పేదల జీవితాలు మెరుగుపడేలా జగనన్న పాలన
జగనన్న ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి ఆరేళ్ళు పూర్తి
గిద్దలూరు: బడుగు, బలహీన వర్గాలు, పేదల జీవితాలు మెరుగుపడేలా ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, వైస్ చైర్మన్ ఆర్.డి. రామకృష్ణ అన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి ఆరేళ్ళు పూర్తి అయిన సందర్బంగా గిద్దలూరు శాసన సభ్యులు అన్నా రాంబాబు ఆదేశాల మేరకు సోమవారం గిద్దలూరు పట్టణంలోని వైఎస్సార్ సెంటర్ లో దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పలువురు వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాచర్ల రోడ్డులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా చైర్మన్, వైస్ చైర్మన్, పలువురు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పేదల జీవితాలు మెరుగుపడేలా విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టడానికి తోడ్పడినటువంటి పాదయాత్రను ముఖ్య మంత్రి జగనన్న ప్రారంభించి 6 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ప్రజా సంకల్పయాత్రలో అన్ని వర్గాలను పలకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక ‘నవరత్నాలతో’ పేద, మద్య తరగతి వర్గాలకు అండగా నిలిచారు. పేదల కన్నీళ్లు తుడిచి సీఎం జగన్ వారి గుండెల్లో నిలిచారు. నాటి పాదయాత్రలో ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకున్న వైసీపీ ప్రభుత్వం లో వాటిని అమలు చేసి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. జగనన్న పరిపాలనలో అన్ని వర్గాలు, కులాలు, ప్రతి ఒక్కరికి మంచి జరిగిందన్నారు. నవరత్నాలు పథకాలు కాకుండా పాదయాత్ర లో ప్రజల నుండి తెలుసుకున్న కష్టాలను తెలుసుకొని వాటిని పరిష్కరించారన్నారు. చేసిన మంచి పనులను ప్రజలకు వివరించే విధంగా సామాజిక సాధికార యాత్రలో భాగంగా పలువురు నాయకులు రాష్ట్ర మొత్తం పర్యటిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్య మంత్రి గా జగనన్న, ఎమ్మెల్యేగా అన్నా రాంబాబు గెలుపు తద్యమని పలువురు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వైసీపీ ప్రభుత్వం కు అండగా ఉండాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమం లో గిద్దలూరు నగర పంచాయతీ కౌన్సిలర్లు, కో - ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ లు, గిద్దలూరు పట్టణ, మండలం కన్వీనర్ లు, జెసియస్ ఇంచార్జ్ లు, పలువురు వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారదులు, పాల్గొన్నారు.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.