శ్రీ కాటమరాజు ఆలయం వద్ద సౌకర్యాల కల్పనే లక్ష్యం

ఆలయం వద్ద ఏర్పాట్లు పరిశీలించిన కమిటీ

On
శ్రీ కాటమరాజు ఆలయం వద్ద సౌకర్యాల కల్పనే లక్ష్యం

పెద్దారవీడు మండలం కలనూతల సమీపంలోని శ్రీ కాటమరాజు దేవాలయం రోజు రోజు కి భక్తుల రాకతో కిక్కిరిసిపోతుంది. గతంలో కేవలం తిరునాళ్లకు మాత్రం వచ్చే భక్తులు, ఇప్పుడు ఆదివారాలు గురువారాల్లో కూడా ఆలయ సందర్శనకు వస్తుండడంతో, ఆలయ కమిటీ అక్కడ సౌకర్యాల కల్పనకు నడుం బిగించింది.

శ్రీ వేణుతల కాటంరాజు గంగాభవాని దేవస్థానం వద్ద భక్తుల సౌకర్యార్థం చేపట్టవలసినటువంటి కార్యక్రమాలను ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మ గంగరాజు యాదవ్ ప్రధాన కార్యదర్శి బుర్రి చిన్న వెంకటేశ్వర్లు యాదవ్ ఆదివారం పరిశీలించారు. 
  త్వరలో ఆలయం పరిసర ప్రాంతాల్లో సుమారు 18 లక్షల రూపాయల వ్యయంతో ఓవర్ హెడ్ ట్యాంక్ విత్ పవర్ బోరు ఏర్పాటు చేయిస్తానని ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాజీ లిడ్ క్యాప్ చైర్మన్ ఎరిక్సన్ బాబు హామీ ఇవ్వడంతో అందుకు సంబంధించిన స్థలాన్ని కూడా కమిటీ పర్యవేక్షించడం అయినది.
ప్రతి గురు, ఆదివారాల్లో వస్తున్న వందలాది మంది భక్తులకు సరైన సౌకర్యాలను మెరుగుపరచడం కోసము మరియు వారి మొక్కులు తీర్చుకొనుటకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆలయం ముందు భాగం కాకుండా ఇంకొంచెం తూర్పు వైపునకు ఏర్పాటు చేయుటకు స్థలాన్ని కొలత వేయడం జరిగింది. 
   ఆలయం ముందు భాగము పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా ఈ మార్పులు చేయడమైనది..
   అదేవిధంగా ఇప్పటికే 25 లక్షల రూపాయలతో ప్రారంభించిన టువంటి భోజనాశాలను ఇంకా అభివృద్ధి చేయుటకు అనేకమంది యాత్రికులు ముందుకు వస్తున్న సందర్భంలో తదుపరి కమిటీ సమావేశంలో తీర్మానించి సంబంధిత కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. 
   ఇప్పటికే బోర్ల ద్వారా వస్తున్నటువంటి నీటిని భక్తులు వాడుకుంటున్నారని ఎవరైనా భక్తులు పెద్ద సంఖ్యలో సహకరిస్తే మినరల్ వాటర్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేయుటకు ఆలయ కమిటీ ఒక ప్రకటనను విడుదల చేసింది. 
    మంచినీటి వసతి లేక ,ఇబ్బందులు పడుతున్న భక్తుల దాహార్తిని తీర్చేందుకు సుమారు నాలుగు లక్షల రూపాయలు వ్యయంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయుటకు భక్తులు ఎవరైనా ఉంటే కమిటీ చైర్మన్ నెంబర్ 9966401 003 మరియు ఆలయ కమిటీ ముఖ్య బాధ్యులు పి ఎల్ పి యాదవ్ 9966595555 నంబర్లకు ఫోన్ చేసి వివరము తెలుసుకోవాల్సిందిగా మనవి చేయడమైనది. 
   ఆలయ పునర్నిర్మాణాన్ని కూడా సంబంధిత పండితులను,స్థపతులను  సంప్రదించి పునః నిర్మాణ కార్యక్రమాలను చేపట్టిన కూడా కమిటీలో ఏర్పాటు చేసినటువంటి అజెండా ద్వారా చర్చించి ముందుకు వెళ్తామని ఆలయ కమిటీ చైర్మన్ తెలియజేశారు. 
   ఇప్పటికే మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాద్ ,మార్కాపురం ఫారెస్ట్ డి ఎఫ్ ఓ మరియు అనేక శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి రెవిన్యూ డిపార్ట్మెంట్ ,ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి శ్రీ కాటంరాజు గంగాభవాని దేవస్థానం యొక్క స్థల పరిధులను నిర్ధారించవలసినదిగా కోరి ఉన్నాము. 
   ఆ స్థలానికి సరైన హద్దులు చూపించి హద్దురాళ్ళు వేసుకునే లాగున సర్వే జరిపించి సహకరిస్తామని మార్కాపురం సబ్ కలెక్టర్ హామీ ఇచ్చి ఉన్నారు. 
   ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా భక్తులు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో సర్వే జరపని కారణంగా అనేక ఇబ్బందులను కమిటీ ఎదుర్కొంటున్నది...
   ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ,మాజీ లిడ్ క్యాప్ చైర్మన్  ఎరిక్సన్ బాబు,  కాటంరాజు స్వామి మీద భక్తితో, సహకరించి సుమారు పది లక్షల రూపాయల వ్యయంతో 30 ఎలక్ట్రికల్ స్తంభాలు, వైర్లను  ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలను అలంకరించినటువంటి సందర్భంగా కమిటీ వాటన్నిటినీ పరిశీలించి అందుకు సహకరించిన ఎరీక్షన్ బాబుకు అభినందనలు తెలియజేశారు. 
   ఈరోజు ఆలయ సందర్శనకు వచ్చినటువంటి సుమారు 300 మంది భక్తులు ఆలయం చుట్టుపక్కల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడాన్ని ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. 
    కమిటీ భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి చేసే కార్యక్రమాల్లో తమ తమ గ్రామాల్లో నుంచి పూర్తి ఆర్ధిక  సహాయ సహకారాలు అందిస్తామని వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వారు తెలియజేయడమైనది.
   భవిష్యత్తులో యాదవ,యాదవేతర భక్తుల పూర్తి సహాయ సహకారాలతో నూతనంగా ఆలయాన్ని పెద్ద స్థాయిలో నిర్మించడానికి ఇప్పటికే తీర్మానం జరిగిందని సంబంధిత మేధావుల యొక్క సలహా సంప్రదింపుల అనంతరం పూర్తిస్థాయిలో ఆలయ పునర్నిర్మాణం గురించి ప్రకటన జారీ చేస్తామని కమిటీ చైర్మన్ గుమ్మా గంగరాజు యాదవ్ ఆలయ కమిటీ ముఖ్య బాధ్యులు పిఎల్ పి యాదవ్ తెలియజేశారు. 
    ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బుర్రి చిన్న వెంకటేశ్వర్లు యాదవ్ రియల్, సుంకేసుల పాముల పోల్రాజు, పెద్దిరాజు యాదవ్, రాగాల ఈశ్వర్ యాదవ్, పాలంకయ్య యాదవ్ లతోపాటు పలువురు యాదవ సోదరులు పాల్గొన్నారు.IMG-20250629-WA0046

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News