వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ భూస్థాపితం

కొనకనమిట్ల మండలంలో పలు గ్రామాల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా

On
వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ భూస్థాపితం

 

కొనకనమిట్ల: మే 13న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి- సంక్షేమానికి మరోసారి అవకాశం కల్పించండని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి,ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని పేర్కొన్నారు. ఆదివారం నియోజకవర్గ పరిధిలోని కొనకనమిట్ల మండలంలోని వెలిగండ్ల, బసవాపురం,ఉమాయపాలెం మునగపాడు, ఎస్సీ పాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రచార కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా ఆయా గ్రామాల్లోని ప్రతి గడపకు వెళ్లి జగనన్న పాలనలో అందించిన మంచిని వివరించారు. అనంతరం ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్న మీ అన్నా రాంబాబును,ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించి జగనన్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు.టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు అధికారం పగటికలగా మిగిలిపోతుందని,మరో 30 ఏళ్లు రాష్ట్రానికి సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే ఉండాలన్నదే ప్రజలందరి అభిమతమన్నారు.ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్సార్ కుటుంబానికే దక్కిందన్నారు. జూన్లో రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నరన్నారు.జగనన్న పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేలా కృషి చేశారన్నారు. డీబీటీ- నాన్ డీబీటీ ద్వారా రూ.4.65 లక్షల కోట్లు పేదల చెంతకే చేర్చారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు 2014 ఎన్నికల్లోనూ జనసేన- బీజేపీ కూటమితో జతకట్టి గెలుపుకోసం 650 తప్పుడు హామీలిచ్చి ప్రజలను మోసం చేశాడని ఎమ్మెల్యే అన్నా విమర్శించారు. మళ్లీ అదే కూటమితో ఈ ఎన్ని కల్లో మీ ముందుకు వస్తున్నాడని, ప్రతి మహిళకు బంగారు వడ్డాణం ఇస్తామన్నా ఆశ్చర్యం లేదన్నారు.  డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, ప్రతి ఇంటికీ రూ.2.కే 20 లీటర్ల శుద్ధి జలం, రైతు రుణమాఫీ తదితర హామీలు ఏమయ్యాయని ప్రశ్నించాలన్నారు. ముందుగా ఆయా గ్రామాల్లోని పలువురు వైసీపీ నాయకులు, పలువురు వైసీపీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, ఎమ్మెల్యే అన్నాను ఘనంగా సన్మానించి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమం లో పలువురు వైసీపీ ముఖ్య నాయకులు,వైసీపీ ప్రజా ప్రతినిధులు,వైసీపీ కుటుంబ సభ్యులు,కొనకనమిట్ల మండల నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

IMG-20240331-WA0070IMG-20240331-WA0064

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

ఏడు మంది వైకాపా కౌన్సిలర్ల ను సస్పెండ్ చేసిన వైసీపీ అధిష్టానం  ఏడు మంది వైకాపా కౌన్సిలర్ల ను సస్పెండ్ చేసిన వైసీపీ అధిష్టానం 
ప్రకాశం జిల్లా:  మార్కాపురం పురపాలక సంఘంలో చైర్మన్గా ఉన్న చర్లంచెర్ల బాలమురళీకృష్ణ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, తీర్మానం నెగ్గించడంలో పార్టీ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించిన...
నేటి పంచాంగం: *బుధవారం, జూలై 16, 2025*
నేటి పంచాంగం:  *మంగళవారం, జూలై 15, 2025*
విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకు బ్రాహ్మణ సంఘం ఘన నివాళి
ఆటోను ఢికొట్టిన డిసిఎం వ్యాన్..9 మంది బేల్దారు కూలీలకు గాయాలు
గేదె ను ఢీకోట్టి పల్టీలు కొట్టిన కారు.. ఇరువురు మృతి
నేటి పంచాంగం: *సోమవారం, జూలై 14, 2025*