పేద ప్రజలకు వరం జగనన్న ఆరోగ్య సురక్ష

వైయస్సార్ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ

On
పేద ప్రజలకు వరం జగనన్న ఆరోగ్య సురక్ష

మార్కాపురం : కోట్ల రూపాయల వ్యయం తో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమం పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని వైయస్సార్ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ అన్నారు. పట్టణంలోని శ్రీ సాధన జూనియర్ కళాశాల నందు ఒకటి, నాలుగో వార్డు ప్రజలకు సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాహుల్, మున్సిపల్ కమిషనర్ గిరి కుమార్ పర్యవేక్షణలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైయస్సార్ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రావణి చారిటబుల్ ట్రస్ట్ అధినేత్రి డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ హాజరై పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు వైద్యం అందించేందుకు గైనకాలజిస్ట్ డాక్టర్ సింధుజ, వైద్యాధికారులు డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి, డాక్టర్ ఉదయ్ చంద్ర, డాక్టర్ శ్రావన్ తేజ లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజల పాలిట ఒక వరమని, జగనన్న పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష వలన సుదూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకోలేని ప్రజలు  సులభంగా, ఉచితంగా వైద్యాన్ని అందుకొని ఆరోగ్యవంతులుగా ఉండడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్షలో వైద్యం అందుకున్న ప్రజలు వైద్యులు అందించిన సూచనలను పాటిస్తూ మంచి ఆహారాన్ని తీసుకుంటూ ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు వహిస్తూ ఆరోగ్యకరంగా ఉండాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ ప్రాంతంలోని మార్కాపురానికి కిడ్నీ డయాలసిస్ సెంటర్, మెడికల్ కాలేజీ అందించడం శుభసూచకమని, మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు కౌన్సిలర్ మారంరెడ్డి పుష్పలత, సచివాలయ, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు వాలంటీర్లు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

IMG-20231018-WA0034

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News