రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా షంషీర్ అలీభేగ్
మర్యాదపూర్వకంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తో కలయిక
అమరావతి: ఏపీ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మార్కాపురం ఎయంసీ చైర్మన్ డాక్టర్ మీర్జా షంషిర్ అలీ భేగ్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.ఈయన పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో కీలక పాత్ర పాత్ర పోషిస్తూ వాేస్తున్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపుకు స్పందించి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే 2019 పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోను ముఖ్య భూమిక పోషించారు.ఈయన ప్రస్తుతం వైసిపి రాష్ట్ర సెక్రటరి గా, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ గా, మార్కాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.పార్టీకి అందించిన సేవలను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ షంషిర్ అలీ భేగ్ కు కార్పొరేషన్ లలో అత్యంత కీలకమైన రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టడం విశేషం.వెనుకబడిన పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం డివిజన్లో సామజిక, సేవా దృక్పథంతో డాక్టర్ షంషిర్ అలీభేగ్ విద్యా సంస్థలను స్థాపించడం జరిగింది . గత 22 సంవత్సరాల క్రితం బి. ఇడి కళాశాలను, అలాగే పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు 2009 లో ఏ వన్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలను కూడా డాక్టర్ షంషిర్ అలీభేగ్ స్థాపించడం జరిగింది.అలాగే డాక్టర్ మీర్జా షంషిర్ అలీభేగ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మినరల్ వాటర్ చలి వెంద్రాలు, మెడికల్ క్యాంపు లు నిర్వహించడం జరిగింది. పేద విద్యార్థులకు సాంకేతిక విద్యలో అనేక రాయిలు కల్పించి వారి విద్యారంగ ఉన్నతికి ఈయన తోడ్పాటును అందించారు.ఎపిపిఎస్ గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా మెటీరియల్ అందజేయడమే గాక శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇలా అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం ద్వారా డాక్టర్ మీర్జా షంషిర్ అలీభేగ్ ఈ ప్రాంత ప్రజల ఆధరాభిమానాల ను చురగొన్నారు.
ఎంపి వైవి సుబ్బారెడ్డి ని కలసిన డాక్టర్ షంషిర్ అలీ భేగ్
వైసిపి రాష్ట్ర అగ్ర నాయకులు, పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బా రెడ్డిని, ఆయన నివాసంలో ఏపీ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మీర్జా షంషీర్ అలీ భేగ్ మర్యాదా పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి కి, షంషిర్ అలీభేగ్ శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసిపి అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని వారిని కోరారు.
తనకు ఎంతో కీలకమైన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలను అప్పజెప్పడం చాల ఆనందంగా ఉందని, పార్టీ అభ్యర్థుల విజయం కోసం శాయ శక్తుల కృషి చేస్తానని షంషీర్ అలీభేగ్ అన్నారు.
ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డికి మున్సిపల్ చైర్మన్ సీహెచ్. బాలమురళీకృష్ణ, రాష్ట్ర ఎమ్ ఎస్ ఎం ఈ కార్పోరేషన్ డైరెక్టర్ మేడా వెంకట బద్రీనాథ్, బిసి బ్రిలియంట్ కమ్యూనిటీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి ఎల్ పి యాదవ్ లు శాలువ కప్పి, బొకే అందజేసి ఘనంగా సన్మానించారు.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.