యువతకు స్ఫూర్తి మంత్రం... స్వామి వివేకానంద

నేడు ఆ మహనీయుని జయంతి

On
యువతకు స్ఫూర్తి మంత్రం... స్వామి వివేకానంద

స్వామి వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902), (బెంగాలీలో 'షామీ బిబేకానందో') ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.
భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి ఉంది. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. భారతదేశాన్ని ప్రేమించి, భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్ లో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.
తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్పై తొమ్మిది ఏళ్ళ వయసు లోనే మరణించాడు. అతను చేసిన సేవలకు గుర్తింపుగా 1984 లో భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని "జాతీయ యువజన దినోత్సవం"గా ప్రకటించింది.
జననం
నరేంద్రనాథ్ దత్తా 1863 58 12 కలకత్తా,బెంగాలు ప్రిసిడెన్సీ, బ్రిటీషు పరిపాలనలోని భారతదేశం (ఇప్పుడు కోల్కతా, పశ్చిమ బెంగాల్, భారత దేశం)

నిర్యాణము

1902 3 4 (వయసు 39) బేలూరు మఠం, బెంగాలు ప్రిసిడెన్సీ, బ్రిటీషు పరిపాలనలోని భారతదేశం (ఇప్పుడు పశ్చిమ బెంగాల్, భారత దేశం)

స్థాపించిన సంస్థ

బేలూరు మఠం, రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్.

సాహిత్య రచనలు

రాజయోగ, కర్మయోగ, భక్తియోగ, జ్ఞానయోగ.

ప్రముఖ శిష్యు(లు)డు

స్వామి అశోకానంద, స్వామి విరాజానంద, స్వామి పరమానంద, ఆలసింగ పెరుమాల్, స్వామి అభయానంద, సోదరి నివేదిత,స్వామి సదానంద.

ప్రభావితులైన వారు

సుభాష్ చంద్ర బోస్, అరబిందో, భాగ జతిన్, మహాత్మా గాంధీ, చక్రవర్తి రాజగోపాలాచారి, జమ్సెట్జి టాటా, నికోలా టెస్లా, సారా బెర్న్ హార్ట్,ఎమ్మా కాల్వె, జగదీశ్ చంద్ర బోస్

ఉల్లేఖన

"లేండి, మేల్కొనండి, గమ్యం చేరేదాక ఆగవద్దు".

IMG_20240112_065939

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

ఘోర రోడ్డు ప్రమాదం ఘోర రోడ్డు ప్రమాదం
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోగా ఈ సంఘటన లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద లారీ, కారు ఢీకొన్నాయి....
తండ్రి చేతిలో కొడుకు హతం...
నేటి పంచాంగం:  *శుక్రవారం, మే 23, 2025*
డియల్డివో గా బాధ్యతలు స్వీకరించిన బాలూ నాయక్ 
Video: ఆర్కే బీచ్ రోడ్  ఆన్ మూల్ విల్లాలో  శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం నమూనా  ప్రారంభం
ఏసీబీ వలలో మిషన్ భగీరథ ఏఈ
ఆర్టీసీ బస్సు బీభత్సం