగా పనిచేయును . ఒక స్పూన్ అశ్వగంధ చూర్ణం ఒక చిన్న గ్లాసు పాలల్లో కలిపి నిద్రపొవడానికి ముందు ప్రతినిత్యం సేవించవలెను .        
Read More...
Stories 

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆకాశం లో సగం.. అవకాశాల్లో సగం.. ఇది మహిళలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత. మహిళల హక్కులు, మహిళల సామాజిక గౌరవం, శ్రమకు తగిన ఫలితం ఇలా అనేక అంశాల్లో వ్యత్యాసం తగ్గించే క్రమంలో జరిగిన పోరాటాల ఫలితంగా మహిళా దినోత్సవం అని ప్రత్యేక గుర్తింపు ప్రారంభం అయింది. ప్రపంచవ్యాప్తంగా అణగారిన శ్రామిక మహిళల పోరాటాల విషయంలో ఇది ఒక ముఖ్యమైన చారిత్రాత్మకమైన రోజు. మార్చి 8 వ తేది,115 వ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. 1908 మార్చి 8న అమెరికాలోని న్యూయార్క్ నగరంలో బట్టలు కుట్టే కార్మికుల వేతనాలు పెంచడం, కంపినీల్లో మహిళకు సరైన పని కల్పించడం,పని సమయాన్ని తగ్గించడం,స్త్రీ పురుషులకు సమాన వేతనాలు ఇవ్వాలని,బాల కార్మిక వ్యవస్థ అరికట్టడం,ఓటు హక్కు కాపాడుకోవడం వంటి డిమాండ్ లతో ఉద్యమాన్ని కొనసాగించారు.ఈ పోరాటం ప్రపంచ వ్యాప్తంగా విప్లవ,ఉద్యమకారులకు స్ఫూర్తి నిచ్చింది.1910లో డెన్మార్క్ రాజధాని కోహెన్ హాగన్ లో జరిగిన సమావేశంలో సోషలిస్ట్ ఉమెన్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా జరుపుకోవాలని నిర్ణయించింది.అప్పటి నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు.మహిళా దినోత్సవం మహిళలకు పోరాట మార్గాన్ని చూపింది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పోరాటాలను  అధ్యయనం చేసిన డాక్టర్.బి.ఆర్. అంబెడ్కర్, భారత రాజ్యాంగంలో మహిళా హక్కులను పొందుపరిచారు. పురుషులతో సమానంగా జీతాలివ్వడం2 .స్త్రీలకు మెటర్నటి లీవుప్రసూతి సెలవులు    హక్కుగా మంజూరు చేయించటం .3 .1942 లో మెటర్నటి బెనిఫిట్ చట్టాన్ని రూపొందించి అమలు చెయ్యడం .4 . స్త్రీలకు ప్రత్యేక విద్యాలయాలుస్థాపించడం .5 .అనాధ స్త్రీలకు ౩౩ శాతం రిజర్వేషన్ కల్పించడం .6.పునర్ వివాహ హక్కు ,వారసత్వపు  అస్థి హక్కు ,వాటా హక్కు ,భర్త నుంచి పరిహారపు హక్కు, హిందు కోడ్ బిల్లును రూపొందిచడం.7 . స్త్రీలకు పురుషులతో సమానంగా (ఆర్టికల్ 14 -16 లో ) సాంఘిక,ఆర్థిక ,సామాజిక న్యాయన్ని ,మరియు భావ స్వేచ్చ హక్కులను , సమాన హక్కులను కల్పించాడు. 8 .ఉమెన్ లేబర్ వెల్ఫేర్ ఫండ్ ను స్థాపించాడు . 9 .రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ,15 (త్రీ) 16 (1 ,2 )ల ద్వారా లింగవివక్ష లేని పౌరసమాజానికి నాంది పలికాడు .10 .హిందూ వివాహచట్టం 1955 ,హిందు వారసత్వపు చట్టం 1956 ,హిందు మైనారిటీ గార్డియన్ షిప్ -చట్టం 1956 ,హిందు దత్తత , పరిహార చట్టం మొదలగు హిందు కోడ్ బిల్లును రూపొందించాడు. 11 .బొగ్గు, మైకా గనుల్లోని పనిచేసే స్త్రీలకు తక్కువ లోతులో పనిచెసే విదంగా1946 ఏప్రిల్ 8 న వారికి రక్షణగా కోల్డ్ మైన్స్ సేఫ్టీ యాక్ట్ కల్పించాడు. స్త్రీలకు తన అలోచన విధానాల ద్వారా స్వేచ్ఛ స్వాతంత్య్రాలను కలుగజేసిన మానవతామూర్తి బి.అర్.అంబేద్కర్.మహిళా లోకానికి వెలుగు నిచ్చిన మహనీయుడు డాక్టర్. బి.ఆర్.అంబేద్కర్. భారత దేశంలో మహిళా హక్కుల కోసం పోరాడారు.రాజ రామ్మోహన్ రాయ్ వంటి సామాజిక వేత్తలు వితంతు పునర్వివాహం ప్రోత్సహించడం, సతీసహగమనం వంటి దురాచారాలు అడ్డుకోవడం ద్వారా మహిళల కు స్వాభిమానం పెంపొందించారు.‌ మహిళల్లో ఝాన్సీ లక్ష్మీబాయి మొదలు రాణి రుద్రమదేవి,రాణి అహల్య, సరోజిని నాయుడు, దుర్గాబాయి  దేశముఖ్, డొక్కా సీతమ్మ,సుధా నారాయణ మూర్తి, వరకు ఎందరో మహా తల్లులు మహిళా సమాజం లో సంస్కరణలకు ప్రాణం పోశారు.అలాంటి వారందరికీ మహిళా లోకం రుణపడి ఉంది.అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో..Agni News Media..
Read More...
Stories  Cultural 

మహా శివరాత్రి విశిష్టత. 

మహా శివరాత్రి విశిష్టత.  మహాశివరాత్రి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలోని అనేక ప్రాంతాల్లో శివాలయాలు భక్తుల శివ నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. కాశి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, రామేశ్వరం, అరుణాచలం వంటి క్షేత్రాలు లక్షలాదిగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి శివరాత్రి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.
Read More...
Stories  State 

ఆరెస్సెస్ దూరదృష్టి తో  140 కోట్లు ఆదా, 29,000 టన్నుల వ్యర్థాల తగ్గింపు..!

ఆరెస్సెస్ దూరదృష్టి తో  140 కోట్లు ఆదా, 29,000 టన్నుల వ్యర్థాల తగ్గింపు..!  ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతున్న మహా కుంభమేళా ప్రపంచం మొత్తాన్నీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే 40 కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించారు. యూపీ ప్రభుత్వం కూడా అనేక ఏర్పాట్లు చేసింది. అయితే.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మహా కుంభమేళాను దృష్టిలో పెట్టుకొని, ప్రారంభం మునుపే ఓ కీలక ఉద్యమం చేపట్టింది. కుంభమేళా దృష్ట్యా పర్యావరణానికి ముప్పువాటిల్లకుండా ‘‘ఏక్ థాలీ, ఏక్ థైలా’’అన్న ఉద్యమాన్ని చేపట్టింది. అంటే ఒక బట్ట సంచి, ఒక కంచం (ప్లేట్). మహా కుంభమేళాలో భోజనాలు చేయడానికి ఎవరైనా ప్లేట్ అడిగితే... ప్లాస్టిక్ విస్తర్లు కాకుండా.. సమాజం నుంచి సేకరించిన స్టీల్ ప్లేటును,అలాగే వస్తువుల కోసం బట్ట సంచీ ఇస్తున్నారు. దీంతో ప్లాస్టిక్ వాడకం చాలా వరకు తగ్గింది. ‘‘ఏక్ థాలీ, ఏక్ థైలా’’ అన్న ఉద్యమం ద్వారా 140 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. అలాగే 29,000 టన్నులకు పైగా వ్యర్థాలు తగ్గాయి.మహా కుంభమేళాకి వచ్చిన వారికి స్టీల్ ప్లేట్, బట్ట సంచులను పంపిణీ చేశారు. ఈ చొరవతో 29,000 టన్నుల వ్యర్థాలు తగ్గిపోయాయి. ఈ ఉద్యమంలో 2,241 సంస్థలు పాల్గొనగా, 7,258 కలెక్షన్ సెంటర్లున్నాయి. ఈ ఉద్యమంలో 14,17,064 స్టీల్ కంచాలు, 13,46,128 బట్ట సంచులు, 2,63,678 స్టీల్ గ్లాసులు అందుబాటులో వుంచారు. 43 రాష్ట్రాల నుంచి సేకరించారు. సంఘ్ పర్యావరణ దృష్టికి... ఆచరణ రూపం ఇచ్చిన హిందూ సమాజం...మహా కుంభమేళా సందర్భంగా ‘‘ఏక్ థాలీ, ఏక్ థైలా’’ అన్న ఉద్యమానికి ఆరెస్సెస్ పిలుపునిచ్చింది. దీనికి హిందూ సమాజం నుంచి విశేషంగా స్పందన వచ్చింది. దేశ వ్యాప్తంగా ప్రచారం చేయడంలో కొన్ని లక్షలాది హిందూ కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి. స్టీల్ ప్లేట్లు, బట్ట సంచులను ఇచ్చారు. దేశం నలుమూలల నుంచీ స్టీల్ ప్లేట్లు, బట్ట సంచులు వాహనాల్లో కుంభమేళా ప్రాంతానికి చేరుకున్నాయి. సనాతన ధర్మంలో ప్రకృతి, పంచ భూతాలు ఈశ్వర స్వరూపం. దీనిని తూచా తప్పకుండా హిందూ సమాజం ఆచరించి చూపించింది. కుంభమేళా ద్వారా పర్యావరణానికి హాని కలగకుండా వుండేందుకు సహాయ సహకారాలను పూర్తిగా అందించింది.ఏక్ థాలీ, ఏక్ థైలీ అన్న ఉద్యమం ద్వారా డిస్పోజబుల్ ప్లేట్లు , గ్లాసులు, గిన్నెల వినియోగం బాగా తగ్గిపోయింది. 80 నుంచి 85 శాతం తగ్గిపోయింది. దీంతో ప్లాస్టిక్ వ్యర్థాలు బాగా తగ్గిపోయాయి. 29,000 టన్నుల వ్యర్థాలను నిరోధించగలిగాం. అయితే మొత్తం వ్యర్థాలు 40 వేల టన్నులకు మించి వుండకపోవచ్చు. అలాగే ఈ ఉద్యమంతో 3.5 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ఎందుకంటే రవాణా, ఇంధనం, శుభ్రపరచడం, సిబ్బంది ఖర్చులు తగ్గిపోయాయి. లేదంటే డిస్పోజబుల్ ప్లాస్టిక్ చెత్త కొనడం, ఏరడం, సిబ్బంది కేటాయింపుతో డబ్బులు ఖర్చయ్యే అవకాశాలుండేవి. వన్ థాలీ, వన్ థైలీతో ఖర్చులు తగ్గాయి. కుంభమేళాకి వచ్చిన భక్తులు స్టీల్ ప్లేట్లలో భోజనం చేసి, మళ్లీ శుభ్రంగా కడిగేసి, అక్కడే పెట్టేస్తున్నారు. అలాగే భోజనం కూడా అవసరమైనంత మాత్రమే వేసుకుంటున్నారు. అక్కడ పనిచేసే కార్యకర్తలు, వడ్డించే వారు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఆహార వృథా కూడా 70 శాతం తగ్గింది.
Read More...
Stories  State 

పల్పాడులో పొలిటికల్ హీట్..

పల్పాడులో పొలిటికల్ హీట్.. పల్నాడు జిల్లాలో రాజకీయం హీటెక్కింది. చిలకలూరిపేటలో ఇద్దరు మాజీ మంత్రుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రోద్బలంతో తనపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజిని ఫైర్ అయ్యారు. తాను మరో 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని ప్రత్తిపాటి ఎక్కడ దాక్కున్నా బయటకు లాక్కొస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.మాజీమంత్రి విడదల రజినిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేశారు పోలీసులు.
Read More...
Stories  State 

జగన్.. ఇదెక్కడి లాజిక్‌..!

జగన్.. ఇదెక్కడి లాజిక్‌..! ఆడలేక మద్దెల ఓడు అన్నాడట వెనకటికి ఒకడు.. అలా ఉంది వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఏం మాట్లాడుతున్నాడో కూడా జగన్‌కు అర్థం కావడం లేదు. ఏదో చెప్పాలనే ప్రయత్నంలో జగన్ నవ్వుల పాలవుతున్నారు కూడా. వై నాట్ 175 అని ఎన్నికల్లో ప్రచారం చేశారు. అంటే ప్రతిపక్షం అవసరం లేదన్నారు. కానీ చివరికి కేవలం 11 స్థానాలు మాత్రమే వైసీపీ గెలిచింది. దీంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయితే తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ జగన్‌ న్యాయపోరాటం చేస్తున్నారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీకి వచ్చేది లేదని భీష్మించుకున్నాడు జగన్. అయితే తాజాగా 60 రోజులు సభకు రాకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు జగన్‌లో భయం పుట్టించినట్లున్నాయి. దీంతో కొత్త లాజిక్‌ను తెరపైకి తీసుకువచ్చారు జగన్. లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మరోసారి ప్రెస్‌మీట్ పెట్టారు. అసెంబ్లీ సభ్యత్వం రద్దు అంటూ వేసిన ప్రశ్నకు జగన్‌ చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సభకు వస్తాను... అయితే చంద్రబాబుకు ఇచ్చినంత సమయం నాకు ఇస్తారా... అంటూ ఎదురు ప్రశ్నించారు. దీంతో సొంత పార్టీ నేతలు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఏం మాట్లాడుతున్నావు రా... నరాలు కట్‌ అయిపోతున్నాయి... అంటూ నాయక్ సినిమాలో పోసాని కృష్ణమురళీ డైలాగ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్‌కు లీడర్ ఆఫ్ ది హౌస్‌తో సమానంగా సమయం ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఒక సాధారణ ఎమ్మెల్యేకు ఎంత సమయం ఇవ్వాలో అంతే ఇస్తామని ఇప్పటికే స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి...  లీడర్ ఆఫ్‌ ది హౌస్‌కు ఇచ్చినంత సమయం తనకు కావాలని అడగటం విడ్డూరంగా ఉందంటున్నారు సొంత పార్టీ నేతలు.  జగన్ మాటలకు సోషల్ మీడియాలో కూటమి నేతలు ప్రశ్నల వర్షం కురిస్తున్నారు. ఐదేళ్లు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఉన్న చంద్రబాబుకు ఎంత సమయం ఇచ్చారో జవాబు చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. కావాలంటే అసెంబ్లీ రికార్డులు తిరగేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రతిరోజు టీడీపీ సభ్యులు సభకు వచ్చినప్పటికీ... వాళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని... పైగా వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం మర్చిపోయారా జగన్.. అని నిలదీస్తున్నారు. అప్పుడు ఇవ్వని సమయాన్ని ఇప్పుడు అడగటం ఎంత వరకు సమంజసం అంటున్నారు. చంద్రబాబుతో సమానంగా సమయం ఇవ్వాలంటూ జగన్ డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు.
Read More...
Stories  State 

విశాఖ రైల్వే జోన్‌కి ఇన్ని తిప్పలా? 

విశాఖ రైల్వే జోన్‌కి ఇన్ని తిప్పలా?  విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్ర విభజన హామీలలో విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు కూడా ఒకటి. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలకంగా మారడం, సిఎం చంద్రబాబు నాయుడు, ఇద్దరు కేంద్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు ఒత్తిళ్ళ కారణంగా ఎట్టకేలకు రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్ళ తర్వాత విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కాబోతోంది. దీని కోసం విశాఖలో రూ.111 కోట్లు వ్యయంతో విశాఖలో రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మించేందుకు ఇటీవలే ప్రధాని మోడీ శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇల్లు అలకగానే పండగ కాదన్నట్లు రైల్వేజోన్ ఏర్పాటుకి కేంద్రం అంగీకరించినప్పటికీ విశాఖ రైల్వే జోన్‌కి అడుగడుగునా అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. సిఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు వాటిని నిశితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు నష్టం జరగకుండా కాపాడుకోవలసి వస్తోంది. విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినా దానిలో వాల్తేర్‌ డివిజన్ ఏర్పాటు చేయలేదని గమనించిన సిఎం చంద్రబాబు నాయుడు బృందం మళ్ళీ దాని కోసం కేంద్రంపై ఒత్తిడి చేయడంతో, విశాఖ రైల్వే డివిజన్ ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ అంగీకరించి అటు నౌపాడ, పలాస, పర్లాకిమిడి నుంచి బొబ్బిలి, సాలూరు, విజయనగరం, దువ్వాడ, జగ్గయ్యపాలెం సెక్షన్స్ కలిపి మొత్తం 410 కిమీలను విశాఖ డివిజన్ పరిధిలోకి చేర్చింది. కానీ సిఎం చంద్రబాబు నాయుడు బృందం ఎంత ఒత్తిడి చేసినా విశాఖ రైల్వే జోన్‌కి ఏటా రూ.10,000 కోట్లు ఆదాయం తెచ్చిపెట్టగల బచేలి-కిరండల్‌ (కేకే లైన్) రాయగడ డివిజన్‌కి కేటాయించేసింది. ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి విశాఖ పోర్టు, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి నిత్యం వేల టన్నుల బొగ్గు, ఇనుప ఖనిజం రైల్వే వేగన్ల ద్వారా వస్తుంది. ఈ ముడి సరుకు తరలింపు ద్వారా వచ్చే ఆదాయం మొత్తం భువనేశ్వర్‌లోని దక్షిణ కోస్తా రైల్వే జోనుకి దక్కేది. ఇప్పుడు విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తునందున దానిలో వాటా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఒడిశా రైల్వే అధికారులు, పాలకులు కేంద్రంపై ఒత్తిడి చేసి (కేకే లైన్) రాయగడ డివిజన్‌లో చేర్పించేసుకున్నారు. కనుక ఆ ఆదాయంలో విశాఖ రైల్వే జోన్‌కి వాటా లభించే అవకాశం లేకుండా పోయింది. విశాఖకు ముడిసరుకు తరలిస్తున్నపుడు దానిలో విశాఖ రైల్వే జోన్‌కి వాటా ఇవ్వకపోవడం చాలా బాధాకరమే. దీని కోసం కూడా సిఎం చంద్రబాబు నాయుడు బృందం మరో పోరాటం చేయక తప్పదు. కానీ ప్రస్తుతం ఒడిశాలో బీజేపి అధికారంలో ఉంది కనుక ఆయన ప్రయత్నించినా ఫలించకపోవచ్చు.
Read More...
Stories  State 

టీడీపీ కి బిగ్ షాక్..వైసీపీ లోకి గాలి జగదీష్ ప్రకాశ్ ?

టీడీపీ కి బిగ్ షాక్..వైసీపీ లోకి గాలి జగదీష్ ప్రకాశ్ ? ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నగరిలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అక్కడ వైఎస్సార్ సీపీ నాయకురాలు రోజా అసెంబ్లీ సీటుకు ఎసరు తెచ్చే దిశగా పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుక్రిష్ణమ నాయుడుకు ఇద్దరు కుమారులు. వారి పేర్లు.. గాలి భాను ప్రకాశ్, గాలి జగదీష్ ప్రకాశ్. 2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసిన రోజాను టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ ఓడించారు. ఆయన ప్రస్తుతం నగరి ఎమ్మెల్యేగా ఉన్నారు. గాలి ముద్దుక్రిష్ణమ నాయుడు 2018లో మరణించినప్పటి నుంచి గాలి భాను ప్రకాశ్, గాలి జగదీష్ ప్రకాశ్ సోదరుల మధ్య గ్యాప్ పెరిగింది. వాస్తవానికి 2019 సంవత్సరం నుంచే వీరిద్దరూ టీడీపీ తరఫున నగరి అసెంబ్లీ సీటు కోసం పోటీపడుతున్నారు. ఈ నెల(ఫిబ్రవరి) 12న గాలి జగదీష్ ప్రకాశ్ వైఎస్సార్ సీపీలోకి చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే నగరి వైఎస్సార్ సీపీలో లెక్కలు మారే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్‌పై గాలి జగదీష్ ప్రకాశ్‌కు వైఎస్ జగన్ హామీ ఇస్తే రోజాకు మొండిచెయ్యే మిగులుతుంది. గాలి ముద్దుక్రిష్ణమ నాయుడు కుటుంబానికి నగరి ప్రాంతంపై మంచి పట్టు ఉంది. దీన్ని అందిపుచ్చుకోవడానికి జగన్ కచ్చితంగా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయిన రోజాను పక్కన పెట్టి, నగరి ప్రాంతంపై రాజకీయంగా పట్టు కలిగిన గాలి జగదీష్ ప్రకాశ్‌కు అసెంబ్లీ టికెట్‌పై జగన్ హామీ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని పరిశీలకులు అంటున్నారు. ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి రాగానే, వైఎస్సార్ సీపీలో రోజాను వ్యతిరేకించే చాలామంది నేతలు టీడీపీలో జాయిన్ అయ్యారు. నగరి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇంఛార్జిగా రోజా కంటిన్యూ అవుతారని, పార్టీ బలోపేతం కోసం గాలి జగదీష్ ప్రకాశ్‌ లాంటి నేతలను తీసుకోక తప్పదనే అభిప్రాయం వైఎస్సార్ సీపీ జిల్లా ముఖ్య నేతల్లో వ్యక్తమవుతోంది.
Read More...