ప్రతి మహిళనూ లక్షాధికారిగా చూడాలన్నదే జగనన్న లక్ష్యం

ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ సతీమణి కల్పనారెడ్డి

On
ప్రతి మహిళనూ లక్షాధికారిగా చూడాలన్నదే జగనన్న లక్ష్యం

గిద్దలూరు: పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి  ప్రజలకు నవరత్నాల సంక్షేమ పథకాలు అందించారని, అందులో భాగంగానే పావలా వడ్డీ కార్యక్రమం అమలు చేశారని గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ నాగార్జున రెడ్డి సతీమణి కల్పనారెడ్డి పేర్కొన్నారు. ప్రతి మహిళా లక్షాధికారి కావడమే జగనన్న లక్ష్యం అని అన్నారు. శుక్రవారం ఆమె గిద్దలూరు పట్టణంలో తన భర్త నాగార్జున రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడచిన ఐదేళ్ల లోనే 85 లక్షల మంది మహిళలకు 7000 కోట్ల రూపాయిలను పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా అందించారని, వివిధ వర్గాల ప్రజలు, స్వయం సహాయక సంఘాల మహిళలు పావలా వడ్డీ రుణాల ద్వారా చిరు వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహించారని తెలిపారు. తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రతి కుటుంబానికే దిక్సూచిలా మహిళలను నిలిపిన ఘనత వైఎస్ , జగనన్న తెచ్చిన పావలావడ్డీ పథకానిదే. ఇదే పథకాన్ని తరువాత రైతులకూ వర్తింప చేసారని.... 
కావున జగనన్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందిన ప్రతి ఒక్కరు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు గుర్తించి గిద్దలూరు, ప్రజల అభివృద్ధి కోసం,  జగనన్నను మరో సారి గెలిపించాలని, అందుకోసం జగనన్న బలపరిచిన గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి  కుందూరు నాగార్జున రెడ్డి కి, ఎంపి అభ్యర్థి  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మి ఆశీస్సులు తెలియజేయాలని కల్పనా రెడ్డి ప్రజలను, నాయకులను, కార్యకర్తలను,డ్వాక్రా అక్క చెల్లెమ్మలను కోరారు.
ముందుగా గిద్దలూరు టౌన్ 2 వ వార్డులోని నంద్యాల బాలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా ప్రతినిధులు పులమాలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. 
అనంతరం గణేష్ నగర్ సెంటర్ వినాయక స్వామి గుడిలో కల్పనా రెడ్డి, కుటుంబ సభ్యులు స్వామి వారికి పూజలు చేసి 2 వ వార్డులోని ప్రతి గడప - గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని వివరించి ఐదేళ్ళ పాలనలో అందించిన సంక్షేమ పథకాల కరపత్రాలను అందించడం జరిగింది.

Screenshot_2024-04-05-18-53-43-27_99c04817c0de5652397fc8b56c3b3817

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

రైలు నుంచి జారిపడి మహిళ మృతి రైలు నుంచి జారిపడి మహిళ మృతి
ప్రకాశం జిల్లా: కంభం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి మావమ్మ (44) అనే మహిళ మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. మహిళ బెంగుళూరు...
భార్యని చంపిన భర్త
ఎమ్మెల్యే ల పనితీరు పై ప్రజల నుంచి ఫిర్యాదులు
నేటి పంచాంగం:     *ఆదివారం, జూన్ 22, 2025*
బేస్తవారిపేటలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి 
నేటి పంచాంగం:  *శనివారం, జూన్ 21, 2025*
అష్టాదశ శక్తిపీఠాలు