Category
Local
Local 

అనుమానాస్పద స్థితి లో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితి లో వ్యక్తి మృతి తర్లుపాడు:  మండలం లోని కలుజువ్వాలపాడు పంచాయితీ లో గల నవోదయ స్కూల్ సమీపంలో గల అడవిలో యువకుడు అనుమానస్పద స్థితిలో మృతిచెందారు సమాచారం తెలుసుకున్న ఏ ఎస్ ఐ నాగలక్ష్మి తమ పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు,పోస్ట్ మార్టం నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు మండలం లోని రాగసముద్రం గ్రామానికి చెందిన బి విష్ణువర్ధన్ వయస్సు 35 సంవత్సరాలు గా తెలిపారు
Read More...
Local 

రోడ్ ప్రమాదం లో ముగ్గురికి గాయాలు

రోడ్ ప్రమాదం లో ముగ్గురికి గాయాలు ప్రకాశం జిల్లా: పొదిలి మండలం మాదిరెడ్డి పాలెం దగ్గర రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా వస్తున్న బైక్ స్కూటీ ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు.. క్షతగాత్రులు కొనకనమిట్ల మండలం మునగపాడు, కొనకనమిట్ల వాస్తవ్యులు గా గుర్తింపు.108 లో పొదిలి ప్రభుత్వ వైద్య శాల కు తరలింపు.ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..
Read More...
Local 

ప్రకాశం జిల్లా.. కొనకనమిట్ల మండలం, చిన్నారికట్ల-జంక్షన్ సమీపంలో రోడ్డు ప్రమాదం..!*_

ప్రకాశం జిల్లా.. కొనకనమిట్ల మండలం, చిన్నారికట్ల-జంక్షన్ సమీపంలో రోడ్డు ప్రమాదం..!*_ ద్విచక్ర వాహనం, CMS వాహనం ఢీ..!_CMS వాహనం క్రిందకు వెళ్లి నుజ్జు నుజ్జు అయిన  ద్విచక్ర వాహనం..!_ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సోము సుబ్బారెడ్డి (60),సోము సుశీల(47) ఇద్దరికి తీవ్ర గాయాలు..!_వెంటనే 108 ద్వారా పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు..! ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలింపు..!_ఘటనకు సంభందించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..!_
Read More...
Local  State 

డా. అమరా సురేష్ కుమార్ కి వాస్తు విద్వన్మణి పురస్కారం ప్రదానం

డా. అమరా సురేష్ కుమార్ కి వాస్తు విద్వన్మణి పురస్కారం ప్రదానం హైదరాబాద్:  వాస్తు శాస్త్రంలో విశేష సేవలందించిన ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ప్రకాశం జిల్లా మార్కాపురం వాస్తవ్యులు డా.అమరా సురేష్ గారి కి ప్రతిష్ఠాత్మకమైన "వాస్తు విద్వన్మణి" గౌరవ పురస్కారం లభించింది. శ్రీ మహేష్ చంద్ర భరద్వాజ్ గారి ఆధ్వర్యంలోని పరాశరస్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రో సైన్సెస్ (Parasharas’ Academy of Astro Sciences) ఆధ్వర్యంలో చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో జరిగిన జ్యోతిష వాస్తు సదస్సు లో ఈ సత్కారం ఘనంగా జరిపారు. జ్యోతిష వాస్తు శాస్త్రానికి, సనాతన ధర్మానికి, డా.అమరా గారు చేసిన అహర్నిశల సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ మహత్తర సత్కార సభ జ్యోతిష పండితులు , అధ్యాపకులు, మరియు శిష్యుల సమక్షంలో ఎంతో వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు విశ్రాంత ఆచార్య డా. శ్రీ సి.వి.బి. సుబ్రహ్మణ్యం గారు, బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారు, శ్రీ మహేష్ చంద్ర భరద్వాజ్ గారు, బ్రహ్మశ్రీ తి.న.చ.సంపత్కుమార కృష్ణమాచార్య గారు, బ్రహ్మశ్రీ విరివింటి ఫణి శశాంక శర్మ గారు డా. శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారలు పాల్గొని ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ గౌరవం జ్యోతిష శాస్త్రానికి, సనాతన ధర్మ సేవకు అంకితమైన జీవితానికి లభించిన గొప్ప గుర్తింపుగా ఆయన అభిమానులు పేర్కొన్నారు.
Read More...
Local 

కుక్కల దాడిలో గాయపడిన ఉపాధ్యాయుడు 

కుక్కల దాడిలో గాయపడిన ఉపాధ్యాయుడు  ప్రకాశం జిల్లా: కంభం మండలం కందులాపురం కాలనీ సమీపంలో కుక్క లు బైకు వెంటపడి దాడి చేయడం వల్ల ఎంతోమంది గాయపడ్డారు. పంచాయతీ వాళ్ళకి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చిన నిమ్మకు నీరెత్తి నట్టు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.మంగళవారం  ఉదయం 8-30 నిముషాలకు బైక్ పై వేలుతున్న చాట్ల బాబు (టీచర్ )ను నాలుగు కుక్కలు బైకు వెంటపడి బైకును కిందపడేలా చేసి గాయపరచాయి. ఇప్పటికి అయినా పంచాయితీ వారు కుక్కల నుండి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా చేయగలరా లేదా అని ప్రజలు అనుకుంటున్నారు.
Read More...
Local 

మెడికల్ షాప్లు బంద్

మెడికల్ షాప్లు బంద్ మార్కాపురం: పట్టణం లో విజిలెన్స్ అధికారులు తనిఖీలకు వస్తున్నారనే సమాచారంతో మెడికల్ షాపులను యజమానులు మూసివేశారు. మెడికల్ షాపులలో గడువు తీరిన మెడిసిన్ అమ్ముతున్నారనే సమాచారం రావడంతో అధికారులు వస్తున్నారని సమాచారం. దీంతో షాపు యజమానులు మెడికల్ షాప్ లను మూసివేసి వెళ్లారని సమాచారం. మెడికల్ షాపులలో మెడికల్ ఆఫీసర్లు తనిఖీలు చేయకపోవడంతో డివిజన్లో ఇష్టా రీతి రేట్లలో టాబ్లెట్లు అమ్ముతున్నారని సమాచారం రావడంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Read More...
Local 

అబ్రహం.... స్థాయి మరిచి మాట్లాడొద్దు: వైసీపీ ఎస్సీ లీడర్ గురవయ్య పండి

అబ్రహం.... స్థాయి మరిచి మాట్లాడొద్దు: వైసీపీ ఎస్సీ లీడర్ గురవయ్య పండి యర్రగొండపాలెం: వైయస్సార్సీపి రాష్ట్ర అధికార ప్రతినిధి, యర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ ని విమర్శించే స్థాయి నీది కాదని, టీడీపీ నాయకులు లింగాల అబ్రహం పై వైసీపీ ఎస్సీ సెల్ లీడర్ గురవయ్య పండి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే తాటిపర్తి పై లింగాల అబ్రహం చేసిన వ్యాఖ్యలపై గురవయ్య మండిపడ్డారు. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ యర్రగొండపాలెంలో ఏ కార్యక్రమం చేపట్టిన తండోపతండాలుగా వచ్చిన జనాన్ని చూసి ఓర్వలేక, ఆయన కూటమి ప్రభుత్వంపై సంధించే బాణాల లాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ తెర లేపడం పట్ల ఆయన మండిపడ్డారు.ఇక దళితులు అనే విషయానికి వస్తే గతంలో  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్న మాటలు మనందరికీ విధితమే, అలాగే ఆదినారాయణ రెడ్డి, అలాగే మీరు చెప్తున్న  మన దళిత ముద్దుబిడ్డ మణిహారం వర్ల రామయ్య దళితులను కించపరిచే విధంగా ఏమి మాట్లాడారో ఆంధ్ర రాష్ట్ర దళితుల అందరికీ బాగా తెలుసునని మరోసారి గుర్తు చేస్తున్నాను అని అన్నారు.అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయనికి తెరలేపి దళితులను పక్కనే కూర్చోబెట్టుకొని, విజయవాడ నడిబొడ్డులో సామాజిక న్యాయ శిల్పం నిర్మించి దళితులను అక్కున చేర్చుకోవడం జరిగిందని మరోసారి మీకు మా పార్టీ విధానం గుర్తు చేస్తున్నాను అన్నారు. ఇక మా నాయకుడు, శాసనసభ్యులు విషయానికి వస్తే మంచి మనసున్న మహారాజు యర్రగొండపాలెం నియోజకవర్గానికి రావడం యర్రగొండపాలెం యొక్క ప్రజల అదృష్టం, ఈ మాట నేను అనడం కాదు నియోజకవర్గంలో ఏ వ్యక్తిని అడిగినా ఇదే మాట చెప్తారు. అలాగే తాటిపర్తి అంటే యర్రగొండపాలెం ప్రజల గుండె చప్పుడు అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి,రాష్ట్రంలో  దళిత వర్గంలో ఇలాంటి నాయకుడు దొరకడం అరుదు,మా నాయకుడు నవయుగ అంబేద్కర్ ,సామాజిక న్యాయమూర్తి, మా నాయకుడిని విమర్శించే స్థాయి మీది కాదని, మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తున్నా అని అన్నారు. అలాగే మీ విషయానికి వస్తే దళితుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంటుంది, గతం లోను విషయమై ఒక ఎస్సి కులస్తుడు మీ దగ్గరికి వస్తే మన పార్టీ కాదు, అని పక్కన పెట్టేశారు, మరి మీరు దళితుల గురించి మాట్లాడతారు. మీలాంటి వారు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంటుంది, మీలాంటి వారు దళితులను, దళిత నాయకులను కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదని  అన్నారు. ఇప్పటికీ ఎప్పటికీ మరెప్పటికైనా మా నాయకుడు కానీ, మా పార్టీ యొక్క విధానం కానీ,సామాజిక న్యాయం వైపు ఉంటుందని దళితుల అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని అన్నారు.
Read More...
Local 

మిష్టర్ తాటిపర్తి నోరు అదుపులో పెట్టుకో

మిష్టర్ తాటిపర్తి నోరు అదుపులో పెట్టుకో యర్రగొండపాలెం :  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య పై అనవసరంగా నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోం మిస్టర్ చంద్రశేఖర్ నీ నోరు  అదుపులో పెట్టుకో అని ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగాల అబ్రహం హెచ్చరించారు. ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్, జగన్ దృష్టిలో పడాలని పెద్దలపై ఏవో నోటికి వచ్చిన విధంగా మాట్లాడితే మాదిగ జాతి నిన్ను తరిమి తరిమి కొడతారు అని హెచ్చరించారు. మిస్టర్ చంద్రశేఖర్ అసెంబ్లీలో నువ్వు మీ పార్టీ కండువ వేసుకోలేదని, మీ నాయకుడు కండువాలు మారుస్తువా అని మీ జగన్ రెడ్డి అవహేళన గా మాట్లాడిన మాట గుర్తుకు రాలేదా అని అన్నారు. చంద్రశేఖర్, వర్ల రామయ్య గురించి నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావ్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడు, పోలీస్ అధికారిగా ఉన్నతమైన సేవలు అందించిన గొప్ప దార్షణిక వేత్త అని అన్నారు. రాజకీయ అనుభవం లేని నీకు ఎన్నికలకు ఒక రెండు నెలల ముందు వచ్చి ఏదో నోరు ఉన్నది కదా అని తెలుగుదేశం పార్టీ పెద్దలను మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడం సరి అయినది కాదు అని హితవు పలికారు. ఇటీవల మహానాడులో మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తో ప్రమాణం చేయించిన విషయం కూడా నీకు తెలియకపోవడం దురదృష్టం. దళితుల ముద్దుబిడ్డ వర్ల రామయ్య ని ఇకమీదట నోరు పారేసుకుంటే మంచి పద్ధతి కాదు చంద్రశేఖర్ అంటూ మాట్లాడారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో సుమారు 150 కోట్లకు పైబడి అభివృద్ధి కార్యక్రమాలు,ఈ సంవత్సరంలో మా నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఎడిషన్ బాబు చేస్తుండగా నీకు కండ్లు కనిపించట్లేదా? ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎస్సీలు తరిమికొట్టే రోజులు అతి త్వరలో ఉన్నాయి..,ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగల పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో వర్గీకరణకు సానుకూలమైన వాతావరణాన్ని రామయ్య కల్పించగలిగిన విషయాన్ని చంద్రశేఖర్ గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నా అని అన్నారు. జగన్మోహన్ రెడ్డితో ఎస్సీ వర్గీకరణ విషయం మీద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని కూడా చెప్పించలేని కుహన నాయకులారా.. మీరా వర్ల రామయ్య ని విమర్శించేది అని మండిపడ్డారు.
Read More...
Local 

ఆగష్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు : ఎమ్మెల్యే ముత్తుముల

ఆగష్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు : ఎమ్మెల్యే ముత్తుముల గిద్దలూరు:  కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగష్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాచర్ల మండలం, ఆకవీడు గ్రామంలో అశోక్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్బంగా వారికీ గ్రామ మహిళలు మంగళ హరతులతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఎమ్మెల్యే  ఇంటింటికి తిరిగి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధిని గురించి వివరించి వారికి కరపత్రాలను అందజేశారు మహిళలు అవ్వ తాతలతో మాట్లాడి గ్రామంలోని సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. నాడు వైసీపీ పాలకులు గ్రామాలలో అభివృద్ధి చేయకుండా పంచాయతీ నిధులను కూడా కొల్లగొట్టారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్నీ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తూ, ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కటికే యోగానంద్, సొసైటీ బ్యాంకు చైర్మన్ గోపిరెడ్డి జీవనేశ్వర రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాసం లక్ష్మిరెడ్డి, సూర ఆదినారాయణ రెడ్డి, గువ్వల పిచ్చయ్య, స్థానిక నాయకులు, మండల నాయకులు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గోన్నారు.
Read More...
Local 

ప్లాస్టిక్ రహిత మార్కాపురం మన లక్ష్యం - కమీషనర్ నారాయణ రావు

ప్లాస్టిక్ రహిత మార్కాపురం మన లక్ష్యం - కమీషనర్ నారాయణ రావు Markapur: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదించి పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత మార్కాపురం గా తీర్చిదిద్దుదామని కమిషనర్ డివిఎస్ నారాయణరావు కోరారు. ఆదివారం స్థానిక కూరగాయల మార్కెట్ నందు సిబ్బందితో కలిసి కూరగాయలు అమ్మే వ్యాపారస్తులకు, హోల్ సేల్ దుకాణదారులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించి సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయనీ అందులో భాగంగా గత మూడు నెలల నుండి సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగానే పురపాలక సంఘం నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒకసారి వాడి పడవేయు ప్లాస్టిక్ వస్తువులు 120 మైక్రాన్లకన్నా తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ బ్యానర్లను నిషేధించడం జరిగిందని కమిషనర్ తెలిపారు. కావున పట్టణ ప్రజలు ప్లాస్టిక్ వస్తువులను 120 మైక్రాన్ ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లను వాడకూడదు అని, అలాగే ప్లాస్టిక్ గ్లాసులు, టీ కప్పులు, ప్లాస్టిక్ ఇయర్ బర్డ్స్, క్యారీ బ్యాగులు, ధర్మకోల్ ప్లేట్లు, కప్పులు, వాటర్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ స్పూన్లు మొదలగు ప్లాస్టిక్ వస్తువులు అమ్మినా, కొనుగోలు చేసినా, వాడినా వారిపై ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. 19వ తేదీ నుండి మార్కాపురం పురపాలక సంఘం నందు ప్లాస్టిక్ నిషేధం పూర్తిస్థాయిలో అమలులో ఉంటుందని పైన తెలిపిన నిషేధిత వస్తువులను కలిగి ఉన్నా లేదా ఉపయోగించుచున్న వినియోగదారులకు,సదరు వస్తువులను విక్రయించే వ్యాపారస్తులకు కూడా ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొన్న విధంగా జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. మార్కాపురం పట్టణ ప్రజలకు వివిధ వ్యాపార వర్గాల వారు వివిధ ప్రాంతాల నుండి కొనుగోలు నిమిత్తం వచ్చి వినియోగదారులు పట్టణమును ప్లాస్టిక్ రహిత మార్కాపురం గా మార్చుటకు తమ వంతు సహాయాన్ని అందించాలని ఇందుకు అందరు సహకరించాలని కమిషనర్ కోరారు.
Read More...
Local  State 

శ్రీశైలం శాలివాహన అన్నదాన సత్రం అధ్యక్షులు గా శాతరాజుపల్లి మోహన్

శ్రీశైలం శాలివాహన అన్నదాన సత్రం అధ్యక్షులు గా శాతరాజుపల్లి మోహన్ శ్రీశైలం/మార్కాపురం: శ్రీశైలం లోని శాలివాహన అన్నదాన సత్రం నూతన కమిటీ అధ్యక్షులు గా మార్కాపురం పట్టణానికి చెందిన శాతరాజుపల్లి మోహన్ రావు ఎన్నికయ్యారు. ఆదివారం శ్రీశైలం లో నిర్వహించిన సమావేశంలో కమిటీ సభ్యులు మోహన్ రావు ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ ఎన్నికల ప్రక్రియ ఆంధ్ర ప్రదేశ్ శాలివాహన సంఘం అధ్యక్షులు ఐలాపురం వెంకయ్య సమక్షంలో జరిగినది. ఉభయ రాష్ట్రాలకు చెందిన శాలివాహన సత్రం కమిటీ సభ్యులు ఈ ఎన్నికల కార్యక్రమం లో పాల్గొన్నారు. శాతరాజుపల్లి మోహన్ రావు, అధ్యక్షులు గా ఎన్నిక కావడం పట్ల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ,సత్ర అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తానని అన్నారు.
Read More...
Local 

కంభం లో విద్యార్థి ఆత్మహత్య

కంభం లో విద్యార్థి ఆత్మహత్య కంభం: ప్రకాశం జిల్లా కంభంలో కంచాల అంజనీ కమల్ (18) అనే విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన ఆదివారం వెలుగు చూసింది. కమల్ జేఈఈ లో కోచింగ్ తీసుకొని చదువుతానని కుటుంబ సభ్యులకు చెప్పాడు. కానీ తమిళనాడులోని పాలిటెక్నిక్ కాలేజీలో ఉచితంగా సీటు రావడంతో పాలిటెక్నిక్ చదవాలని కుటుంబ సభ్యులు కమల్ కు తెలిపారు. పాలిటెక్నిక్ చదవడం ఇష్టం లేని కమల్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోస్టుమార్టం నిమిత్తం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహన్ని తరలించిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Read More...