Category
Local
Local 

దిగువమెట్ట వద్ద రోడ్డు ప్రమాదం -  ఒకరు మృతి                  

దిగువమెట్ట వద్ద రోడ్డు ప్రమాదం -  ఒకరు మృతి                   ప్రకాశం జిల్లా: గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకు పై వెళ్తున్న యువకులను, ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన రామాంజనేయులు అక్కడిక్కడే మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వం ఆసుపత్రి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read More...
Local 

వాళ్ళు రాలేదని వనం మనం రద్దు 

వాళ్ళు రాలేదని వనం మనం రద్దు  ప్రకాశం జిల్లా: జిల్లాలోని తర్లుపాడు మండలం కొనకనమిట్ల గ్రామంలో వనం మనం కార్యక్రమం రద్దయింది. గురువారం నిర్వహించాల్సిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హాజరయ్యారు. అయితే కార్యక్రమ కర్తలు అటవీశాఖ అధికారులు డుమ్మా కొట్టడంతో వారి కోసం కొద్దిసేపు ఎదురు చూసిన ఎమ్మెల్యే కందుల, వారు ఎంతకు రాకపోవడంతో కార్యక్రమాలను రద్దు చేసి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే పాల్గొన్నా, అధికారులు రాకపోవడానికి గల కారణాలు ఏంటి అంటూ చర్చ జరుగుతుంది. మొత్తానికి అధికారులు డుమ్మా కొట్టడంతో వనం మనం కార్యక్రమం రద్దు కావడం విశేషం.
Read More...
Local 

రైలు కింద పడి వ్యక్తి మృతి

రైలు కింద పడి వ్యక్తి మృతి ప్రకాశం జిల్లా : తర్లుపాడు మండలం కేతగుడిపిరైల్వే బ్రిడ్జి దగ్గర గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది అని భావిస్తున్నారు.మృతుని వయస్సు సుమారు 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉండవచ్చు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More...
Local 

జ్యూస్ షాపు లోకి దూసుకెళ్లిన లారీ

జ్యూస్ షాపు లోకి దూసుకెళ్లిన లారీ ప్రకాశం జిల్లా: పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు సెంటర్లో రోడ్డు పక్కనే ఉన్న జ్యూస్  షాప్ లోకి బత్తాయి లోడ్ లారీ దూసుకు వచ్చిన సంఘటన సోమవారం జరిగింది. ఆ సమయంలో షాప్ లో ఎవరు లేక పోవడం తో  ప్రమాదం తప్పింది. కాగా ఈ సంఘటనలో లారి డ్రైవర్, క్లీనర్ కి స్వల్ప గాయాలు అయ్యాయి.
Read More...
Local 

రోడ్ ప్రమాదం లో ఇరువురికి తీవ్రగాయాలు

రోడ్ ప్రమాదం లో ఇరువురికి తీవ్రగాయాలు ప్రకాశం జిల్లా: పెద్దారవీడు మండలం లోని చట్లమిట్ల గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.వీరు తంగిరాలపల్లి గ్రామ వాసులుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Read More...
Local 

ఆవు పై పెద్దపులి  దాడి

ఆవు పై పెద్దపులి  దాడి ప్రకాశం జిల్లా : అర్ధవీడు మండలం పాపినేనిపల్లి అటవీ ప్రాంతానికి . మేతకు వెళ్లిన  ఆవు తిరిగి రాకపోవడం తో వెతకగా బొప్పాయి తోటలో ఆవు మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు.సమాచారం అందుకున్న ఫారెస్ట్  అధికారులు ఆవు మృతి చెందన ప్రాంతానికి వెళ్లి పెద్దపులి దాడి చేసినట్లు  ధ్రువీకరించినట్లు ప్రాథమిక సమాచారం..
Read More...
Local 

ద్విచక్ర వాహనాన్ని ఢి కొన్న గుర్తు తెలియని వాహనం - ఒకరు మృతి

ద్విచక్ర వాహనాన్ని ఢి కొన్న గుర్తు తెలియని వాహనం - ఒకరు మృతి ప్రకాశం జిల్లా: కొమరోలు మండలం బ్రాహ్మణపల్లె గ్రామ రాష్ట్ర ప్రధాన రహదారిలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం.. ద్విచక్ర వాహనదారుడు మృతి..మృతుడు మదవపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తింపు.. ఘటన స్థలానికి చేరుకున్న కొమరోలు  ఎస్ఐ జె.నాగరాజు.
Read More...
Local 

గిద్దలూరు లో అగ్ని ప్రమాదం!

గిద్దలూరు లో అగ్ని ప్రమాదం! గిద్దలూరు :: గిద్దలూరు పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం సమీపంలోని మెయిన్ బజార్లో షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో మంటలు వ్యాపించాయి.ఈ సమయంలో ఇంట్లో వాళ్ళు ఎవరు లేక పోవడంతో ప్రాణ హాని తప్పింది.ఇంట్లో ఉన్న సామాన్లు మంటలకు కాలిపోయాయి. ఇంట్లో వాళ్ళు తిరుపతికి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం వెళ్లారని స్థానికులు తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోనికి తీసుకుని వచ్చారు. మంటలు చుట్టుపక్కల వ్యాపించకుండా కాపాడడంతో చుట్టుపక్కల వారు ఊపిరి పీల్చుకున్నారు.
Read More...
Local 

రోడ్డు ప్రమాదం లో మహిళలకు, చిన్నారులకు స్వల్ప గాయాలు

రోడ్డు ప్రమాదం లో మహిళలకు, చిన్నారులకు స్వల్ప గాయాలు ప్రకాశం జిల్లా:  ఒంగోలు నుంచి సంతనూతలపాడు వెళ్లే మార్గంలో ఎస్.ఎస్.ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఆగి ఉన్న ఆటోని మరో ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆటోలు రెండు రోడ్డుపై తిరగబడడం జరిగింది. దీంతో ఆటోలో ఉన్న ఇద్దరు చిన్నారులకు, మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. పైగా వారు ఆటోలో ఇరుక్కుని పోవటంతో స్థానికుల సహాయంతో తిరగబడ్డ ఆటోని పైకిలేపి ఆటోలో ఉన్న ప్రయాణికులను బయటికి తీయడంతో ప్రమాదం తప్పింది.
Read More...
Cultural  Local 

శ్రీ రామలింగేశ్వరునికి నాగాభరణ అలంకరణోత్సవం

శ్రీ రామలింగేశ్వరునికి నాగాభరణ అలంకరణోత్సవం మార్కాపురం: పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ నగర్ లో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మరకత లింగానికి నాగాభరణోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి గార్లదిన్నె కు చెందిన పెంచికల కాశయ్య దంపతులు నాగాభరణాలు స్వామివారికి సమర్పించారు. పోచంభట్ల కిరణ్ , ఓరుగంటి శివకుమార్ లు మంత్రోచ్ఛారణ నడుమ నాగాభరణాన్ని రామలింగేశ్వరునికి ధరింప చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కలశ మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా నాగాభరణ అలంకరణ నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్త కృష్ణమూర్తి, ఉత్సవ నిర్వహణ ప్రతినిధి వాలిచర్ల కేశవ తెలిపారు.
Read More...
Local 

డాక్టర్ మన్నె రవీంద్ర ను విమర్శించే స్థాయి నీకు లేదు

డాక్టర్ మన్నె రవీంద్ర ను విమర్శించే స్థాయి నీకు లేదు మన్నే రవీంద్రను విమర్శించే స్థాయి నీకు లేదు ..,ఆయన సంతకంతో ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించావు అది గుర్తుందా... డాక్టర్ మన్నే రవీంద్ర ఆశీస్సులతో సంతకంతో బాధ్యతలు స్వీకరించావని ఆయనను విమర్శించే స్థాయి నీకు ఉందా అంటూ దోర్నాల మండల తేదేపా నాయకులు అంబటి వీరారెడ్డి, ఎరిక్షన్ బాబు పనితీరును విమర్శించారు. నాయకుడు అనే వాడు ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యంగా ఉండాలని నమ్ముకున్న నాయకులను, కార్యకర్తలను ఆదరించాలని అలా కాక డాక్టర్ మన్నే రవీంద్ర ఆశీస్సులతో బాధ్యతలు స్వీకరించిన నువ్వు ఇలా డాక్టర్ను విమర్శించడం ఆమోదయోగ్యం కాదని అంబటి వీరారెడ్డి అన్నారు. ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడుపుకు కూడు పెట్టిన వారిని ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటుందని కానీ తన సంతకంతో నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టాలని కోరుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి వద్ద మద్దతు తెలియజేసిన డాక్టర్ మన్నె రవీందర్ ను విమర్శించడం దారుణమని ఆయన అన్నారు. ఆయన లేకుండానే ఆయన ఆమోదం లేకుండానే బాధ్యతలు స్వీకరించే వారా అని ప్రశ్నించారు. ఏ ఒక్కరైనా న్యాయం చేకూర్చిన వారిని ఏ ఒక్కరు విస్మరించరని కానీ కూడు పెట్టిన వారిని సైతం విమర్శించారంటే నీ పని, పేరు ఎలా ఉందో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అర్థమైందని ఆయన తెలిపారు. నాయకుడు అని ఎవరు ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యంగా  ఉంటారని  కానీ మీరు చేస్తున్న పనితీరు మాత్రం నియోజకవర్గంలో పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్కరిని మోసం చేసే విధంగా ఉందని ఆయన తెలిపారు. డాక్టర్ మన్నే రవీంద్ర లేకుండా మీరు బాధ్యతలు స్వీకరించేవారా నియోజకవర్గంలో బాధ్యతలు చేపట్టేవారా ఇంత జరిగినా కూడా ఆయనను సైతం మీరు వ్యక్తిగతంగా దూషిస్తూ కార్యక్రమాలు ఆయనకు తెలియకుండా చేపడుతున్నారంటే మీ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ ఆయన అన్నారు. అందుకే జరగనున్న మహానాడు వేడుకను నియోజకవర్గం లోని ప్రతి ఒక్కరం స్వచ్ఛందంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారితో పని లేకుండా చేస్తామని ఇన్చార్జితో తమకు పనిలేదని ఆయన అన్నారు.అవినీతిమయంలో కూర్చునిపోయి మట్టి నుండి మద్యం ఉపాధి కూలీల వద్ద నుండి 300 రూపాయలు వసూలు చేసుకుంటున్న ఇటువంటి ఇన్చార్జి మాకు వద్దంటూ మహానాడు లోని  తెలియజేస్తామన్నారు
Read More...
Local 

నేను సంతకం పెట్టడం వల్లనే నీవు ఇన్చార్జి అయ్యావు

నేను సంతకం పెట్టడం వల్లనే నీవు ఇన్చార్జి అయ్యావు యర్రగొండపాలెం: నేను సంతకం పెట్టడం వల్లనే నువ్వు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించావని కానీ నువ్వు మాత్రం నియోజకవర్గ ప్రజలను పూర్తిస్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తున్నావని నియోజకవర్గాన్ని అవినీతిమయంగా మార్చావని టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ మన్నే రవీంద్ర, ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పనితీరును విమర్శించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ అవినీతిలో ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. మట్టి నుండి మద్యం షాపుల వరకు పైసలిస్తేనే పనులు చేస్తానంటూ నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేసిన ఘనత ఇన్చార్జి మాత్రమే దక్కింది అన్నారు.. పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలను మోసం చేసిన ఘనత ప్రతి పనిలో వాటాలు అడుగుతూ భవిష్యత్తులో పార్టీని కోలుకోవాలని విధంగా దెబ్బతీసిన నాయకుడు ఎవరంటే ఎరిక్షన్ బాబు మాత్రమే అన్నారు... ఇప్పటివరకు ఓపికతో ఉన్నానని కానీ నమ్ముకున్న పార్టీ మోసం చేసే ఉద్దేశం తనకు లేదని గతంలో 40 వేల ఓట్ల పైచిలుకుతూ గెలుపు పొందుతున్న కాంగ్రెస్ ప్రస్తుత వైఎస్ఆర్సిపి పార్టీని ఐదు వేలకు తెచ్చామంటే అందులో నికార్సైన తెజపకారకర్తల పని తీరు ఉందన్నారు కానీ కార్యకర్తలను విస్మరిస్తూ పార్టీని బ్రష్టు పట్టిస్తూ ముడుపుల మత్తులో మునిగి తేలుతూ భవిష్యత్తులో పార్టీకి ముంచేస్థితిలో ఇన్చార్జి ఉన్నారని అందుకే అన్నారు. ఇదే పద్ధతి కొనసాగితే రానున్న పంచాయతీ ఎన్నికలలో నియోజకవర్గంలో మనకు బంగపాటు తప్పదని ఆయన తెలిపారు. జరగనున్న మహానాడు ను విజయవంతం చేద్దామంటూ ఆయన పిలుపునిచ్చారు
Read More...