నా జీవితం వైయస్సార్ కుటుంబానికి అంకితం
ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర రెడ్డి
యర్రగొండపాలెం: 16 సంవత్సరాల వయసు నుండి వైయస్ రాజారెడ్డి శిష్యుడిగా దివంగత వైయస్సార్ కు తమ్ముడిగా రాజకీయాలలో అడుగిడానని, నా జీవితం మొత్తం వైయస్సార్ కుటుంబానికి అంకితం అని ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్సిపి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఎర్రగొండపాలెం పట్టణంలో ఆత్మీయ సమావేశం జరిగింది. కార్యక్రమానికి హాజరైన చెవిరెడ్డికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. మోటర్ బైక్ పై ప్రయాణిస్తూ ఆయన ర్యాలీ నిర్వహించారు. పూలమాల లు శాలువాలతో సత్కరించారు. అనంతరం జరిగిన ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజల ఆత్మీయత చూస్తుంటే నాకు పులివెందుల గుర్తుకు వస్తుందన్నారు. అక్కడ మన జగనన్నకు ఎంత ఆత్మీయత చూపుతారో, ఇక్కడ ప్రజలు సైతం అదే రీతిలో మాపట్ల ఆదరణ చూపటం ఇది మరో పులివెందులని గుర్తు చేస్తున్నారన్నారు. రాజన్న కొడుకు ముందు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు ఉండడం ఈ ప్రాంతంలో తాను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు. నేను లోకల్ అని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని ఆయన కోరారు. గృహాన్ని ఏర్పాటు చేసుకుంటానని మీ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు తను చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నానని నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో 972 కోట్లతో చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని 5096 పనులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. తాను ఇతర ప్రాంతాలకు వలస రాలేదని జగనన్న జెండా ఎజెండా ఒకటే అని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే ఆయన లక్ష్యమన్నారు. ఎరుపు పసుపు ఆరంజ్ పోటీలు చేస్తున్నాయని వారిని నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు జగనన్న చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని నాడు విమర్శించిన ప్రతిపక్షం నటనకు మారుపేరైన నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పిల్లి మొగ్గలు వేస్తున్నారన్నారు. లైఫ్ కి విలువలేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబునాయుడు మాత్రమే అన్నారు. జగనన్న వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే వారిని ఏ రీతిలో మహాకూటమి ఇబ్బందులకు గురి చేశారు ప్రజలు సైతం అర్థం చేసుకోవాలన్నారు. వాలంటీర్లు అంటే ఒక జిహాదులని అర్ధరాత్రి తలుపులు కొడతారని ఇంటి విషయాలు తెలుసుకుంటారని విమర్శించిన నటులు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదివేలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ నాయకుడికి నీ అనుభవం ఉన్నంత ప్రజల కోసం బరిలో నిలిస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలతో కుమ్మక్కై ఒక్కడి మీద యుద్ధం ప్రకటించావని అప్పుడే మీ ఓటమి పతనం ప్రారంభమైందని ఆయన అన్నారు. చంద్రబాబు చరిత్ర మొత్తం రాజకీయ అవసరాల కోసం దిగజారుడు రాజకీయాలు చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటేఅది ఆయన మాత్రమే అన్నారు.జగనన్న పాదయాత్ర నాడు ప్రజల స్థితిగతులను తెలుసుకొని 3700 కిలోమీటర్లు కాలినడకన యాత్ర చేపట్టి వారి సమస్యలను పరిష్కరించడానికి సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదర్శవంతంగా నిలిచిన ఏకైక నాయకుడు జగనన్న మాత్రమే అన్నారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల సైతం జగనన్న చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు పరుస్తున్నాయి అంటే అది మన వైఎస్ఆర్సిపి జగనన్న గొప్పతనం మాత్రమే అన్నారు. యువత కోసం సుమారు నాలుగు లక్షల ఉద్యోగాలు ఏర్పాటు చేశారన్నారు. ప్రజల సమస్యలను ఎక్కడెక్కడ పరిష్కరించడానికి సచివాలయ వాలంటీర్ వ్యవస్థను రూపొందించారన్నారు. వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు అండ్ కో పార్టీలు అడ్డుకొనడంతో రాష్ట్రంలోని లక్షలాది మంది వృద్ధులు ఎంతలా ఇబ్బందులు పడ్డారు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ప్రజలకు ఈపాటికి అర్థమయ్యే ఉందన్నారు. చంద్రబాబు కుర్చీ కోసం ఎంతటి అకృత్యాలకైనా పాల్పడతారని జగనన్న పై జరిగిన దాడి సైతం వారి స్కెచ్ లు ప్రకారమే జరిగిందని ఆయన ఆరోపించారు. వైద్యుల సైతం నిర్ధారించారని నుదుటిపై బలంగా భయం జరిగిందని అదే మరోచోట జరిగి ఉంటే ప్రాణాపాయం సంభవించేదని వైద్యులు సైతం తెలియజేశారన్నారు. ఇటువంటి కుట్ర రాజకీయాలు చేయటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని ఆయన విమర్శించారు. వారు చేసిన తప్పును కప్పిపుచ్చుకొనడానికి నిందలు ప్రభుత్వానికి వీటిని ఏనాడు ప్రజలు విస్మరించరని ఆయన అన్నారు. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్న రీతిలో చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తూ ఆయన పతనాన్ని ఆయనే కొని తెచ్చుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఆయన అభినందించవలసిన పని తమకు లేదని మా ప్రభుత్వం పేదల ప్రభుత్వమని తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకం లేరుగా ప్రజల దరి చేరితే ఓటు వేయాలని అడిగిన ఏకైక నాయకుడు జగనన్న మాత్రమే అన్నారు. జగనన్న చేపట్టిన ప్రతి సంక్షేమ పథకం నేరుగాప్రజల దరి చేరిందన్నారు. ఇటువంటి ప్రజారాజ్యక ప్రభుత్వాన్ని ఆదరించడానికి రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ సంసిద్ధంగా ఉంటారని ఆయన తెలిపారు. వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి మాట్లాడుతూ మన పార్టీ పేదల పార్టీ అని తిరుగులేని నాయకుడు జగనన్న మాత్రమే అన్నారు. గత కొద్ది రోజుల నుండి నియోజకవర్గంలో అసంతృత్తులు ఉన్నారని పార్టీని వీడుతున్నారని నిత్యం ఇతర పార్టీలో చేరికలు జరుగుతున్నాయని తెలియజేస్తున్నారని జగనన్నను వదిలి పక్కకు పోయే ప్రసక్తి లేదన్నారు. మనది బలమైన పార్టీ అని కుటుంబంలో చిన్నపాటి సమస్యలు సర్వసాధారణమని తిరిగి ప్రతి ఒక్కరు మంచి జరిగే మన పార్టీకి మద్దతు తెలియజేస్తారని ఆయన తెలిపారు. మన పార్టీ బలం కార్యకర్తలు మాత్రమే నేను సామాన్య కార్యకర్తనుండే పార్టీలో అడిగిడానని మీలో ఒకటిని మీ మధ్యనే ఉంటాను మీ శ్రేయస్కే కృషి చేస్తాను అని తాడిపత్రి తెలిపారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నను ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపిస్తే పశ్చిమ ప్రాంత నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని శాశ్వతంగా పరిష్కరిస్తానని తాటిపర్తి అన్నారు. అనంతరం పెద్ద ఎత్తున హాజరైన మండల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు వెన్న హనుమారెడ్డి ,స్థానిక నాయకులు ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్ ,జడ్పిటిసి చేదురి విజయభాస్కర్, సర్పంచి రామావత్ అరుణాబాయి, మండల కన్వీనర్ కొప్పర్తి చిన్న ఓబులరెడ్డి, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.