హత్య కేసులో ఏడుగురు ముద్దాయిలకు కఠిన కారాగార శిక్ష

On
హత్య కేసులో ఏడుగురు ముద్దాయిలకు కఠిన కారాగార శిక్ష

ఒంగోలు: హత్యకేసులో ఏడు మంది కి‌ జిల్లా 8వ అదనపు న్యాయమూర్తి అమ్మనరాజ కఠిన కారాగార శిక్ష ను విధించారు. బుధవారం ఈ మేరకు జిల్లా ఎస్పీ మలిక గార్గ్ మీడియాతో మాట్లాడారు.
పటిష్టమైన గుడ్ ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా హత్య కేసులో నిందితులకు కఠిన శిక్షలు పడేలా, క్రియాశీలకంగా వ్యవహరించిన  పోలీస్ సిబ్బందిని అభినందించారు.
కోర్ట్ లో ట్రయల్ జరుగుతున్న కేసులపై జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించి గుడ్ ట్రయిల్ మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ పోలీస్ అధికారులు, కోర్టు మానిటరింగ్ సిబ్బంది, కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో తరుచూ సమీక్ష సమావేశాలు నిర్వహించి సమన్లు జారీ, సాక్ష్యాధారాల సమర్పణ, సాక్ష్యులను కోర్టులో ప్రవేశపెట్టుట తదితర అంశాలపై దిశానిర్ధేశం చేస్తున్నారు. ఫలితంగా పలు కేసులలో ముద్దాయిలకు కోర్టులు కఠిన శిక్షలు విధించటం జరుగుతుందన్నారు.
2012లో ఉమ్మడి ప్రకాశం జిల్లా,  కందుకూరుకు చెందిన ఒక యువతి, ఒక యువకుడు కులాంతర వివాహం చేసుకోవడం అవమానంగా భావించిన యువతి తండ్రి , తమ్ముడు ఉదయ్ సాగర్ (24 సం) ఆ యువకుని పై, వారి వివాహమునకు సపోర్ట్ చేసిన అతని అన్న స్వామి (30సం మృతుడు) పై కక్షి పెట్టుకుని  2012 జూన్ 23న ఒక పథకం ప్రకారం ఏడుగురు ముద్దాయిలు స్వామిని బలవంతంగా ఆటోలో కిడ్నాప్ చేసి తీసుకెళ్లి దారుణంగా హత్య చేసి మృతదేహంను పొన్నలూరు సమీపంలో పొలాల్లో పూడ్చి వేశారు. సాక్ష్యాలను తారుమారు చేసిన ఘటనలో పొన్నలూరు పియస్ లో పలు సెక్షన్ల క్రింద ఎస్సై శ్రీహరి కేసు నమోదు చేయగా అప్పటి కందుకూరు సీఐ పి.కరుణాకర్, పి.అక్కేశ్వరావు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, ముద్దాయిలను అరెస్ట్ చేసి, రిమాండుకు పంపించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసారు.  అనంతరం అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమేష్ బాబు ద్వారా ముద్దాయిలు కోర్ట్ ముందు ప్రవేశపెట్టి సమయానుసారం సాక్షులను కోర్ట్ లో  హాజరుపరుస్తూ ఎస్పీ మార్గదర్శకత్వంలో గుడ్  ట్రయల్ మానిటరింగ్ ద్వారా సమర్థవంతంగా ట్రయల్ నడిపి సరైన సాక్ష్యాధారాలతో 7 ముద్దాయిలపై నేరనిరూపణ చెయ్యడంతో బుధవారం ఒంగోలులోని 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి.అమ్మన రాజా  హత్య నేరం కింద ఇద్దరు ముద్దాయిలకు జీవిత ఖైదు, 1000 రూపాయలు జరిమానా, కిడ్నాప్ నేరం కింద 7గురుకి 10 సంవత్సరాలు జైలు శిక్ష 1000 రూపాయలు జరిమానా,  సాక్షాలను తారుమారు చేసిన నేరం కింద ముగ్గురుకి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష మరియు ₹1000 జరిమానా  విధించారు. ఈ శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని తీర్పు నివ్వడం జరిగింది.  పై కేసుల సరైన సాక్ష్యాధారాలు కోర్ట్ లో ప్రవేశపెట్టి సమర్ధవంతంగా ట్రయల్ మానిటరింగ్ చేసి నిందితులకు శిక్షిపడటంలో క్రియాశీలకంగా పనిచేసిన అప్పటి కందుకూరు సిఐలు పి.కరుణాకర్, పి.అక్కేశ్వరావు, ప్రస్తుతం కొండేపి సీఐ పాండురంగారావు, పొన్నలూరు ఎస్సై రాజారావు, అప్పటి ఎస్సై శ్రీహరి, అడిషనల్ పిపి రమేష్ బాబు, కోర్ట్ లైజన్ ఏఎస్సై సత్య శ్రీనివాస్, పొన్నలూరు కోర్ట్ ఏఎస్సై యస్. బాలకృష్ణ మూర్తి, హెడ్ కానిస్టేబుల్ రమణయ్యలను  ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News