జనం మెచ్చిన ప్రభుత్వమే జగనన్న ప్రభుత్వం
వైకాపా అసెంబ్లీ అభ్యర్థి తాటిపర్తి
యర్రగొండపాలెం: గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రతి పథకాన్ని ప్రజల దరి చేర్చిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అని ఇది మన ప్రభుత్వం అని పేదల ప్రభుత్వమని,జనం మెచ్చిన ప్రభుత్వం అని వైఎస్ఆర్సిపి అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. పర్యటనలు భాగంగా బుధవారం పట్టణంలోని చైతన్య నగర్ తదితర ప్రాంతాలలో తాటిపర్తి ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. పట్టణంలోని వైఎస్ఆర్సిపి నాయకులు నరసింహారావు గృహం వద్ద నుండి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రచారానికి హాజరైన తాటిపర్తికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. స్థానిక నాయకులు, కార్యకర్తలు పూలమాలలు, శాలువాలతో ఆయన ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేసివాటిని నియదుగా ప్రజల దతి చేకూర్చిన ఘనత వైయస్సార్ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందన్నారు. నిజంగా రాష్ట్ర ప్రజల సైతం ఆలోచించాలని గత ప్రభుత్వాలలో చివరకు పెన్షన్ కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా జన్మభూమి కమిటీల ఆమోదం తప్పనిసరి అని కానీ మన ప్రభుత్వంలో అర్హులై ఉంటే చాలు వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ద్వారాఒక్క అర్హులకు సంక్షేమ పథకాలు చేసామన్నారు.మన ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ఇతర రాష్ట్రాల సైతం ఆదర్శంగా తీసుకున్నారంటే అది మన ప్రభుత్వం గొప్పతనం మాత్రమే అన్నారు. కులాలు పార్టీలకు మతాలకతీతంగా మన ప్రభుత్వం సంక్షేమ పథకాలను అర్హులకు అందజేస్తే వారు మనవారు మనకు ఓట్లు రావు వారి ఇతర పార్టీలకు చెందిన వారు అన్న రీతిలో గత ప్రభుత్వం పని చేసింది అన్నారు. అందుకే వారిని గత ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు పక్కన పెట్టారని ఆయన తెలిపారు. ప్రస్తుతం కూడా మహాకూటమి పేరిట వారుఎన్నికల నేపథ్యంలో మరో వారు ప్రజలను మోసగించడానికి సంసిద్ధులే ఉన్నారని వారిని నమ్మవద్దని ఆయన సూచించారు.ఒక పార్టీ నాయకుడు వంచించే మనస్తత్వం కలిగిన వారిని. ఆ పార్టీకి చెందిన మరో నాయకుడికి అవగాహన లేదని మరో నాయకుడికి తన పనితనంప్రపంచం ఉన్నంతకాలం అర్థం కాదని ఇటువంటి వారు నాయకుల అంటూ ఆయన ప్రశ్నించారు. ఇటువంటి వారు అధికారం చేపట్టడానికి శాసక్తుల కృషి చేస్తున్నారని వారిని నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు ఏనాడు లేరని ఉండరని ఆయన అన్నారు. నాయకుడు అనే వాడికి నైతిక విలువలు ఉండాలని నైతిక విలువలు కలిగిన ఏకైక నాయకుడు జగనన్న మాత్రమేనని కేవలం అధికారం కోసం అన్ని పార్టీలతో కుమ్మక్కై మేనిఫెస్టోలో ఉన్న వాటిని విస్మరించి గత ఎన్నికల్లో 650హామీలను ఏర్పాటు చేస్తామని తెలిపి గెలిచిన అనంతరం వాటిని విస్మరించిన పార్టీలకు మద్దతు తెలియజేద్దామా లేక ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నూటికి నూరు శాతం అమలు చేసిన జగనన్న ప్రభుత్వానికి మద్దతు తెలియజేద్దాం అంటూ ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తు మనదే అంటూ ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారని రానున్న రోజుల్లో మన ప్రభుత్వం ప్రజారాజ్యక ప్రభుత్వం అధికార పీఠం చేపట్టడం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రజలు సైతం ఆలోచించి రానున్న ఎన్నికల్లో ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు జరగనున్న ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి, శాసనసభ్యులుగా తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ దొంతా కిరణ్ గౌడ్, సర్పంచ్ రామావత్ అరుణ భాయ్, మండల కన్వీనర్ కొప్పర్తి చిన్న ఓబుల రెడ్డి , స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.