నిధుల వేటగాళ్ళు ఎక్కడ?

On
నిధుల వేటగాళ్ళు ఎక్కడ?

వాహనాలు పట్టుకున్నారు.. ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు... 
విచారణ నిర్వహిస్తున్నామంటూ కాలయాపన చేపడుతున్నారు.... స్థానికులు ఉన్నారని ఆరోపణలు..... 
మసిపూసి మారేడు కాయ చేస్తున్నారా.... 



యర్రగొండపాలెం: నల్లమల  ప్రాంతంలో  గత వారం రోజుల క్రితం గుప్త నిధుల వేటగాళ్ల కలకలం అందరికీ తెలిసిందే. యదేచ్ఛగా  దర్జాగా  ఒక ప్రోక్లైన్ రెండు వాహనాలలో సుమారు 20 మంది నల్లమల అడవి ప్రాంతంలోని ప్రవేశించి గుప్త నిధుల తవ్వకాలు చేపట్టి ఉన్నారు. మూడు రోజుల నుండి ఈ కార్యక్రమం జరుగుతున్న స్థానిక అటవీ అధికారులు మాత్రం ఆ వైపు కన్నెత్తి చూడలేదు. స్థానికంగా ఉన్న కొందరు గిరిజనులు వివరాలు తెలియజేస్తే మొక్కుబడిగా దాడి నిర్వహించి ప్రోక్లైను మరియు జీపును స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. రోజులు గడుస్తున్న విచారణ మాత్రం మందకొడిగా సాగుతుందని ఇందులో అటవీ అధికారులతో పాటు  స్థానికంగా ఉన్న కొందరు నాయకుల హస్తం కూడా ఉందంటూ ప్రచారం మండలంలో వినపడుతుంది. ఇందులో అటవీ అధికారులు ప్రమేయం సైతం ఉందని లేనిపక్షంలో చెక్పోస్ట్ ను దాటి అటవీ ప్రాంతంలోనికి వాహనాలు ఎలా వెళ్లాయి అనేది మొదటి ప్రశ్న. అటవీ చట్ట ప్రకారం చివరకు ఆకు దొరికిన వారిపై కేసులు నమోదు చేయవచ్చు. కానీ నల్లమల అడవి ప్రాంతంలోనికి ప్రవేశించాలంటే చెక్ పోస్ట్ వద్ద నిత్యం పెద్ద సంఖ్యలో సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు . మూడు రోజుల క్రితం వాహనాలను ప్రాంతంలోనికి వదిలిన అటవీ అధికారులు  ఎందుకు వదిలారు ఎవరి ఆదేశాల మేరకు వదిలిపెట్టారు అనే విషయం తేలాల్సినది రెండవ విషయం. అలాగే వాహనాలు అటువైపు ప్రాంతంలోనికి వెళ్లాలంటే ఏ కారణంతో వెళ్తున్నాయి. ముఖ్యంగా ప్రోక్లైన్లు ఎందుకు వెళ్తున్నాయి? అనే విషయం ఆరా తీయవలసిన అటవీశాఖ ఉద్యోగులు వాటి విషయాన్ని మరుగున పెడుతున్నారు. గత కొద్దిరోజుల క్రితం పాలంక దద్ధనాలకు సైతం వెళ్లే భక్తులను  అడ్డంకులు పెట్టిన అటవీ శాఖ ఉద్యోగులు, ఎవరి ఆదేశాలు ఎవరి ఆమోదం మేరకు వీటి విషయాలను గోప్యంగా ఉంచారు, ఇవి తేలవలసి ఉంది. ముఖ్యంగా గుప్త నిధుల కోసం తవ్విన ప్రదేశంలో బాంబులను సైతం వినియోగించారని ఆరోపణలు వినపడుతున్నాయి. ఇతరులు ఫిర్యాదు చేయడం వల్లనే వారిని పట్టుకున్నామని, ఆ సమయంలో మూడు వాహనాలు ఉండగా  వాటిలో రెండు వాహనాలు మాత్రమే అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకొని ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మిగిలిన వాహనం ఎక్కడ? ఇంతటి భారీ స్థాయిలో గుప్తనిధుల వేటగాళ్లు ధైర్యంగా, దర్జాగా అటవీ ప్రాంతం లోనికి వెళ్లడానికి పై స్థాయిలో ఎవరి ఆదేశాలు జారీ చేసినారు? తేలవలసి ఉంది. ఇప్పటికైనా ఈ డివిజన్ స్థాయి అటవీశాఖ అధికారులు  వీటి విషయమై విచారణ నిర్వహించాలి. కేవలం ఇద్దరు, ముగ్గురు మాత్రమే పట్టుబడ్డారని తెలియజేస్తున్న అసలు విషయం ఏమిటంటే స్థానికంగా ఉన్న కొందరిని తప్పించడానికి ఈ విచారణను మొక్కుబడిగా చేపడుతున్నారని మండల ప్రజానీకం అంటున్నారు. న్యాయబద్ధంగా విచారణ నిర్వహించాలని విచారణ నిర్వహించడానికి వారాలు తరబడి విచారణ ఎవరైనా నిర్వహిస్తారా అని అపవాదును అటవీశాఖ అధికారులు తెచ్చుకొనకుండా విచారణ వేగవంతం చేసి నిందితులపై అటవీ హక్కుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

ఉపాధి సిబ్బందిపై శీతకన్ను – ఉద్యోగుల గోడు ఎవరికి పట్టదు? ఉపాధి సిబ్బందిపై శీతకన్ను – ఉద్యోగుల గోడు ఎవరికి పట్టదు?
తాడేపల్లి/అమరావతి: ఉపాధి హామీ పథకం కింద సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న వేలాది మంది సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “మేము రాత్రింబగళ్లు కష్టపడి పని చేస్తే...
నేటి పంచాంగం:   *గురువారం, ఆగష్టు 28, 2025*
హసనాపురం గ్రామంలో చిరుత పులి పిల్ల
వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్
నిధుల వేటగాళ్ళు ఎక్కడ?
నవోదయ స్కూల్ లో మట్టి వినాయకునికి  ఘనంగా పూజలు
నేటి పంచాంగం:  *బుధవారం, ఆగష్టు 27, 2025*