సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యం
వైకాపా వైపాలెం అభ్యర్థి తాటిపర్తి
యర్రగొండపాలెం : గతంలో పలు పార్టీలు రాజకీయంగా గుర్తింపు పొంది ఉన్నా కూడా సామాజిక న్యాయాన్ని ఏ పార్టీలు అవలంబించలేదని సామాజిక న్యాయం కేవలం జగనన్నతోనే సాధ్యమవుతుందని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. తాటిపర్తి అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఐదు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు అభినందనలు తెలిపారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించి తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు. ఈ సందర్భంగా తాటిపర్తి మాట్లాడుతూ 175 అసెంబ్లీ స్థానాలను, 25 లోక్ సభ స్థానాల అభ్యర్థులను ప్రకటించి జగనన్న తన సత్తా చూపారన్నారు. వారిలో 50% ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీలే అని ఆయన తెలిపారు. మొత్తం ఎంపీ ఎమ్మెల్యే స్థానాల్లో 100% ఇచ్చిన ఘనత మన జగనన్న కు మాత్రమే దక్కుతుందన్నారు. రాజ్యాధికారంతోనే సామాజిక మార్పు వస్తుందని నమ్మిన ఏకైక నాయకుడు జగనన్న మాత్రమే అన్నారు. 2019లో ఎస్సీలు 29 ఎస్టీలు 7 మహిళలు 15 మైనార్టీలు ఐదు ప్రకటించారని ప్రస్తుతం 2024లో ఎస్సీలు 29 ఎస్టీలు ఏడు బిసి 48 మహిళలు మైనార్టీలు 7మందిని ప్రకటించి సామాజిక న్యాయం చేకూర్చే పార్టీ వైఎస్ఆర్సిపి అని తెలియజేశారని అన్నారు.జగనన్న అధికారం చేపట్టిన వెంటనే తన మేనిఫెస్టోలో అమలు చేసిన ప్రతి పథకాన్ని నేరుగా ప్రజల దరి చేకూర్చిన చేసిన ఘనత ఆయనకు మాత్రమే దక్కుతుందన్నారు. గత నాయకులు రుణమాఫీ అన్నారు పెన్షన్ లు నిరుద్యోగ భృతి అక్కచెల్లెమ్మలను ఆదుకుంటాము, రైతుల సమస్యలు తీరుస్తాము, ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని 600 హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన వెంటనే వాటిని విస్మరించిన ఘనత ఆ ప్రభుత్వాలకు దక్కితే, ఇచ్చిన ప్రతి హామీ తోపాటు ప్రజలకు అవసరమైన ప్రతి సంక్షేమ పథకాన్ని గుర్తించి నేరుగా ప్రజల దరిచేకూర్చిన ఘనత జగనన్నకు మాత్రమే దక్కిందన్నారు. ఒక్కడిని ఎదుర్కొనడానికి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఏకమై ఉన్నాయని వారంతా జగనన్న ప్రభుత్వాన్ని ఓడించడానికి శతవిధాల కృషి చేస్తున్నారని కానీ వారిని నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. నియోజకవర్గంలో లక్ష అరవై వేల మంది ఓటర్లు ఉంటే 1,80,000 మందికి సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందన్నారు. దానర్థం కులాలు మతాలు పార్టీలకు అతీతంగా పాదయాత్ర నాడు జగనన్న చెప్పిన చేపట్టిన ప్రతి పథకాన్ని నేరుగా ప్రజల దరి చేర్చి ఏపీ రాష్ట్ర ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు. గతంలో ఏ ఒక్క సంక్షేమ పథకమైన ప్రజల దరి చేరాలంటే జన్మభూమి కమిటీలకు అడుగులకు మడుగులు వత్తవలసిన దుస్థితి ఉందన్నారు కానీ ప్రస్తుతం మన ప్రభుత్వం మాత్రం నేరుగా ఒకటవ తేదీనే ప్రతి సంక్షేమ పథకాన్ని చేర్చిన ఘనత మన ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. మహాకూటమి వలె ప్రకటించుకున్న కౌరవ సైన్యం జగనన్న పై యుద్ధాన్ని ప్రకటించారని యుద్ధంలో పోరాడుతుంది ఒక్కడు మాత్రమే అని మహాకూటమి భావిస్తుందని కానీ కోట్ల మంది శ్రీకృష్ణులు మీ రూపేనా జగనన్నకు బాసటగా నిలిచారన్న విషయాన్ని మరిచారన్నారు. రాజకీయాలు నైతిక విలువలతో చేయాలని ప్రతిపక్షాలు ఒకవేళ రాజకీయాల్లో నిడబడాలని కోరుకుంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఆ పార్టీ బరిలో నిలవాలని అలా కాక రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలతో కుమ్మక్కు కావడంతోపాటు ఒక్కడిపై యుద్ధం ప్రకటించవలసిన అవసరమా అంటూ ఆయా పార్టీలకు చెందిన నాయకులే అంటున్నారని ఆయా పార్టీలకు చెందిన నాయకులు అంటున్నారని ఆయన తెలిపారు. నాయకుడు అనే వాడు పలువురికి ఆదర్శవంతంగా నిలవాలని తాను చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని అలా కాక ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న నాయకుడిని ఓడించడానికి మీ అందరి మద్దతు తెలియజేయాలని కోరుతూ ఉంటే ఆ పార్టీలకు ఉన్న బలం ఏమిటో అర్థమవుతుంది అన్నారు అలా కాక రాష్ట్రంలోనే అన్ని పార్టీలతో కుమ్మక్కై ఒక్కడిపై యుద్ధం ప్రకటించారు అంటే ప్రజలు సైతం ఆలోచించాలని ఆయన అన్నారు. నిజంగా వారికి బలం ఉంటే నైతిక విలువలతో రాజకీయాలు చేస్తే రాజకీయంగా ఒకడిని ఎదుర్కోవాలంటే ఒక్కరిగానే బరిలో నిలవాలని అలా కాక రాష్ట్రంలోనూ అన్ని పార్టీలతో కుమ్మక్కయ్యారంటే వారి బలము ఏ పార్టీతో రాష్ట్ర ప్రజల సైతం అర్థం చేసుకున్నారన్నారు.తాము ప్రజలను నమ్ముకున్నామని వైఎస్ఆర్సిపి చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని నాయకులతో పని లేకుండా వారి దరి చేర్చమని కానీ ప్రతిపక్షాలు మాత్రం జగనన్నను ఓడించడమే తమ లక్ష్యమని ప్రకటనలు చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోవాలన్నారు. గతంలో సైతం చంద్రబాబు తన మేనిఫెస్టోలో అనేక పథకాలను అమలు చేశానని ప్రకటించుకుంటూనే గెలిచిన అనంతరం ఏమేరా ఆయన ప్రజలకు మేలు చేకూర్చారు ప్రజలు సైతం గుర్తు చేసుకోవాలన్నారు. అటువంటి పార్టీలను నమ్మవద్దని ఆయన కోరారు. ప్రస్తుతం నియోజకవర్గంలో కొందరికి అత్యాశ చూపి మరి పార్టీలో చేరికలు చేపడుతున్నారని కానీ భవిష్యత్తు మనదేనని ఆయన తెలిపారు. తాను బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఉంటున్నానని తన తప్పిదం ఏమైనా ఉందా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. తన తప్పిదం ఏమైనా ఉంటే డైరెక్ట్ గా తనను ప్రశ్నించవచ్చని ఆయన కోరారు. జగనన్న సైతం నాయకులను ప్రతి ఒక్కరిని ఆదరిస్తూనే ఉంటారని కానీ వైయస్సార్సీపీకి కార్యకర్తలే బలం అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తాను తప్పు చేసిన కార్యకర్తలకు తాను చేపట్టిన సంక్షేమ పథకాలు అందుకున్న నేరుగా తననే ప్రశ్నించాలని కోరిన ఏకైక నాయకుడు జగనన్న మాత్రమే అన్నారు. రాష్ట్ర ప్రజలకు అవసరమైన ప్రతి సంక్షేమ పథకాన్ని తాను అమలు చేశానని ఏమైనా తప్పిదాలుంటే తనని ప్రశ్నించాలని లేనిపక్షంలో మీకు న్యాయం జరిగి ఉంటేనే తనను ఆదరించాలని కోరుకున్న ఏకైక నాయకుడు ప్రపంచ రాజకీయ చరిత్రలో నాయకుడు ఉండరన్నారు.నియోజకవర్గంలో జరుగుతున్న వలసలు నీటి మీద బుడగల వంటివని తప్పనిసరిగా కచ్చితంగా ప్రతి ఒక్కరు జగనన్న ఆదేశాల మేరకు అనుకూలంగా ప్రవర్తిస్తారని ఆశాభవాన్ని ఆయన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన విషయాలను తాను ప్రస్తావించనని తాను బాధ్యతలు స్వీకరించిన నాటినుండి ప్రతి ఒక్కరికి జగనన్న ఆదేశాల మేరకే నడుచుకుంటున్నానని ఆయన అన్నారు. రానున్న రోజులలో ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఎర్రగొండపాలెం అభ్యర్థిగా తాను గెలుపు నల్లేరుపై నడకే నని తాటిపర్తి తెలియజేస్తున్నారు... ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రాజకీయ వేడి రగిలింది. గత కొద్దిరోజులుగా వైఎస్ఆర్సిపి పార్టీ నుండి తెదేపాకు చేరికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మాత్రం వైఎస్ఆర్సీపీ వెంటే ఉన్నారంటూ గతంలో ఉన్న కొన్ని కారణాల వలన ఇతర పార్టీలకు వలస వెళ్తున్నారని జరగనున్న ఎన్నికలలో వైయస్సార్సీపి అత్యధిక మెజార్టీ సాధించడం ఖాయమని తాటిపర్తి అంటున్నారు.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.