Category
Local
Local 

గుండెపోటుతో వాహనంపై నుండి పడి మృతి

గుండెపోటుతో వాహనంపై నుండి పడి మృతి ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం అయినముక్కల సమీపంలోని కర్నూలు గుంటూరు రహదారిలో మంగళవారం గుండెపోటుతో నాగమ్మ వెళ్తున్నా ద్విచక్ర వాహనంపై నుండి పడి మృతి చెందింది. పొలం పనికి వెళ్లిన తన భర్తకు భోజనం ఇచ్చేందుకు వేరొక యువకుడి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో నాగమ్మ గుండెపోటుకు గురైంది. వాహనం పై నుండి కింద పడటంతో ఆమెను వెంటనే పెద్ద దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లుగా నిర్ధారించారు.
Read More...
Local  State 

హైవేపై కారు దగ్ధం: మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది

హైవేపై కారు దగ్ధం: మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది ఒంగోలు : హైవేపై కారు దగ్ధమవడంతో పెను ప్రమాదం నుంచి ముగ్గురు తప్పించుకున్నారు.స్థానిక టోల్గేట్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం నెల్లూరు నుంచి ఒంగోలు వస్తున్న రెనాల్ట్ డస్టర్ ఏపి31బిజడ్1116 కారు  ఇంజన్ లో ఒక్కసారిగా మంటలు రావడంతో కారు దగ్ధమైంది. ఇంజన్లో మంటలు గమనించిన కారు యజమాని నరసింహారావు వెంటనే భార్య కుమారుడు కారు దిగి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న టంగుటూరి ఎస్ఐ నాగమల్లేశ్వరరావు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చి హైవేపై భారీ ప్రమాదం జరగకుండా నియంత్రణ చేపట్టారు. ఈ సంఘటనలో పలువురు పోలీసు, అగ్ని మాపక సిబ్బంది పాల్గొన్నారు.
Read More...
Local 

రోడ్ ప్రమాదం లో ఒకరు స్పాట్ డెడ్.. ఇరువురు సీరియస్ 

రోడ్ ప్రమాదం లో ఒకరు స్పాట్ డెడ్.. ఇరువురు సీరియస్  ప్రకాశం జిల్లా: మార్కాపురం మండలం కోమటి కుంట వద్ద జాతీయ రహదారిపై  రోడ్డు ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బైక్  ను కారు వేగంగా ఢీ కొట్టడంతో బైక్ పై వెళ్తున్న ముగ్గురిలో  ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు కాగా వారిని మార్కాపురం ఆస్పత్రికి తరలించగా,తీవ్ర గాయాలైన ఇద్దరు యువకుల పరిస్థితి విషమంగా ఉండటంతో  ఒంగోలు రిమ్స్ కు తరలించారు. మార్కాపురం సిఐ సుబ్బారావు, గ్రామీణ ఎస్ఐ అంకమ్మరావు లు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించిన,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More...
Local 

రేపు తెల్లవారు జామున 33 వార్డు కు సాగర్ నీరు 

రేపు తెల్లవారు జామున 33 వార్డు కు సాగర్ నీరు  మార్కాపురం : సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు జవహనగర్ కాలనీ, సంజీవ రెడ్డి నగర్ కి సాగర్ వాటర్ వస్తాయనీ 33 వార్డు కౌన్సిలర్ నాలి కొండయ్య యాదవ్ తెలిపారు. 4.30కి తెల్లవారు జామున కందుల నారాయణరెడ్డి,  చెక్క పెట్టల బజార్ కు సాగర్ వాటర్ వస్తాయనీ, అలాగే ఉదయం 7.00 నాలి కొండయ్య బజారు, డిష్ అంజి బజార్, విజయ స్కూల్ ఎదురు బజారు, కందుల రామి రెడ్డి అన్న ఎదురు బజార్, కౌన్సిలర్ ఏరువా వెంకటనారాయణ రెడ్డి బజారు,  కిరోసిన్ బజార్, ఏరువ నాగిరెడ్డి బజారు, కందుల నారాయణరెడ్డి అన్న ఎదురు బజార్లు అన్ని లైన్లలో  సాగర్ నీరు వస్తుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Read More...
Local  State 

*RIECEE (NCERT) - 2025 కామన్ ఎంట్రన్స్ టెస్ట్  రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన దోర్నాల మండలం విద్యార్థిని కర్రా అంజన షణ్ముఖ ప్రియ.*

*RIECEE (NCERT) - 2025 కామన్ ఎంట్రన్స్ టెస్ట్  రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన దోర్నాల మండలం విద్యార్థిని కర్రా అంజన షణ్ముఖ ప్రియ.* Prakasam : July 2025 న ఇంటర్మీడియట్ అర్హతతో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, పీజీ ప్రవేశాల కోసం  దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్సీఈఆర్టీ వారు నిర్వహించే RIECEE కామన్ ఎంట్రన్స్ టెస్ట్  పరీక్ష ఫలితాలలో ప్రకాశం జిల్లా, దోర్నాల మండలం, రామచంద్ర కోట గ్రామం కి  చెందిన *కర్రా అంజన షణ్ముఖ ప్రియ* ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఫిజిక్స్, ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ మూడు విభాగాలలో కూడా స్టేట్ 1st ర్యాంకు మరియు ఇంటిగ్రేటెడ్ బీఈడీ ఫిజికల్ సైన్స్ state 2 వ ర్యాంక్, all india 24 వ rank,   మరియు ఇంటిగ్రేటెడ్ బిఈడి జనరల్ విభాగాలలో state 2 వ ర్యాంక్, all ఇండియా 25 rank   కైవసం చేసుకున్నారు. తమ విద్యార్థి ఐదు విభాగాలలో ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల  వసంతా జూనియర్ కళాశాల  యాజ మాన్యం, విద్యార్థి తల్లిదండ్రులు కర్రా వెంకట సుబ్బారెడ్డి  (గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లెక్చరర్), కర్రా మంగమ్మ (పిజిటి తెలుగు టీచర్) మరియు బంధుమిత్రులు   హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థి ఎటువంటి కోచింగ్ లేకుండానే  స్థానికంగానే   చదువుకుంటూ కళాశాల అధ్యాపకులు మరియు తమ తల్లిదండ్రుల మార్గ నిర్దేశాలతో  ఒకేసారి ఐదు విభాగాలలో  సీట్ సాధించగలిగలగడం గమనార్హం.
Read More...
Local  State 

హసనాపురం గ్రామంలో చిరుత పులి పిల్ల

హసనాపురం గ్రామంలో చిరుత పులి పిల్ల ప్రకాశం జిల్లా: కొమరోలు మండలం హసనాపురం గ్రామ సమీపంలోని అమరావతి, అనంతపురం జాతీయ రహదారిపై  చిరుత పులి పిల్లను గ్రామస్తులు పట్టుకున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు , పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చిరుత పులి పిల్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చిరుత పులి పిల్ల ఒంటిపై గాయాలు ఉండడంతో పులి పిల్లను చికిత్స కోసం  తరలించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
Read More...
Local 

వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్

వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ ఒంగోలు: విఘ్నేశ్వరుడు ప్రతి ఒక్కరికి క్షేమం, ధైర్యం, ఆయురారోగ్యం, సంపదలు ప్రసాదించాలని  జిల్లా ఎస్పీ దామోదర్ ఆకాంక్షించారు.వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ప్రాంగణంలో  ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం నందు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, వినాయక చవితి అనేది కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా జరుపుకునే పండుగ అని తెలిపారు. విఘ్నేశ్వరుడు ప్రతి ఒక్కరికీ క్షేమం, ధైర్యం, ఆయురారోగ్యాలు, సకల సంపదలు ప్రసాదించాలని, చేపట్టిన పనుల్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా సజావుగా జరగాలన్నారు. ప్రజలందరూ భక్తిభావం, సామరస్యం, ఐకమత్యం, ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగను, గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. పండుగ రోజు నుంచి నిమజ్జనం వరకు జరిగే పూజలు, వేడుకలు, ఊరేగింపుల సందర్భాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వినాయక మండప నిర్వాహకులు పోలీసు శాఖ ఇచ్చే సలహాలు, సూచనలు పాటించి, గణేష్ ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించారు. అలాగే ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు తలెత్తినట్లయితే వెంటనే సంబంధిత స్థానిక పోలీసు అధికారులకు లేదా డయల్ 112/100 నంబర్లకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ కె.శ్రీనివాసరావు, ఎస్ బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాండురంగారావు,ఆర్ఐలు రమణ రెడ్డి,సీతారామరెడ్డి, ఆర్ఎస్సైలు ప్రసాద్, రవి, పాపిరెడ్డి, తిరుపతి స్వామి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Read More...
Local  State 

నిధుల వేటగాళ్ళు ఎక్కడ?

నిధుల వేటగాళ్ళు ఎక్కడ? వాహనాలు పట్టుకున్నారు.. ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు... విచారణ నిర్వహిస్తున్నామంటూ కాలయాపన చేపడుతున్నారు.... స్థానికులు ఉన్నారని ఆరోపణలు..... మసిపూసి మారేడు కాయ చేస్తున్నారా.... 
Read More...
Local 

నవోదయ స్కూల్ లో మట్టి వినాయకునికి  ఘనంగా పూజలు

నవోదయ స్కూల్ లో మట్టి వినాయకునికి  ఘనంగా పూజలు మార్కాపురం: ఒంగోలు రోడ్డులోని కలుజువ్వలపాడు వద్ద గల జవహర్ నవోదయ స్కూల్లో వినాయక చవితి పండుగ సందర్భంగా విద్యార్థులు స్వయంగా తయారుచేసిన మట్టి గణపతి ప్రతిమలను ఏర్పాటుచేసి బుధవారం  ప్రిన్సిపల్, విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి వినాయకుడికి ఘనంగా పూజలు నిర్వహించారు.  పాఠశాల విద్యార్థులు ఒక్కో తరగతి విద్యార్థులకు గణపతి ప్రతిమను స్వయంగా తయారు చేసి మండపంలో ఉంచి పూజారుల తో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ప్రిన్సిపల్ బ్రహ్మానంద రెడ్డి తో పాటు ఉపాధ్యాయులు, సిబ్బంది భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ చరిత్ర,  ప్రాముఖ్యత ను విద్యార్థులకు వివరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.  విద్యార్థులు జై బోలో గణేష్ మహారాజ్, గణపతి పప్పా మోరియా అంటూ గణేశుని పై తమ భక్తిని చాటుకున్నారు.  విద్యార్థులు భక్తి పాటలకు కోలాటం నృత్యాలు చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బ్రహ్మానంద రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Read More...
Local 

కంభం గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కంభం గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ప్రకాశం జిల్లా: కంభం లోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సృజన ఆత్మ హత్యాయత్నం చేసుకుంది పాఠశాల బాత్రూం లోనికి వెళ్లి లైజల్ తాగింది ఇవాళ ఉదయం స్టడీ అవర్లో ప్రాజెక్ట్ వర్క్ విషయంలో టీచర్ అందరి ముందు కొట్టడం వల్ల మనస్థాపం చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలికను కంభం ప్రభుత్వా వైద్యశాలకు తరలించి ప్రధమ చికిత్స అనంతరం మార్కాపురం  తరలించినట్లు సమాచారం.
Read More...
Local 

మార్కాపురం లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కనిపించరే?

మార్కాపురం లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కనిపించరే? మార్కాపురం: మార్కాపురం కేంద్రంగా ప్రజా పంపిణీ వ్యవస్థను పర్యవేక్షించాల్సిన ఎన్ఫోర్స్మెంటు డిటి అడ్రస్ ఎక్కడ అంటూ మార్కాపురం మండల ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని నెలలుగా మార్కాపురం ఎన్ఫోర్స్మెంట్ డీటీ లేకపోవడంతో రేషన్ షాపుల తనిఖీలు చేసే వ్యవస్థ పూర్తిగా అటకెక్కింది. దీంతో మమ్మల్ని ఎవడ్రా ఆపేది అంటూ రేషన్ డీలర్లు ఇస్టారీతిగా వ్యవహరిస్తున్న వైనం తేటతెల్లమవుతుంది. అసలే బియ్యం మాఫియాకు జీ హుజూర్ అంటున్న రేషన్ డీలర్లు కొద్దిపాటి మందికైనా బియ్యం విక్రయిస్తారంటే ఏమాత్రం ఆ పని చేయడం లేదు. అంతేకాదు రేషన్ బియ్యం గోడౌన్ నుండి సరాసరి తమ గ్రామానికి తీసుకురావాల్సిన డీలర్లు వాటిని అక్కడి నుంచి అక్కడే మాఫియాకు అప్పచెప్తున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక వచ్చిన కొద్దిపాటి బియ్యాన్ని వినియోగదారులకు సక్రమంగా ఇవ్వకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న వైనం కనిపిస్తుంది. మార్కాపురం మండలంలోని పలు గ్రామాల్లో డీలర్లు అధికార పార్టీ అండదండలతో చెలరేగిపోతున్నట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కులం పేరు,ఇంటి పేరు, వంటి పేరు చెప్పుకుంటూ పలువురు డీలర్లు అవినీతి అడ్డాకు కేంద్ర బిందువులుగా మారారని బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత వైసిపి ప్రభుత్వం లో అధ్వాన్నంగా ఉన్న ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ కూటమి ప్రభుత్వం లోనైనా బాగుపడుతుందని అనుకుంటే అంతకన్నా అధ్వాన్నంగా తయారైంది అనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు తగలబెట్టి సబ్సిడీ బియ్యాన్ని పేదల కడుపు నింపేందుకు పంపిణీ చేస్తుంటే, ఇలాంటి మాఫియా ముఠాలు, గుంట నక్కల డీలర్లు ఇష్టారీతిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ పేదోడి కడుపు కొడుతున్న వైనం ఇది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన అధికారులు, ముఖ్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన అధికారులు డీలర్ల పై రేషన్ దుకాణాలపై నిఘా పెట్టి సామాన్య ప్రజానీకానికి అండగా నిలవాలని జనం వేడుకుంటున్నారు.
Read More...
Local 

పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్

పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్ ప్రకాశం జిల్లా: కంభం పట్టణంలోని ఓ లాడ్జిలో శుక్రవారం పేకాట ఆడుతున్న ఆరుగురిని స్థానిక ఎస్సై నరసింహారావు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.68,200 వేల నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్సై వెల్లడించారు. పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసు నమోదు చేశామని పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని SI నరసింహారావు మండల ప్రజలను హెచ్చరించారు.
Read More...