Category
State
State 

హెల్త్ యూనివర్సిటీ వీసీ తో సమావేశమైన మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు 

హెల్త్ యూనివర్సిటీ వీసీ తో సమావేశమైన మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు  కర్నూలు: కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఛాంబర్ లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, వైస్ ఛాన్సలర్  డాక్టర్ చంద్రశేఖర్ తో కర్నూలు మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా  విసి డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కర్నూలు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు, ప్రస్తుత వైద్యులు,  విద్యార్థులు కలిసి కట్టుగా, సమన్వయంతో,  ఐకమత్యంతో,  కళాశాల అభివృద్ధికి ముందుకు వస్తే,  విసిగా తన వంతు  సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు నిర్మించ తలపెట్టిన నాలెడ్జ్ సెంటర్, మల్టీ యుటిలిటీ బిల్డింగ్ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా విసి డాక్టర్ చంద్రశేఖర్ తెలియజేశారు. ఇంత పెద్ద మనసుతో సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చిన గౌరవ విసి డాక్టర్ చంద్రశేఖర్ కి,  కర్నూలు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల తరఫున అప్నా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎవి సుబ్బారెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో కర్నూలు మెడికల్ కాలేజ్ ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ హరి చరణ్, కర్నూలు జనరల్ హాస్పటల్ సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు,వైస్ ప్రిన్సిపల్ లు డాక్టర్ సాయి సుధీర్,  డాక్టర్ రేణుక దేవి,  డాక్టర్ సింధియా శుభప్రద, ఏపీఎంఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవులు, కర్నూల్ అల్యూమిని వైద్యులు డాక్టర్ కుమార్ స్వామి రెడ్డి,  డాక్టర్ గోవింద రెడ్డి,  డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ విజయ శంకర్, డాక్టర్ బ్రహ్మాజి తదితరులు పాల్గొన్నారు.
Read More...
State 

ప్రొద్దుటూరు లో ఐఎంఎ సమావేశం 

ప్రొద్దుటూరు లో ఐఎంఎ సమావేశం  ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలో శనివారం ఐఎంఎ సమావేశం నిర్వహించారు‌. ఈ సమావేశంలో మదనపల్లె కు చెందిన ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారెడ్డి పాల్గొన్నారు.ఈ సమావేశంలో జిల్లా ఐఎంఏ పూర్వ అధ్యక్షులు డాక్టర్ త్యాగరాజ రెడ్డి,  డాక్టర్ సాయి ప్రసాద్, డాక్టర్ కిషోర్, ఐఎంఏ ప్రస్తుత అధ్యక్షులు డాక్టర్ నందకిషోర్, హానరరీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ బోస్, డాక్టర్ సేవా కుమార్, ఐఎంఏ ప్రొద్దుటూరు ట్రెజరర్ మరియు హెల్త్ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు డాక్టర్ వరుణ్, ఐఎంఏ ప్రొద్దుటూరు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు చర్చించారు.
Read More...
State 

ప్రాణాలు తీసిన ప్రేమ.. మహిళా కానిస్టేబుల్ మృతి*

ప్రాణాలు తీసిన ప్రేమ.. మహిళా కానిస్టేబుల్ మృతి* *ఆంధ్రప్రదేశ్ : వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ప్రశాంతి (25) ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.  చిత్తూరు జిల్లా మార్వాడకు చెందిన వాసుతో కొన్నాళ్ల కిందట ఆమెకు పరిచయం ఏర్పడగా..  అది కాస్త ప్రేమగా మారింది. అంతకుముందే వాసుకు వివాహం జరిగిన విషయాన్ని దాచాడు.  ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని ప్రశాంతి అడగగా.. వాసు ముఖం చాటేశాడు.  దాంతో ఆమె వాసు ఇంటికి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.
Read More...
State 

ACB కి చిక్కిన కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్

ACB కి చిక్కిన కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ అనంతపురం: కళ్యాణదుర్గం రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగేంద్ర నుంచి ఐదులక్షలు లంచం తీసుకుంటూ ACB అధికారులకు చిక్కిన సబ్ రిజిస్టర్ నారాయణ స్వామి.జిల్లా లోనే అత్యంత అవినీతి సబ్ రిజిస్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న నారాయణ స్వామి. సామాన్య ప్రజల నుంచి వ్యాపారస్తుల వరకు  అందరిని లంచాల కోసం పీడించిన డబ్బు పిశాచి నారాయణ స్వామి.ఇటువంటి లంచగొండి ACB అధికారులకు పట్టుపడటం తో హర్షం వ్యక్తం చేస్తున్న  కళ్యాణదుర్గం ప్రజలు.అసలే రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయి  వ్యాపారస్తులు స్థలాలు అమ్ముడు పోక చాలా ఇబ్బందులు పడుతున్నారు.
Read More...
Local  State 

డా. అమరా సురేష్ కుమార్ కి వాస్తు విద్వన్మణి పురస్కారం ప్రదానం

డా. అమరా సురేష్ కుమార్ కి వాస్తు విద్వన్మణి పురస్కారం ప్రదానం హైదరాబాద్:  వాస్తు శాస్త్రంలో విశేష సేవలందించిన ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ప్రకాశం జిల్లా మార్కాపురం వాస్తవ్యులు డా.అమరా సురేష్ గారి కి ప్రతిష్ఠాత్మకమైన "వాస్తు విద్వన్మణి" గౌరవ పురస్కారం లభించింది. శ్రీ మహేష్ చంద్ర భరద్వాజ్ గారి ఆధ్వర్యంలోని పరాశరస్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రో సైన్సెస్ (Parasharas’ Academy of Astro Sciences) ఆధ్వర్యంలో చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో జరిగిన జ్యోతిష వాస్తు సదస్సు లో ఈ సత్కారం ఘనంగా జరిపారు. జ్యోతిష వాస్తు శాస్త్రానికి, సనాతన ధర్మానికి, డా.అమరా గారు చేసిన అహర్నిశల సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ మహత్తర సత్కార సభ జ్యోతిష పండితులు , అధ్యాపకులు, మరియు శిష్యుల సమక్షంలో ఎంతో వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు విశ్రాంత ఆచార్య డా. శ్రీ సి.వి.బి. సుబ్రహ్మణ్యం గారు, బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారు, శ్రీ మహేష్ చంద్ర భరద్వాజ్ గారు, బ్రహ్మశ్రీ తి.న.చ.సంపత్కుమార కృష్ణమాచార్య గారు, బ్రహ్మశ్రీ విరివింటి ఫణి శశాంక శర్మ గారు డా. శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారలు పాల్గొని ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ గౌరవం జ్యోతిష శాస్త్రానికి, సనాతన ధర్మ సేవకు అంకితమైన జీవితానికి లభించిన గొప్ప గుర్తింపుగా ఆయన అభిమానులు పేర్కొన్నారు.
Read More...
State 

ఏపీలో జిల్లాలు, మండలాల పేర్లు మార్పులపై మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు

ఏపీలో జిల్లాలు, మండలాల పేర్లు మార్పులపై మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు అమరావతి: ఏపీలో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దుల పేర్లు మార్పులు చేర్పుల కోసం అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో సభ్యులుగా ఏడుగురు మంత్రులను నియమించింది. వీరిలో అనగాని సత్యప్రసాద్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. దీనికి కన్వీనర్గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల సరిహద్దుల మధ్య దూరాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, సరిహద్దులు నిర్ణయించే ముందు స్థానిక ప్రాంతం చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘానికి ప్రభుత్వం సూచించింది.
Read More...
Local  State 

శ్రీశైలం శాలివాహన అన్నదాన సత్రం అధ్యక్షులు గా శాతరాజుపల్లి మోహన్

శ్రీశైలం శాలివాహన అన్నదాన సత్రం అధ్యక్షులు గా శాతరాజుపల్లి మోహన్ శ్రీశైలం/మార్కాపురం: శ్రీశైలం లోని శాలివాహన అన్నదాన సత్రం నూతన కమిటీ అధ్యక్షులు గా మార్కాపురం పట్టణానికి చెందిన శాతరాజుపల్లి మోహన్ రావు ఎన్నికయ్యారు. ఆదివారం శ్రీశైలం లో నిర్వహించిన సమావేశంలో కమిటీ సభ్యులు మోహన్ రావు ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ ఎన్నికల ప్రక్రియ ఆంధ్ర ప్రదేశ్ శాలివాహన సంఘం అధ్యక్షులు ఐలాపురం వెంకయ్య సమక్షంలో జరిగినది. ఉభయ రాష్ట్రాలకు చెందిన శాలివాహన సత్రం కమిటీ సభ్యులు ఈ ఎన్నికల కార్యక్రమం లో పాల్గొన్నారు. శాతరాజుపల్లి మోహన్ రావు, అధ్యక్షులు గా ఎన్నిక కావడం పట్ల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ,సత్ర అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తానని అన్నారు.
Read More...
State 

కర్నూలులో శ్రీ చక్ర హాస్పిటల్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన అప్నా 

కర్నూలులో శ్రీ చక్ర హాస్పిటల్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన అప్నా  కర్నూలు: కర్నూలు లోని శ్రీచక్ర హాస్పిటల్ పై దాడిని అప్నా,ఐఎంఎ లు ఖండించాయి. కర్నూలు జిల్లా ఎస్పీ ని కలిసి హాస్పిటల్ పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అప్నాఅని  రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ లో ఆల్రెడీ పెట్టిన సెక్షన్లు సరిపోవని, ఆంధ్రప్రదేశ్ మెడికేర్ సర్వీస్ పర్సనేల్ అండ్ మెడికేర్ సర్వీస్ సిస్టమ్ యాక్ట్ 2008 ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక శాసనసభ్యులు గౌరు చరిత ని కలిసి సంఘటన వివరాలు తెలియజేసి డాక్టర్ల న్యాయమైన సమస్యకు ఆనుకూలంగా స్పందించాలని కోరడం జరిగింది. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి ఘటనకు సంబంధించిన వాస్తవాలు తెలియజేయడం జరిగింది.  ఎమర్జెన్సీ ఐఎంఏ, అప్నా సంయుక్త సమావేశం నిర్వహించడం జరిగింది. డాక్టర్లపై అనుచితంగా వ్యాఖ్యలు చేసిన ఒక ఛానల్ పై క్రిమినల్ కేసు ఫైల్ చేయాలని, పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు వైద్యులు డాక్టర్ వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Read More...
State 

శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట, దోమల పెంట పేర్లు మార్పు

శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట, దోమల పెంట పేర్లు మార్పు శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట, దోమల పెంట గ్రామాల పేర్లు మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈగల పెంటను 'కృష్ణ గిరి', దోమల పెంటను ‘బ్రహ్మగిరి'గా మార్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు కొత్త పేర్లతో మార్చాలని అధికారులు ఆదేశించారు.
Read More...
State 

నెల్లూరు టీడీపీ కి భారీ షాక్

నెల్లూరు టీడీపీ కి భారీ షాక్ నెల్లూరు : రూరల్ నియోజకవర్గంలో టీడీపీ కి భారీ షాక్ తగిలింది. భారీగా టీడీపీ నుంచి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరిగాయి.వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి సమక్షంలో చింతరెడ్డి పాళెం లోని ఆనం విజయకుమార్ రెడ్డి కార్యాలయం నందు అధికార  టీడీపీ పార్టీ వీడి వైసీపీలో చేరిన 17వ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్ మరియు 17వ డివిజన్ నుంచి 200 కుటుంబాల వ్యక్తులు. ఈ సందర్భంగా 17వ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్  మాట్లాడుతూ...నాకు కార్పొరేటర్ పదవి జగన్ మోహన్ రెడ్డి  వల్ల వచ్చింది..టీడీపీ నాయకుల అరాచకాలు, ఇబ్బందులకు గురై విధిలేని పరిస్థితులలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమైనాము. నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త  ఆనం విజయకుమార్ రెడ్డి నాయకత్వం మీద నమ్మకంతో పార్టీలోకి రావడం జరిగింది. పార్టీ బలోపేతానికి నేను సాయ శక్తుల కృషిచేసి జగన్ మోహన్ రెడ్డి తో కలిసి నడుస్తానని చెప్పారు.ఈ సందర్భంగా ఆనం విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ...నెల్లూరు రూరల్ వైయస్ఆర్ సీపీలో చేరిన ప్రతి ఒక్కరికీ నేను అందుబాటులో ఉంటూ మీకు అండగా ఉంటానని తెలియజేశారు..ప్రతి ఒక్క నాయకుడు మరియు ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. గతంలో పార్టీని వీడిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరల తిరిగి పునరాలోచన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర అధ్యక్షుడు మరియు 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్, 17వ డివిజన్ ముఖ్య  నాయకులు సీహెచ్ ప్రభాకర్ రెడ్డి, హరిబాబు, గోపి, భాస్కర్, ఓబుల్ రెడ్డి, రూపేష్, చిన్న, ఉదయ్ భాస్కర్, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More...
State 

రేప్ కేసులో మహిళకు చివాట్లు పెట్టిన సుప్రీంకోర్టు

రేప్ కేసులో మహిళకు చివాట్లు పెట్టిన సుప్రీంకోర్టు న్యూ ఢిల్లీ : ఓ వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన మహిళకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ‘పెళ్లై పిల్లలుండి, తప్పని తెలిసి కూడా వివాహేతర సంబంధం కొనసాగించావు. అతడు అడగ్గానే హోటల్స్ కు ఎందుకెళ్లావు?' అని ఆమె పై కోర్ట్ ఫైరైంది. అతడికి పట్నా హైకోర్ట్  ఇచ్చిన బెయిల్ ను సుప్రీం కోర్ట్ సమర్థించింది. కాగా సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో  ఆ మహిళ సంబంధం పెట్టుకుంది. ఇటీవల భర్తతో విడాకులు తీసుకున్న ఆమె పెళ్లి చేసుకోవాలని అతడిని కోరింది. నిరాకరించగా రేప్ కేస్ పెట్టింది.
Read More...
State 

వ్యభిచారం చేయమని ఒత్తిడి.. నిరాకరించిందని ప్రియుడు చాకుతో పొడిచి హత్య

వ్యభిచారం చేయమని ఒత్తిడి.. నిరాకరించిందని ప్రియుడు చాకుతో పొడిచి హత్య అంబేద్కర్ కోనసీమ జిల్లా – రాజోలు రాజోలు మండలం బి.సావరం గ్రామం సిద్ధార్థనగర్ లో ఓ వివాహిత యువతిని ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఓలేటి పుష్ప (22) గతంలో వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. అనంతరం షేక్ షమ్మ (22) అనే యువకుడితో కలిసి గత ఆరు మాసాలుగా బి.సావరం గ్రామంలో అద్దె ఇంట్లో సహజీవనం చేస్తోంది. షమ్మ గత కొన్ని రోజులుగా మద్యంతాగి పుష్పను వ్యభిచారం చేయాలని గొడవపడుతూ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో "నా వెంట రావాలి" అంటూ మరోసారి అదే విషయంపై వాదన చోటుచేసుకుంది. పుష్ప నిరాకరించడంతో కోపంతో షేక్ షమ్మ ఆమెను చాకుతో ఎడమ రొమ్ము మీద, కాలిపై పొడిచి హత్య చేశాడు. దీనితో పాటు పుష్పను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆమె తల్లి గంగ, సోదరుడిని కూడా గాయపరిచి పరారయ్యాడు. తీవ్రంగా రక్తస్రావం అయిన పుష్ప ఘటనాస్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న రాజోలు సీఐ నరేష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. నిందితుడు షేక్ షమ్మ కోసం 2 టీమ్ లతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు....
Read More...