హైందవ సంస్కృతి తోనే వసుదైక కుటుంబం
ఒంగోలు చేరిన విశ్వహిందూ పరిషత్ శౌర్య జాగరణ యాత్ర
ఒంగోలు :విశ్వశాంతికి, వసుదైక కుటుంబ నిర్మాణానికి హైందవ సంస్కృతియే శ్రీరామరక్ష అని విశ్వహిందూ పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖ్ సోమ సుబ్బారావు తెలిపారు. విశ్వహిందూ పరిషత్ షష్ట్యబ్ధి మహోత్సవాల సందర్భంగా విశ్వ హిందు పరిషత్, బజరంగదళ్ ఆధ్వర్యంలో శౌర్య జాగరణ యాత్ర సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 14 వరకు నిర్వహిస్తున్నారు. ఆ యాత్రలో భాగంగా శుక్రవారం శౌర్య జాగరణ యాత్ర రథం ఒంగోలు చేరింది. ఈ సందర్భంగా స్థానిక గద్దలగుంట రామాలయం వద్ద ప్రజాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోమ సుబ్బారావు మాట్లాడుతూ 1964 సంవత్సరంలో చిన్మయ మిషన్ స్వామీజీ మరియు 40 మంది సాధు సంతుల సారధ్యంలో విశ్వహిందూ పరిషత్ ఆగస్టు 29వ తేదీన కృష్ణాష్టమి రోజున హిందూ ధర్మ పరిరక్షణ కోసం విశ్వహిందూ పరిషత్ ను స్థాపించారని, సేవ సంస్కార్ సురక్ష లక్ష్యాలుగా విశ్వహిందూ పరిషత్ సమాజంలోని హిందూ ధర్మం కోసం పాటుపడుతున్నదన్నారు. సత్సంగము, గో సేవ, సమరసత తదితర ఆయాముల ద్వారా విశ్వహిందూ పరిషత్ సమాజంలోని సమస్త హిందువులకు చేరువవుతుందన్నారు. మన హిందూ ధర్మంలో చేసే పనిని బట్టి వర్ణాలు నిర్ణయించారని పుట్టుకను బట్టి కాదని తెలిపారు. ఈ వర్ణాలన్నింటినీ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో సహేతుకంగా వివరించారని అన్నారు. మన భారతదేశానికి 1947 లో స్వాతంత్రం వచ్చినప్పటికీ మన హిందూ సమాజానికి స్వాతంత్రం రాలేదని, ఇతర మతస్తులు తమ గ్రంథాలను తమ మత విద్య వ్యాప్తికి ప్రయత్నించేటట్లుగా మన హిందూ మతానికి రాలేదని తెలిపారు. సమాజంలోని అసమానతలు ఏర్పడడానికి జ్ఞాన రాహిత్యమే కారణమని, జ్ఞానము సముపార్జించాలంటే మన గ్రంధాలు పఠించడం, పారాయణ చేయడం, సత్సంగం లో పాల్గొనడం చేయాలని వివరించారు. విశ్వహిందూ పరిషత్ 60 సంవత్సరాల కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 14 రోజులపాటు శౌర్య జాగరణ యాత్ర నిర్వహించాలని ప్రాంత పెద్దలు నిర్ణయించారని తెలిపారు సౌర్య జాగరణ యాత్రలో భాగంగా 13, 14 తేదీలు విశ్వహిందూ పరిషత్ ఒంగోలు జిల్లాలో జరుగుతున్నదని, గురువారం కూచిపూడి, మర్రిపూడి, దర్శి, పొదిలి మీదుగా తాళ్లూరు, గంగవరం, చీమకుర్తి లలో రథయాత్ర కొనసాగిందని, శుక్రవారం రాత్రికి ఒంగోలు చేరి గద్దలగుంటలో రామాలయం ప్రాంగణమున శౌర్య జాగరణ కార్యక్రమం జరిగిందని, రేపు శనివారం కూడా ఒంగోలు చుట్టుపక్కల గ్రామ ప్రాంతాల్లో రథయాత్ర కొనసాగుతుందని తెలిపారు. అనంతరం ఆరిగ నరసింహారావు ప్రసంగిచారు.కార్యక్రమంలో విశ్వ హిందు పరిషత్ ఒంగోలు జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లిఖార్జునరావు, కార్యదర్శి ఇనమనమెళ్లూరి సీతారామయ్య, నగర అధ్యక్షులు పసుమర్తి వేంకటేశ్వర్లు, తోటకూర సుధాకర్ పబ్బిశెట్టి శ్రీనివాసరావు, యక్కలి నాగ సత్యనారాయణ, సాధు శ్రీనివాసగుప్త, కోలా వాసుదేవ, ఈమని బలరామ్, రాధా రమణ గుప్తా జంధ్యం, గద్దలగుంట ప్రాంత నివాసితులు పాల్గొన్నారు.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.