Category
State
State 

పద్మశ్రీ పురస్కారం అందుకున్న బ్రహ్మశ్రీ డా. మాడుగుల

పద్మశ్రీ పురస్కారం అందుకున్న బ్రహ్మశ్రీ డా. మాడుగుల బృహత్ ద్వి సహస్రావధాని, మహాకవి, బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ ,52 సంవత్సరాలకు పైగా అవధానం మరియు తెలుగు, సంస్కృత సాహిత్య రంగాలకు చేసిన సేవలను గౌరవిస్తూ భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారమును అందుకున్నారు. గౌరవ భారత ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ, భారత హోం మంత్రి  అమిత్ షా సమక్షంలో గౌరవనీయ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాడుగుల కు శుభాకాంక్షలు తెలిపారు.
Read More...
State 

ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ పై మంత్రివర్గ ఉపసంఘం

ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ పై మంత్రివర్గ ఉపసంఘం అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అవుట్‌ సోర్సింగ్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌(ఆప్కో్‌స)పై ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించుకునే ప్రస్తుత వ్యవస్థపై సమీక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపసంఘంలో మున్సిపల్‌ మంత్రి నారాయణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ఉన్నారు. ప్రస్తుత వ్యవస్థ కంటే మరింత జవాబుదారీగా, సమర్థవంతంగా, పారదర్శకంగా అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నియామకాలు, వారి సంక్షేమాన్ని ఎలా పెంపొందించాలన్న దానిపై నివేదిక ఇవ్వనుంది.
Read More...
State 

సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ.2.46 కోట్లు పోగొట్టుకున్న నెల్లూరు మహిళ

సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ.2.46 కోట్లు పోగొట్టుకున్న నెల్లూరు మహిళ * తక్కువ పెట్టుబడి-అధిక లాభం' ఆశ చూపి నెల్లూరు మహిళకు వల * అంతర్రాష్ట్ర ముఠాలోని ఏడుగురు సైబర్ నేరగాళ్ల అరెస్ట్ * రాజస్థాన్, హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు* పోలీసుల అదుపులో నిందితులు, కొనసాగుతున్న విచారణ  
Read More...
State 

సమయం ఆసన్నమైంది: RSS చీఫ్ మోహన్ జి భగవత్

సమయం ఆసన్నమైంది: RSS చీఫ్ మోహన్ జి భగవత్ నాగపూర్ (మహారాష్ట్ర): జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్ పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిపై RSS చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. 'భారతదేశం శక్తివంతమైనదని చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. మా హృదయాల్లో బాధ, కోపం ఉంది. చెడును నాశనం చేయడానికి బలాన్ని చూపించాలి. ద్వేషం, శత్రుత్వం మన స్వభావంలో లేవు. కానీ హాని చేస్తున్న వారిని క్షమించలేము' అని భగవత్ పేర్కొన్నారు.
Read More...
State 

హైదరాబాద్ లో 200 కు పైగా పాకిస్తానీయులు

హైదరాబాద్ లో 200 కు పైగా పాకిస్తానీయులు న్యూ ఢిల్లీ: కేంద్ర  హోం మంత్రి అమిత్ షా అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆఫీస్‌ కు అమిత్ షా ఫోన్ చేసి హైదరాబాద్‌ లో పాకిస్తానీయుల పై ఆరా తీశారు.పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులను భారత్ విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ దేశస్తులను గుర్తించి వెనక్కి పంపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించి భారత్ మీదకు ఉసిగొల్పుతుందని ఆ దేశంలో దౌత్య సంబంధాలు రద్దు చేసింది. ఇండియాలో పాకిస్తాన్ హైకమిషన్ ఆఫీస్ కూడా ఖాళీ చేసి వెళ్లాలని విదేశాంగ శాఖ ఆదేశాలు పంపింది.
Read More...
State 

ఎన్ కౌంటర్ ఆపండి.. చర్చలకు సిద్ధం: మావోయిస్టులు

ఎన్ కౌంటర్ ఆపండి.. చర్చలకు సిద్ధం: మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో లో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు అగ్రనేతలు సహా పలువురు మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలు మావోయిస్టుల నిర్మూలనకు ప్రయత్నిస్తూ, అప్రమత్తంగా ఉన్నాయి. దీంతో మావోయిస్టుల అగ్రనేత పోలీసులకు వర్తమానం పంపారు.సెంట్రల్ బలగాలు, ఛతీస్గఢ్ పోలీసులు సేవ్ కర్రెగుట్టలు జాయింట్ ఆపరేషన్ను నిర్వహిస్తున్నాయి. మూడు రోజులుగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుంది.ఆ నక్సల్ యాంటీ ఆపరేషన్ వెంటనే ఆపివేయాలని మావోయిస్ట్ పార్టీ నాయకుడు లేఖ రాశాడు. ఆపరేషన్ నిలిపి.. శాంతి చర్చలకు రావాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నార్త్ వెస్ట్ బస్టర్ బ్యూరో ఆఫ్ మావోయిస్టు ఇంచార్జ్ రూపేష్ అలియాస్ తక్కిళ్ళపల్లి వాసుదేవన్ పేరిట మావోయిస్టు పార్టీ లేఖ విడుదలైంది. చర్చల కోసం ముందుకు రావాలంటూ లేఖ సారాంశం. సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలంటూ లేఖలో డిమాండ్చేశారు. శాంతి చర్చలకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఎప్పుడూ సిద్ధమేనని రూపేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్దేశ్యం వేరేలా కనిపిస్తోందని ఆయన అంటున్నారు. హింస ద్వారా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన అన్నారు. ఆపరేషన్ కగార్ను నెల రోజులు వాయిదా వేయాలన్నారు.చతీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా సరిహద్దుల్లో కర్రెగుట్టల అనే అటవి ప్రాంతం ఉంది. మావోయిస్టుల అగ్రనేతలు చాలామంది ఆ ప్రాంతంలో ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. బీజాపూర్, తెలంగాణ సరిహద్దులు జరుగుతున్న సైనిక ఆపరేషన్ వెంటనే ఆపాలని రూపేష్ లేఖలో పేర్కొన్నారు.
Read More...
State 

విజయవాడ లో 10 మంది ఉగ్రవాదులు?

విజయవాడ లో 10 మంది ఉగ్రవాదులు? AP: ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో పదిమంది ఉగ్రవాదులు.. ఉన్నట్లు పలు కథనాలు,వార్తలు వస్తున్నాయి. విజయవాడ మహానగరంలో ఉగ్ర కదలికలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. సిమి సానుభూతిపరుల గురించి రెండు నెలల కిందట కేంద్ర నిఘా వర్గాల నుంచి విజయవాడ పోలీసులకు సమాచారం అందినట్లు చెబుతున్నారు.దీంతో పదిమంది ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ పది మంది ఉగ్రవాదులు గొల్లపూడి, అశోక్ నగర్, లబ్బీపేట ప్రాంతాలలో వేరువేరు పనులు చేస్తున్నట్లు గుర్తించారని తెలుస్తోంది. గతంలో విజయవాడ మావోయిస్టులకు షెల్టర్ జోన్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉగ్రవాదులకు అడ్డగా మారినట్లు చెబుతున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. కాగా కాశ్మీర్ లో ఉగ్రదాడి అనంతరం దేశంలోని పలు ప్రాంతాల్లో పాకిస్థాన్ నుంచి వచ్చి ఉంటున్న వారిని వెతికి పట్టుకొనే పనిలో పోలీసులు దృష్టి సారించారు. ఈ నెల 27 లోపు దేశం వీడి పోవాలని,వీరి వీసా రద్దు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Read More...
State 

ఉగ్రవాద కుక్కలను కేంద్రం ఏరి పారేస్తుంది

ఉగ్రవాద కుక్కలను కేంద్రం ఏరి పారేస్తుంది హైదరాబాద్: జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదులు  పంజా విసిరారనీ పర్యాటకులపై జరిగిన కాల్పుల ఘటనలో 26మందికి పైగా దుర్మరణం పాలయ్యారని ఎంతోమంది అమాయక పర్యాటకులు గాయపడ్డారని, ఖబర్దార్ ఉగ్రవాదులరా అంటూ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఉగ్రవాదుల దుశ్చర్యతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. పహల్గాంలోని బైసరన్ వ్యాలీ ఎగువ ప్రాంతంలోని ఒక పర్యాటక రిసార్టు వద్ద ఈ దాడి జరిగిందనీ ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాల ద్వారా మాత్రమే చేరుకునే వీలుంటుందన్నారు. ఇలాంటి ప్రాంతంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సైనిక తరహా దుస్తుల్లో వచ్చిన దుండగులు ఈ దాడికి తెగించారని  పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని పక్కా ప్రణాళికతోనే ఈ దాడికి పాల్పడ్డారని శ్రీ వర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాద కుక్కలను ఏరివేస్తామని దీని వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఉందని ఆయన ఘాటుగా విమర్శించారు. భారత్ శాంతిని కాంక్షిస్తుంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులను ప్రేరేపించి శాంతికి భంగం వాటిల్లెల విచ్చర్ల పాల్పడుతుందని శ్రీవర్ధన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదులను పక్క ఎరివేస్తామని కేంద్రం చూస్తూ ఊరుకోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఉగ్రవాదులకు తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. యావత్ భారతావని ఈ దుశ్చర్యను రాజకీయాలకు అతీతంగా ఖండించాలని భారతమాత సేవలు అందరూ ఏకమై ముక్తకంఠంతో పాకిస్తాన్ దుశ్చర్యలను ఖండించాలని శ్రీ వర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు..
Read More...
State 

ఏపీలో కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్‌ పర్యటన

ఏపీలో కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్‌ పర్యటన విజయవాడ:  కేంద్ర విద్యుత్  పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీపాద యశో నాయక్‌ , మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మేఘనా దీపక్ సాకోర్ లు రాష్ట్ర పర్యటనలో బాగంగా సోమవారం విజయవాడ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా నోవాటెల్  హోటల్ కు చేరుకున్న వారికి బీజేపీ ప్రోటోకాల్ ఇంఛార్జి పీయూష్ దేశాయ్, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి లు కేంద్ర, మహారాష్ట్ర మంత్రులకు బొకే అందజేసి ఘన స్వాగతం పలికారు. తమ పర్యటనలో బాగంగా వారు ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారిని  దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో  వారధి పార్టీ ఇంఛార్జి కిలారు దిలీప్ తోపాటుగా డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అలాగే పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అమ్మవారి దర్శనం అనంతరం వారు నగరంలోని  భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని పార్టీ నేతలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి శ్రీపాద యశో నాయక్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు శరవేగంతో పరుగేడు తున్నాయని అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఏపీకి నిధులు వరదలా ప్రవహిస్తున్నాయని అన్నారు. ఆలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పార్టీ వేగవంతంగా పటిష్టం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కిలారు దిలీప్, బిజెపి ప్రోటోకాల్ ఇంఛార్జి పీయూష్, డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి, బిజెపి సోషల్ మీడియా రాష్ట్ర సభ్యులు సంజయ్, పోతిరెడ్డి వెంకట్ ,మహిళా మోర్చా నేతలు బొమ్మ దేవర రత్నకుమారి, విజయశాంతి , పాలడుగు సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.
Read More...
State 

సత్ర నిర్మాణం కోసం ఆర్ధిక సహాయాన్ని అందించిన మేడా బదరీనాథ్ 

సత్ర నిర్మాణం కోసం ఆర్ధిక సహాయాన్ని అందించిన మేడా బదరీనాథ్  మార్కాపురం: తమిళనాడు రాష్ట్రంలోని ప్రసిద్ధ శ్రీ రంగం రంగనాథ స్వామి ఆలయం ప్రాంగణంలో ఆర్యవైశ్య అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా  ఆర్యవైశ్య సత్రం ఏర్పాటు చేశారు. ఈ సత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆర్యవైశ్య అసోసియేషన్ రాష్ట్ర నాయకులు మేడా బద్రీనాథ్ దంపతులు పాల్గొన్నారు.సత్ర నిర్మాణానికి  ఆర్ధిక సహకారం అందించిన బద్రినాథ్ దంపతులను,  నిర్మాణ కమిటీ శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.
Read More...
State 

బాపట్లలో విచిత్రమైన ఘటన .. కారు ఉన్నా రోడ్డేశారు..!

బాపట్లలో విచిత్రమైన ఘటన .. కారు ఉన్నా రోడ్డేశారు..! బాపట్ల: ఇంటి ముందు పార్క్ చేసిన కారుని అలాగే ఉంచేసి కాంక్రీట్ రోడ్డు వేసేసిన కాంట్రాక్టర్.బాపట్ల జిల్లా దేశాయిపట్నం లో కొత్తగా సిమెంట్ రోడ్డు వేస్తున్న సందర్భంలో రోడ్డు పక్కనే కారు ఉంది.ఆ వాహనం తీయాలని ఎన్నిసార్లు చెప్పినా సరే తీయకుండా కారు తాళం వేసి వెళ్లిపోయాడని అధికారులు తెలిపారు. కారు తీయడానికి తాళం లేకపోవడంతో కారుని అలాగే ఉంచి సిమెంట్ రోడ్డు నిర్మాణం చేశామంటున్న  కాంట్రాక్టర్.
Read More...
State 

ఘనంగా  ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు జన్మదిన వేడుకలు

ఘనంగా  ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు జన్మదిన వేడుకలు పల్నాటి జిల్లా : నర్సరావుపేట  శాసన సభ్యులు డాక్టర్ అరవింద బాబు పుట్టిన రోజు వేడుకలు మంగళవారం రాత్రి  భువన చంద్ర టౌన్ హాల్ లో ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా పార్టీ పరిశీలకులు శాసనాల వీరబ్రహ్మం ఈ కార్యక్రమానికి హాజరై డాక్టర్ అరవింద బాబు కు శాలువ కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అలాగే టీడీపీ నాయకులు శాసనాల వీరబ్రహ్మం కు శాలువ కప్పి సన్మానించారు. టౌన్ హాల్ కమిటీ అధ్యక్షులు జవ్వాజి వెంకట రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గొనుగుంట్ల కోటేశ్వరరావు, ఏపి రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాల క్రిష్ణ,ఎన్ డి ఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
Read More...