9న ఆళ్లగడ్డలో నిర్వహించే టిడిపి సభను జయప్రదం చేయండి

- శ్రీశైలం నియోజక వర్గ పార్టీ పరిశీలకులు వక్కలగడ్డ పిలుపు

On
9న ఆళ్లగడ్డలో నిర్వహించే టిడిపి సభను జయప్రదం చేయండి

ఆత్మకూరు: నంద్యాల పార్లమెంటు పరిధిలోని ఆళ్లగడ్డలో ఈ నెల 9 తేదీన జరుగు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆత్మకూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు వక్కలగడ్డ మల్లికార్జునరావు పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు.

చంద్రబాబు బహిరంగ సభను జయప్రదం కోరుతూ పార్టీ కార్యకర్తలతో సన్నాహక సమావేశం ఆదివారం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే , టిడిపి ఇన్చార్జి బుడ్డా రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా వక్కలగడ్డ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అన్ని రంగాలలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తానని పదేపదే చెప్పిన జగన్ అధికారులకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన విధంగానే రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి,  మరోవైపు ప్రజాధనాన్ని లూటీ చేస్తూ, పేద ప్రజలపై అనేక భారాలను మోపుతూ  రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకొని వెళ్లిపోయారని వ్యంగంగా విమర్శించారు.
గతంలో ఎన్నడలేని విధంగా రాష్ట్రంలో నిత్యవసర వస్తువులు, ఇసుక, ఇటుక ఉక్కు రెట్లు ఘననీయంగా పెరిగాయని, దీంతో అన్ని వర్గాల ప్రజలు కొనుగోలు చేయలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్త పరిపాలన విధానాల ఫలితంగా  అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో కొట్టుమిట్టాడుతూన్నారని అన్నారు.వచ్చే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు, అలాగే  చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసేందుకు   ప్రజలు ఆత్రుతతో  ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు.
వైసిపి ప్రభుత్వం ఓటమి ఖాయమని, ఈ విషయం ఆ పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు అర్థమైందని, అందువల్లనే గెలిచే పార్టీ అయిన టిడిపి వైపు వైసిపి నాయకులు మొగ్గు చూపుతూ సైకిల్ ఎక్కేందుకు క్యు కడుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో చంద్రబాబు బహిరంగ సభలకు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారని, దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు మీటింగులకు వెళ్లకుండా అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు.కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి కె. ఉమామహేశ్వరరావు నాయుడు మాట్లాడుతూ పార్టీలకు వర్గాలకు రహితంగా ఆళ్లగడ్డలో జరుగు టిడిపి బహిరంగ సభకు పెద్ద ఎత్తున హాజరుకావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
శ్రీశైలం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చంద్ర బాబు సభకు పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి హాజరయ్యేటట్లు చూడాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

IMG-20240107-WA0058

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

దిగువమెట్ట వద్ద రోడ్డు ప్రమాదం -  ఒకరు మృతి                   దిగువమెట్ట వద్ద రోడ్డు ప్రమాదం -  ఒకరు మృతి                  
ప్రకాశం జిల్లా: గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకు పై వెళ్తున్న యువకులను, ఓ కారు ఢీ కొట్టింది. ఈ...
నేటి పంచాంగం;  *బుధవారం, జూన్ 11, 2025*
నేటి పంచాంగం:  *మంగళవారం, జూన్ 10, 2025*
నేటి పంచాంగం:  *సోమవారం, జూన్ 9, 2025*
నేటి పంచాంగం: *ఆదివారం, జూన్ 8, 2025*
నేటి పంచాంగం:  *శనివారం, జూన్ 7, 2025//
సూట్‌ కేసులో గుర్తు తెలియని మహిళ మృతదేహం?